-Advertisement-

అంబేద్కర్ జయంతి వేడుకల్లో ప్రముఖులకు చిత్రపటాల అందజేత

అంబేద్కర్ జయంతి వేడుకల్లో ప్రముఖులకు చిత్రపటాల అందజేత

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, భారతరత్న డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. షెడ్యూల్డ్ కులాల సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దళిత, యువజన సంఘాల సమితి ప్రతినిధులు ముఖ్య అతిథులకు అంబేద్కర్ చిత్రపటాలను అందజేసి గౌరవించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్, శాసనసభ్యులు పాయల్ శంకర్, జిల్లా కలెక్టర్ రాజర్షిషా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్, డీఎస్పీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. వారితో పాటు జిల్లా గ్రంథాలయ చైర్మన్ నర్సింలు, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ బండారి అనూష సతీష్, వైస్ చైర్మన్ మొహమ్మద్ రోహిత్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సునీత మనోహర్ తదితరులు హాజరయ్యారు.

దళిత సంఘాల ప్రతినిధులు బాలశంకర్ కృష్ణ, దుర్గం శేఖర్, ఊరే గణేష్, భీంరాం వాగ్మారె, అల్లూరి భూమన్న, మాల్యాల మనోజ్, నక్కా రాందాస్, చందన రాజన్న, కౌన్సిలర్లు బోడిగం శ్రీకాంత్, కృష్ణ, సంజయ్, కడ్డారపు ప్రవీణ్, దర్శనాల నగేష్, మరెల్లి మల్లేష్, అశోక్, సోగల సుదర్శన్, నిమ్మల ప్రశాంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని బాబాసాహెబ్ ఆశయాలను స్మరించుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments