చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలోని రేణుకపూర్ దక్షిణముఖి హనుమాన్ ఆలయ అభివృద్ధి కోసం గ్రామానికి చెందిన బాపూజీ జ్ఞానిపటేల్ తనయుడు పుట్టినరోజు సందర్భంగా రూ.లక్ష చెక్కును గురుస్వామి శ్రీనివాస్ కు అందజేశారు. ముందుగా హనుమాన్ స్వామి సన్నిధిలో జ్ఞాని పటేల్ ప్రత్యేక పూజలు చేశారు. వీరికి గురుస్వామి ఆంజనేయస్వామి హారతి అందజేసి ఆయనకు శాలువాతో సన్మానించి ఆశీర్వదించారు. ఇలాంటి మన పురాతన హిందూ దేవాలయాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న జ్ఞాని పటేల్ ను ఆంజనేయ స్వాములు అభినందించారు. ఇటీవలే రేణుకాపూర్ హనుమాన్ ఆలయ అభివృద్ధి కోసం భక్తులు తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు.


