-Advertisement-

జనాభా గణనపై అవగాహన: కలెక్టర్ రాజర్షి షా సెన్సస్ మారథాన్ ప్రారంభం

జనాభా గణనపై అవగాహన: కలెక్టర్ రాజర్షి షా సెన్సస్ మారథాన్ ప్రారంభం

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జనాభా గణన ప్రాధాన్యతపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు సోమవారం ఉదయం స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుండి కలెక్టరేట్ వరకు ‘సెన్సస్ వాక్/మారథాన్’ నిర్వహించారు.

ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ రాజర్షి షా అవగాహన ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన స్వయంగా మారథాన్‌లో పాల్గొని ప్రజల్లో ఉత్సాహం నింపారు.

ఈ ర్యాలీలో అదనపు కలెక్టర్లు ఆర్.ఎస్. చిత్రు, రాజేశ్వర్, డీఆర్ఓ స్రవంతి, డీవైఎస్ఓ శ్రీనివాస్, ఈడీ మనోహర్, మెప్మా పీడీ రాజు, పర్యవేక్షకురాలు నలంద ప్రియతో పాటు తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు పాల్గొన్నారు.

ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, స్థానిక యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ర్యాలీ విజయవంతమైంది. కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments