* రూ.3.85 లక్షల సబ్సిడీతో డ్రోన్, పనిముట్లు పంపిణీ
చిత్రం న్యూస్, నిర్మల్ :ఆధునిక వ్యవసాయ యంత్రాల వినియోగం రైతులకు పనులను సులభతరం చేస్తుందని, సమయం, డబ్బు ఆదా అవుతుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ లో సారంగాపూర్ మండలం కౌట్ల (బి) రైతు సంఘానికి రూ.3.85 లక్షల సబ్సిడీతో డ్రోన్, పనిముట్లు పంపిణీ చేశారు. ఈ యంత్రాల వల్ల తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు.సారంగాపూర్ మండలం కౌట్ల (బి) రైతు సంఘానికి చెందిన రైతులకు రూ.3.85 లక్షల సబ్సిడీతో ఆధునిక డ్రోన్, వ్యవసాయ పనిముట్లను కలెక్టర్ అభిలాష అభినవ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, యంత్రాల వినియోగం వల్ల వ్యవసాయ పనులు మరింత సమర్థవంతంగా జరుగుతాయని తలిపారు


