ఇందిరమ్మ ఇండ్లకు ప్రొసీడింగ్ అందజేసిన కార్యదర్శి శ్రీకాంత్
▪️ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గుపోసిన హౌసింగ్ ఏ ఈ మహమ్మద్ అలీ – కార్యదర్శి శ్రీకాంత్
చిత్రం న్యూస్ శంకరపట్నం:
శంకరపట్నం మండలంలోని అంబల్పూర్ గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ప్రొసీడింగ్లను శనివారం రోజున గ్రామ కార్యదర్శి శ్రీకాంత్, గ్రామ కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. 13 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్ లను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మ కమిటీ అధ్యక్షుడు జక్కి రవి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కృషి వల్లనే తమ గ్రామానికి ఇండ్లు మంజూరు అయ్యాయని అన్నారు. గ్రామ శాఖ అధ్యక్షుడు ఏగుర్ల ఎల్లయ్య మాట్లాడుతూ.. తమ గ్రామానికి ఇండ్లు మంజూర అయినాయని వాటిని సత్పరమే పూర్తి చేయాలని ఆయన తెలిపారు. వడ్డకొండ వినోద్ మాట్లాడుతూ.. గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి ఇండ్లు మంజూరు కాలేదని ఇప్పుడు మాత్రం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హయాంలో మంజురు అయినాయని ప్రశంసలు కురిపించారు. ఇండ్ల నిర్మాణానికి కావాల్సిన ఇనుప రాడ్లు. ఇసుక. తదితర సామాగ్రి కావలసినవారు తమను సంప్రదించాలని ఆయన అన్నారు .హౌసింగ్ ఏఈ మహమ్మద్ అలీ ,కార్యదర్శి శ్రీకాంత్ ఇండ్లకు ముగ్గు పోయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాశం కైలాప్ రెడ్డి, కొండల్ రెడ్డి ,మాజీ సర్పంచ్ రాజిరెడ్డి ,బుర్ర స్వామి ,కరబర్ లింగమూర్తి ,పెద్ద కురుమ,గుడిసె కొమరయ్య ,తదితరులు పాల్గొన్నారు.