చిత్రం న్యూస్, వైరా: ఏన్కూర్ మాజీ మండల అధ్యక్షులు, తెలంగాణ ఉద్యమకారుడు గిద్దగిరి సత్యనారాయణను వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు పరామర్శించారు. గత కొన్ని రోజుల క్రితంసత్యనారాయణ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. శుక్రవారం వారి ఇంటికి వెళ్లిన లకావత్ గిరిబాబు సత్యనారాయణను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి, బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు పొన్నం హరికృష్ణ, భూక్యా ధర్మనాయక్, షేక్ చాంద్ పాషా, షేక్ బాజీ, రాచబంటి వీరభద్రం, ఇల్లూరి రాంబాబు తదితర నాయకులు పాల్గొన్నారు.

