చిత్రం న్యూస్, బాసర :నిర్మల్ జిల్లా బాసర మండలంలోని కీర్గుల్ (కె) గ్రామానికి నూతన రామ మందిరం నిర్మాణానికి ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ప్రోసిడింగ్ కాపీని అందజేశారు. రామ మందిరం నిర్మాణానికి 25 లక్షలు నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, స్థానిక ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కు గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మలేగాం సురేష్, మాజీ సర్పంచ్ దే వేందర్, గ్రామ పెద్దలు సగుల్లా శ్రీనివాస్, బంటు రవి, సురేష్, సంతోష్, ఏ. పోతన్న, మహేందర్, గంగాధర్, రాములు, శంకర్, లక్ష్మణ్, సీనియర్ నాయకులు ఉన్నారు.



