సభ్యత్వ నమోదును సవాల్గా తీసుకోవాలి: మాజీ మంత్రి జోగు రామన్న
చిత్రం న్యూస్, ఆదిలాబాద్:
బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త సవాల్గా తీసుకొని విజయవంతం చేయాలని మాజీ మంత్రి, జోగు రామన్న పిలుపునిచ్చారు. గురువారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కార్యకర్తలకు సభ్యత్వ నమోదు, ఓటర్ అవగాహనపై ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రతీక అయిన బీఆర్ఎస్ పార్టీకి ప్రజల ఆదరణ రోజురోజుకూ పెరుగుతోందని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజల ఆశీస్సులతో మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.




