చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర వేదభారతి పీఠం ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ వేద విద్యానంద స్వామీజీ సహకారంతో శనివారం రోజు సాయంత్రం గోపూజ, రుద్రాభిషేకం, త్రినాథ వ్రతం, గోహారతి పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. గోమాత అనుగ్రహంతో ఋణ బాధలు, సకల దోషాలు తొలగిపోయి, సత్సంతాన ప్రాప్తి, శీఘ్ర కళ్యాణం, అష్టైశ్వర్యాలు లభిస్తాయని వైదిక బృందం వెల్లడించారు.కార్యక్రమంలో పుర ప్రముఖులు, గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గోవులకు గోహారతులు ఇచ్చారు. అనంతరం, ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.




