చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి పెన్ గంగ నది ఒడ్డున నిర్మిస్తున్న భారీ శివాలయ నిర్మాణానికి బేలలోని హనుమాన్ ఫెర్టిలైజర్ యజమాని ఇట్టడి రాజారెడ్డి, ఆయన తనయుడు సుశాంత్ రెడ్డి విరాళం అందజేశారు. గురువారం ఆ గ్రామంలోని ప్రభుత్వ ఉద్యోగులకు రూ.21 వేలు విరాళo అందజేశారు. ఈ సందర్భంగా వారికి కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. గ్రామస్తులు పాల్గొన్నారు.

