చిత్రం న్యూస్, భోరజ్: ఆదిలాబాద్ జిల్లా పిప్పర్వాడ గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం రైతు ఆత్మహత్య చేసుకున్న నలగంటి దేవన్న కుటుంబానికి రూరల్ డెవలప్మెంట్ సర్వీస్ సొసైటీ ద్వారా రూ.50 వేలు ఆర్థిక సాయం అందజేశారు. జీవనోపాధి కోసం అందజేసిన నగదు తో కొనుగోలు చేసిన అయిదు మేకలను నలగంటి సుజాతకు అందజేశారు. ఈ నగదు అందడానికి రైతు స్వరాజ్య వేదిక అధ్యక్షులు సంగెపు బొర్రన్న, కిసాన్ మిత్ర కోఆర్డినేటర్ ఆవుల రాకేష్, గ్రామ సర్పంచ్ నోముల సంతోష్ రెడ్డిలు కృషి చేయడంతో ఈ సందర్భంగా బాధిత కుటుంబం కృతజ్ఞతలు తెలిపారు.
