Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం
Home Adilabad బేలలో ప్రజా పాలనా..ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం

బేలలో ప్రజా పాలనా..ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం

0
17

బేలలో ప్రజా పాలనా..ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ప్రజా పాలనా- ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం ఎంపీడీఓ మహేష్ కుమార్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల ప్రత్యేక అధికారి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.సమావేశ ప్రారంభోత్సవం ముందుగా జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంతో ప్రారంభించారు. అనంతరం ఎంపీడీఓ మండల స్థాయి ప్రగతి నివేదికను చదివి వినిపించారు. ఇందులో రైతుభరోసా,సబ్సిడీ గ్యాస్,తదితర సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు మండలానికి 21 కోట్లు రావడం జరిగిందన్నారు. అదేవిదంగా మండల స్థాయి అధికారులు తమ తమ ప్రగతి నివేదికను సమావేశంలో చదివి వినిపించారు.సమావేశంలో పలు స్టాళ్లను ఏర్పాటు చేశారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గర్భిణులకు సీమంతం నిర్వహించారు.

ఈ సందర్బంగా మండల ప్రత్యేక అధికారి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం వివిధ శాఖలకు సంబందించిన మండల స్థాయి అధికారులు తమ తమ నివేదికలను వివిరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, జిల్లా విద్యాధికారి మహాలక్ష్మి, మండల వైద్యాధికారి, కృష్ణవంశీ, మండల పశువైద్యాధికారి డా. దీప్ రతన్, మండల వ్యవసాయ అధికారి సాయి తేజ రెడ్డి, మండల హౌసింగ్ ఏఈ లింగం, మండల సర్పంచ్ సంఘం అధ్యక్షుడు అశోక్ టాక్రే, తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Logo
LIVE
✖ Close హోం
WhatsApp