-Advertisement-

ఘనంగా మే డే వేడుకలు: పాల్గొన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్, కలెక్టర్ రాజర్షి షా

 ఘనంగా మే డే వేడుకలు: పాల్గొన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్, కలెక్టర్ రాజర్షి షా

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని మేస్త్రి సంఘ భవనంలో శుక్రవారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవ (మే డే) వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. శ్రమ శక్తికి గౌరవం దక్కాలన్నదే మే డే ఉద్దేశమని, కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

అనంతరం కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో కార్మికుల పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని, వాటిని ప్రతి కార్మికుడు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్మికులకు వివిధ అంశాల్లో శిక్షణ అందిస్తున్న పలువురు సిబ్బంది సేవలను గుర్తించిన కలెక్టర్, ఎమ్మెల్యే, వారికి ప్రశంసా పత్రాలను, మెమెంటోలను అందజేసి అభినందించారు. ఈ వేడుకల్లో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ దాసరి గంగారాం, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అరుగుల అశోక్, ఉట్నూర్ ఐటీఐ ఏటీఓ ఆర్.శ్రీనివాస్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ రాజేశ్వరి, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చందన్ కుమార్ పాల్గొన్నారు. మేస్త్రీ సంఘం నాయకులు బండారి పోశన్న, సామల సత్యనారాయణ, రమేష్‌తో పాటు ఇతర అధికారులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments