సామాజిక న్యాయం కోసం కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి
*మానకొండూర్ శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ
చిత్రం న్యూస్, శంకరపట్నం: దేశంలోనే తెలంగాణ సామాజిక న్యాయం కోసం పాటుపడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాత్రమేనని మానకొండూరు శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ అన్నారు. అంబల్పూర్ గ్రామానికి చెందిన తిప్పబత్తిని కవిత, సముద్రాల రాయ మల్లుకు సీఎం ఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే కవంపల్లి, టీపీసీసీ సభ్యులు మాజీ జడ్పిటిసి బత్తిని శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ మండల కమిటీ అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్ పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల కోసం కృషి చేస్తున్నాడన్నారు. ఎస్సీ,బీసీ, ఎస్టీ, మైనారిటీలకు అన్ని వర్గాల ప్రజలకు సేవ చేస్తున్నాడన్నారు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి, అంబల్పూర్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు వడ్లకొండ వినోద్, ఏగుర్ల ఎల్లయ్య. జక్కి రవి, మాజీ సర్పంచ్ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.