చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం కేంద్రం లోని కాకతీయ యూనివర్సిటీ పరిధిలో మొదటి, మూడవ, అయిదవ సెమిస్టర్ విద్యార్థులకు పరీక్షలు ఈ నెల 18 నుంచి ఉంటాయని కీర్తన డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్ డా. వేముగంటి వరప్రసాద్ రావు ఒక ప్రకటన లో తెలిపారు. మొదటి సెమిస్టర్ వాళ్లకు 5 సబ్జెక్టు లు మాత్రమే ఉంటాయని, సమయం తక్కువ ఉందని విద్యార్థులు కష్టపడి ప్రిపేర్ కావాలన్నారు. పూర్తి వివరాలకు అనికేత్ సాగర్ ను సంప్రదించాలి అని ఆయన పేర్కొన్నారు.

