Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం

 -Advertisement-

కార్తిక పౌర్ణమి సందర్భంగా బాసర ఆలయంలో భక్తుల సందడి  

కార్తిక పౌర్ణమి సందర్భంగా బాసర ఆలయంలో భక్తుల సందడి

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్,మహారాష్ట్రల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వేదమంత్రోచ్ఛరణలతో సరస్వతి అమ్మవారికి అభిషేకం,అర్చన, మహా హారతి, గణపతి పూజ, సరస్వతి మంత్రపుష్పం, సరస్వతి పారాయణం పూజలను ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ముందుగా పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేసి అమ్మవారి చెంత భక్తులు కార్తిక దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు ఆలయ అర్చకుల చేత అక్షరాభ్యాసం, కుంకుమార్చన పూజలు చేయించారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో అంజనాదేవి, పోలీసులు తగు ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనానికి గంటల సమయం పట్టింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments