లక్కవరంలో పాఠ్యపుస్తకాలు పంపిణీ
చిత్రం న్యూస్, జంగారెడ్డిగూడెం, రూరల్: పాఠశాల విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని కూటమి నాయకులు అన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలోని జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను కూటమి నాయకుల చేతుల మీదుగా సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ.. పాఠశాలల ప్రారంభం రోజే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పేరుతో 9 రకాల వస్తువులతో కిట్లు పంపిణీకి విద్యాశాఖ ఏర్పాట్లు చేసిందన్నారు. అదే విధంగా సన్న బియ్యంతో మధ్యాహ్నం భోజనం విద్యార్థులకు అందించడం తో విద్యార్థుల తల్లిదండ్రులలో మరింత ఆనందం కనిపిస్తుందని అన్నారు .ఈ కార్యక్రమంలో హెచ్ఎం తో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.