-Advertisement-

గౌతమ బుద్ధుడు చూపిన మార్గంలో పయనించాలి:ప్రముఖ బౌద్ధ బిక్షువు ధమ్మ బోధి

చిత్రం న్యూస్ ముథోల్ : ప్రపంచానికి శాంతి, అహింసను బోధించిన గౌతమ బుద్ధుడు చూపిన మార్గంలో పయనిద్దామని ప్రముఖ బౌద్ధ భిక్షువు ధమ్మ బోధి అన్నారు. మండల కేంద్రమైన ముథోల్లోని నాగ్ సేన్ నగర్ లోని శీల్ శాంతి బుద్ధ విహార్ లో భారతీయ బౌద్ధ మహాసభ ఆధ్వర్యంలో ఖేర్ దాన్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా సమతా సైనిక్ దళ్ సైనికులు కవాతు నిర్వహించారు. అనంతరం గౌతమ బుద్ధుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలకు దీప దూప పూజలు చేసి పంచశీలాలు త్రిశరాన్ని అందించారు. ఉపాసకులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు స్నేహభావంతో ఉండాలని సూచించారు. అదేవిధంగా మూఢనమ్మకాలకు దూరంగా ఉంటూ వైజ్ఞానిక మార్గాన్ని అనుసరించాలన్నారు. పంచశీలాలు త్రిశరనాలు అష్టాంగ మార్గాన్ని ఆచరించడంతో జీవితాన్ని సుఖవంతం చేసుకోవచ్చని పేర్కొన్నారు. యువత ఉన్నతమైన ఆశయంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఉపాసకులు బుద్ధ దర్శన యాత్ర ద్వారా ప్రత్యక్షంగా ప్రముఖ బౌద్ధ క్షేత్రాలను సందర్శించి ఉన్నతమైన అనుభూతిని పొందారన్నారు. ఈ సందర్భంగా బుద్ధవందనకు సంబంధించిన పాకెట్ బుక్కును ఉపాసకులకు పంపింణి చేశారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బౌద్ధ ఉపాసక, ఉపాసికలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments