Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం

 -Advertisement-

స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి

బేలలో మాట్లాడుతున్న మాజీ మంత్రి జోగు రామన్న

చిత్రం న్యూస్, బేల: స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాల్సిన స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ సీఎం రేవంత్ రెడ్డి ని పొగడ్తల్లో ముంచేయడం విడ్డూరంగా ఉందన్నారు. బేల మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన ముఖ్య నాయకుల సమావేశంలో మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొన్నారు . రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.  ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ..  కాంగ్రెస్ ప్రభుత్వం  ఏడాదిన్నర పాలన పూర్తి అయిన ఆరు గ్యారెంటీలలో ఒక్కటి కూడా సంపూర్తిగా అమలు చేయకపోవడం వారి అసమర్థతకు నిదర్శనం అన్నారు. నూతన రేషన్ కార్డులు అంటూ లబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూజ్స్తుందని ఎద్దేవా చేశారు. కనీసం బియ్యం ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. స్థానిక ఎమ్మెల్యే లబ్ధిదారుల పక్షాన నిలవాల్సింది పోయి కాంగ్రెస్ ముఖ్యమంత్రిని మెచ్చుకోవడమే కాక ముఖ్యమంత్రి సైతం శంకర్ మనవాడే అని మాట్లాడటం కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే ఆత్మ అని చెప్పడానికి నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో రౌతు మనోహర్, సతీష్ పవార్, ప్రమోద్ రెడ్డి, యాసం నర్సింగరావు, ప్రహ్లాద్, గంభీర్ ఠాక్రే, విపిన్ ఖోడె తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments