చిత్రం న్యూస్, సాత్నాల: హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్కు చెందిన ప్రముఖ వైద్యులు డా. కళ్ళెం జీవిత, డా.కళ్ళెం వెంకట్ రెడ్డి దంపతులు తమ భక్తిని చాటుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలం మేడిగూడ గ్రామంలో వెలసిన ఆంజనేయ స్వామికి వారు వెండి కిరీటాన్ని కానుకగా సమర్పించారు.
ఈ సందర్భంగా మేడిగూడ గ్రామానికి విచ్చేసిన డాక్టర్ దంపతులకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలు, మంగళ హారతులతో గ్రామం కోలాహలంగా మారింది. కుటుంబ సమేతంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారికి వెండి కిరీటాన్ని అలంకరించారు.
గ్రామ అభివృద్ధికి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వైద్యులు అందిస్తున్న సహకారం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


