సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా బాసర అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు
చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లాలోని బాసర అభివృద్ధి అంటేనే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల సీఎం చంద్రబాబు నాయుడనీ అంటున్నారు ఇక్కడి స్థానికులు. ఆయన హయాంలో తిరుమల, తిరుపతి దేవస్థానం గెస్ట్ హౌస్ తో పాటు అర్బన్ డెవలప్మెంట్ హుడా, జన్మభూమి, సీసీ రోడ్ల నిర్మాణం, వస్తున్న మీకోసం పాదయాత్రలో భాగంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ క్షేత్రాన్ని నలుమూలలకు తీసుకెళ్లిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని వారి అభిమానులు పేర్కొన్నారు. గత 2005-2010 వ సంవత్సరం మధ్య కాలంలో మహారాష్ట్ర గోదావరి నదిపై నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్ట్ వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, శ్రీరాంసాగర్లోకి నీరు రాదని చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేసింది. దీనిలో భాగంగా 2010లో బాబ్లీ వద్ద ధర్నాకు యత్నించినందుకు మహారాష్ట్ర పోలీసులు చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి,కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.సోమవారం బాసరలో ఆయన అభిమానులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 76వ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దీంతో పాటు ప్రధాన రహదారి బస్టాండ్ వద్ద ఏపీ సీఎం ఫ్లెక్సీ లను ఏర్పాటుచేసిన వారిలో ఉప్పుల్ల లక్ష్మణ్ , నాగేష్, సాయి, సురేష్, చంద్రమోహన్, గణేష్, దేవ్ భాయ్,అల్లం రాజు తమ అభిమానాన్ని చాటుకున్నారు.

