ఆర్ బీ ఎస్ కే ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని తర్నం (కే) గ్రామంలో డాక్టర్ స్వప్న ఆర్ బీ ఎస్ కే ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. అనారోగ్యంతో ఉన్నవారికి రక్త నమూనాలను సేకరించి రక్త పరీక్షలు చేశారు. అనంతరం రోగులకు ఉచిత మందులు పంపిణీ చేశారు. డాక్టర్ స్వప్న రోగులతో మాట్లాడుతూ..అందరూ శుభ్రంగా ఉండాలని, ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిలువ లేకుండా చూసుకోవాలన్నారు. జ్వరాలు వస్తే వస్తే డాక్టర్లను సంప్రదించాలని, మూఢనమ్మకాలను నమ్మకూడదని ఎప్పుడు ఏఎన్ఎంలు అందుబాటులో ఉంటారని అవసరమైతే పెద్ద ఆసుపత్రికి పంపిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫార్మసిస్ట్ ఓం ప్రకాష్. ఏఎన్ఎంలు సుజాత, గంగామణి, మందుల శ్యామల, అంగన్వాడీ సిబ్బంది ఉమా, ఆశ, ఆనందబాయి తదితరులు ఉన్నారు.

