చిత్రం న్యూస్, బేల: ఇటీవల మహారాష్ట్ర, తెలంగాణ మొక్కల మధ్య సంబంధాలు, జీవ వైవిధ్యం మొదలైనవి వివరిస్తూ మహారాష్ట్ర నుండి డా సారిక నందకిశోర్ సంగెకర్ తెలంగాణ నుండి డా.వేముగంటి వరప్రసాద్ రావు రచించిన గ్రంథం ఎంతో స్ఫూర్తి దాయకమని మహారాష్ట్రలో ఒక సదస్సులో డా. బాబా సాహెబ్ అంబేద్కర్ యూనివర్సిటీ పరిధిలోని శ్రీ యోగీశ్వరి మహావిద్యాలయ్ లో సీనియర్లు అభినందించారు. ఇది చాలా మంచి గ్రంథము అని భవిష్యత్తులో ఇంకా వీరు పరిశోధనలు కొనసాగించి జీవవైవిధ్య పరిరక్షణకు ముందుకుపోవాలన్నారు. ఈ కార్యక్రమంలో యోగేశ్వరి ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బర్దాపుర్కర్, వైస్ ప్రెసిడెంట్ జి.బి.వ్యాసుడు, డైరెక్టర్ అడ్వా కళ్యాణి విరాధే,, కార్యదర్శి కమలాకర్ చౌసల్కర్, జాయింట్ సెక్రటరీ భీమశంకర్ శేతే, కళాశాల ఇంచార్జి L. K. గోలెగావ్కర్, ప్రిన్సిపాల్ డా. M.V. కనెట్కర్, వైస్ ప్రిన్సిపాల్ డా. R.V. కులకర్ణి, కార్యాలయ సూపరింటెండెంట్ అజయ్ చౌదరి పాల్గొన్నారు.




