చిత్రం న్యూస్, బాసర:నిర్మల్ జిల్లా ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామరావు పటేల్ అ సెంబ్లీలో బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలపై ప్రస్థావించినందుకు విద్యార్థులు శాలువాతో సన్మానించారు. శనివారం భైంసాలోని ఎమ్మెల్యే నివాసంలో వారు కలిశారు. అసెంబ్లీ సాక్షిగా తమ సమస్యలను విన్నవించి, ప్రభుత్వ దృష్టికి తెచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ట్రిపుల్ ఐటీ అభివృద్ధి,కి, తమ సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం చేస్తున్న ఎమ్మెల్యే సేవలను ఎప్పటికి గుర్తించుకుంటామన్నారు. విద్యాభివృద్ధికి పాటు పడుతూ పేద విద్యార్థుల సంక్షేమానికి పాటు పడుతున్నారని, తమకు ఎల్లవేళలా అండగా ఉండాలని కోరారు.



