ఘనంగా శ్రీ నరసింహ స్వామి కల్యాణ మహోత్సవం :పాల్గొన్న భైంసా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జాదవ్ రాజేష్ బాబు
చిత్రం న్యూస్, లోకేశ్వరం: నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం నరసింనగర్ తండా గ్రామపంచాయతీలోని శ్రీ నరసింహస్వామి ఉత్సవాలు గురువారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ ఎత్తున ప్రజలు శ్రీ నరసింహ స్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భైంసా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ రాజేష్ బాబు కుటుంబ సమేతంగా స్వామివారి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి పల్లకీ మోశారు. ప్రజలు అందరూ సంతోషంగా, ఆరోగ్యముగా ఉండాలని స్వామివారిని వేడుకున్నారు. జాదవ్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.

