చిత్రం న్యూస్, అదిలాబాద్:రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఉపవాస దీక్షలు ఆచరిస్తున్న ముస్లింల కోసం శుక్రవారం సాయంత్రం జిల్లాకేంద్రంలోని ఖానాపూర్ లోగల జోహరా మస్జీద్ లో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి డీసీసీ మాజీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ తో కలిసి తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి పాల్గొని ముస్లిం సోదరులకు పండ్లను తినిపించి పండగ శుభాకాంక్షలు తెలిపారు.ఇఫ్తార్ విందు ఆత్మీయత,మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రంజాన్ పండగను స్నేహ సంబంధాలతో జరుపుకోవాలని ముందస్తుగా ఈద్ ముబారక్ తెలిపారు. కార్యక్రమంలో ఫహీమ్ ,డాక్టర్ గౌస్, అలీమ్ ,అయూబ్, చోటూ, నజీజ్, ముర్తుజా, అజీజ్, అఫ్సర్ ఖాన్, శివాజీ కాంబ్లే తదితరులు ఉన్నారు.


