*ఎమ్మెల్యే పాయల్ శంకర్ సమక్షంలో బీజేపీలో చేరిన రాంపూర్ మాజీ సర్పంచ్ లింగన్న, మాజీ ఉప సర్పంచ్ నందు తదితరులు
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: అన్ని గ్రామాల సమానాభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ పాలనకు ఆకర్షితులై ఎంతోమంది బీజేపీలో చేరుతున్నారని పేర్కొన్నారు. శనివారం భోరజ్ మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ లింగన్న, మాజీ ఉపసర్పంచ్ నందు తో పాటు సింగిల్ విండో డైరెక్టర్లు, పలువురు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే కండువాలను కప్పి పార్టీ లోనికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ..పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఎన్నికైన బీజేపీ పంచాయితీలకు రూ. 25 లక్షలు అందజేసేందుకు తనవంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామానికి మంచి చేయాలనే సదుద్దేశంతో బీజేపీలో చేరిన వారందరికీ తన పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు. ప్రజలతో మమేకమై గ్రామ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు తోట రమేష్, గాజుల సన్నీ తదితరులు పాల్గొన్నారు.

