-Advertisement-

ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఆత్మ ఛైర్మన్ సంతోష్ రావ్ 

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని దహెగావ్ గ్రామంలో పలు ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం ఆదివారం కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ జిల్లా ఆత్మ కమిటీ చైర్మన్ సంతోష్ రావ్, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ విలాస్ పాటిల్, మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి తరపున లబ్ధిదారులకు నూతన వస్త్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా ఆత్మ చైర్మన్ సంతోష్ రావ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదల కోసం చేపడుతున్న గృహ నిర్మాణ పథకం ప్రజలకు ఎంతో ఉపయోగ పడుతున్నాయన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద సొంత స్థలం ఉండి ఇల్లు లేని పేదలకు రూ.5లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందింస్తుందన్నారు. గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణను మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. గ్రామంలో 37 ఇళ్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. రెండవ విడతలో ఇందిరమ్మ ఇళ్లను అదనంగా ఇస్తామని పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments