Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం
Home Adilabad బండి సంజయ్ ను బద్నాం చేయొద్దు:ఎమ్మెల్యే పాయల్ శంకర్ 

బండి సంజయ్ ను బద్నాం చేయొద్దు:ఎమ్మెల్యే పాయల్ శంకర్ 

0
68

బండి సంజయ్ ను బద్నాం చేయొద్దు:ఎమ్మెల్యే పాయల్ శంకర్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై జరుగుతున్న ప్రచారాన్ని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ. రాజకీయ ప్రయోజనాల కోసమే కేసును తెరపైకి తెచ్చి బీజేపీని, బండి సంజయ్‌ను బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు.

*మహిళల పక్షపాతి బీజేపీ: బీజేపీ ఎల్లప్పుడూ మహిళలను గౌరవించే పార్టీ అని, పార్లమెంట్‌లో మహిళా బిల్లును ప్రవేశపెట్టిన ఘనత తమదేనని పాయల్ శంకర్ గుర్తు చేశారు. ఆ బిల్లు వీగిపోవడానికి కారణమైన పార్టీలే నేడు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని విమర్శించారు.

*విచారణకు సిద్ధం: “తప్పు ఎవరు చేసినా తప్పే. చట్టం ముందు అందరూ సమానమే. ఈ కేసుపై ప్రభుత్వం సిట్ వేసింది. విచారణకు తాము సిద్ధమని బండి సంజయ్ స్వయంగా ప్రకటించారు. కానీ నిజానిజాలు తేలకముందే ఒక బీసీ బిడ్డను దోషిగా చిత్రీకరించడం సరికాదు” అని ఆయన పేర్కొన్నారు. వ్యక్తిగత విషయాలను రాజకీయ కోణంలో చూడటం మానుకోవాలని, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్న వారికి సూచించారు.  కార్యక్రమంలో బీజేపీ నాయకులు జోగు రవి, రఘుపతి, కుంచెట్టి సంతోష్, దారట్ల జీవన్, దయాకర్, ఆకుల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Logo
LIVE
✖ Close హోం