ఇంటర్ ఫలితాల్లో పెద్దోళ్ల సాత్విక ఉత్తమ ప్రతిభ
చిత్రం న్యూస్, బాసర :నిర్మల్ జిల్లా బాసర గ్రామానికి చెందిన పెద్దోళ్ల సాత్విక అనే విద్యార్థిని ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. హైదరాబాదులోని ఓ ప్రైవేట్ కళాశాలలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న పెద్దోళ్ల సాత్విక 440 మార్కులకు గాను 438 మార్కులు సాధించి విశేష ప్రతిభ కనబరిచింది. సాత్విక ప్రతిభ కనబరచడంతో ఆమె తల్లిదండ్రులు పెద్దోళ్ల పుష్పలత రవి దంపతులు ఆనందంలో మునిగిపోయారు. తమ కుమార్తె కష్టపడి చదివి ఈ స్థాయికి చేరుకోవడం పట్ల గర్వంగా ఉందని వారు తెలిపారు. గ్రామంలోని పెద్దలు, ఉపాధ్యాయులు, స్నేహితులు ఆమెను అభినందిస్తూ భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు కాలనీవాసులు కలిసి సాత్విక ను సన్మానించి ఆమెను ప్రశంసించారు. క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడి చదివితే ఎలాంటి లక్ష్యాన్ని అయినా అవలీలగా సాధించవచ్చని సాత్విక నిరూపించి చూపిందని వారు పేర్కొన్నారు.

