Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం
Home Blog Page 98

ఆప్కాబ్ చైర్మన్ గా గన్ని వీరాంజనేయులు

0

ఆప్కాబ్ చైర్మన్ గా గన్ని వీరాంజనేయులు

*కుటుంబసభ్యులు, అభిమానుల నడుమ ప్రత్యేక పూజలు

*బాధ్యతల స్వీకరణ

చిత్రం న్యూస్, విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం అప్కాబ్ చైర్మన్ గా గన్ని వీరాంజనేయులు గారిని నియమించడంతో శుక్రవారం ఉదయం 7.55 నిమిషాలకు కుటుంబ సభ్యులు, తెలుగుదేశం అభిమానులు తోడురాగా అప్కాబ్ సిబ్బంది సమక్షంలో పదవీ భాద్యతలు స్వీకరించారు. వేదపండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి కార్యాలయం వద్ద కుటుంబ సభ్యులు అభిమానులూ, అధికారుల నడుమ గన్ని దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. ఈ సంధర్భంగా అప్కాబ్ సిబ్బంది ఎం.డి.ఎస్ఆర్.రెడ్డి, సిజిఎం, డిజిఎం,ఎజిఎం లతో పరిచయ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

అభివృద్ధికి తోడ్పడదాం.. మనందరం కలిసికట్టుగా పనిచేసి అప్కాబ్ అభివృద్దికి తోడ్పడదామని అన్నారు. ముందుగా అప్కాబ్ ఆవరణలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  పదవీ భాద్యతల అనంతరం సెంట్రల్ మానిటరింగ్ యూనిట్(సి సి కెమేరా యూనిట్)ను ప్రారంభించారు. అంతర్జాతీయ కోఆపరేటివ్ సంవత్సరం సంధర్భంగా ఆవరణలో మొక్క నాటారు.


 

రాజకీయాలతో సంబంధం లేకుండా గ్రామాల అభివృద్ధికి కృషి 

0

రాజకీయాలతో సంబంధం లేకుండా గ్రామాల అభివృద్ధికి కృషి 

*పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ 

చిత్రం న్యూస్, జైనథ్: రాజకీయాలతో సంబంధం లేకుండా గ్రామాల అభివృద్ధికి కృషి  చేస్తున్నానని ఎమ్మెల్యే పాయల్  శంకర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం దీపాయిగూడ గ్రామంలో శ్రీ రమ మందిరంలో రూ. 50 లక్షల నిధుల వ్యయంతో కళ్యాణ మండపం నిర్మాణానికి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. మాకోడ గ్రామంలో రూ.20 లక్షలతో  నిర్మించిన గ్రామ పంచాయతీ బిల్డింగ్ ను  ఆయన ప్రారంభించారు . అనంతరం ఆకుర్ల గ్రామంలో గ్రామ పంచాయతీ బిల్డింగ్ ని ప్రారంభించారు . ఆయన మాట్లాడుతూ.. అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు అందే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా మొదటి విడతగా గ్రామంలో 30 ఇళ్లను మంజూరు చేసుకోవడం జరిగిందన్నారు. ఒక మంచి ఆలోచనతో నీతితో ,విలువలతో కూడిన రాజకీయం చేస్తూ ముందుకు వెళుతున్నానని అన్నారు.

నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన అవకాశం వల్లనే అసెంబ్లీలో రైతుల సమస్యలపై మాట్లాడి వారి సమస్యలు పరిష్కారానికి కృషి చేయడం జరిగిందన్నారు. అధికారమనేది సొంతం కాదని.. ప్రజలకు సేవ చేయడమే ముఖ్యమని తెలిపారు. దీపాయిగూడలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఏ రోజు కూడా గ్రామానికి వచ్చిన దీపాయిగూడ గ్రామస్తులు తనకు మనస్ఫూర్తితో ఆశీర్వాదం అందించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో రవీంద్రనాథ్, బీజేపీ మండల అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి , మాజీ ఉప సర్పంచి తిప్పిరెడ్డి రాకేష్ రెడ్డి, ఎల్టి అశోక్ రెడ్డి, విశాల్, విజయ్, గంగాధర్  భూమన్న వేద వ్యాస్, భూమన్న, సింగడి రమేష్ రెడ్డి, వెంకట్ రెడ్డి, దత్త తదితరులు పాల్గొన్నారు

ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ 

0

ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ 

*ప్రజల నుంచి వినతుల స్వీకరించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు

చిత్రం న్యూస్, వినుకొండ:  గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలో ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ప్రజల నుండి వినతులు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ప్రజలు తమ సమస్యలను నేరుగా చీఫ్ విప్ కి తెలియజేయడంతో, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజా దర్బార్‌కు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను ఆయనతో విన్నవించుకున్నారు.  ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సామర్లకోట కుమార రామభీమేశ్వర స్వామి వారి ఆలయంలో యోగ ఆంధ్రా

0

సామర్లకోట కుమార రామభీమేశ్వర స్వామి వారి ఆలయంలో యోగ ఆంధ్రా

*పాల్గొన్న మాజీ హోం మంత్రి , పెద్దాపురం ఎంఎల్ఏ నిమ్మకాయల చిన రాజప్ప

చిత్రం న్యూస్,సామర్లకోట:

కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట కుమార రామభీమేశ్వర స్వామి వారి ఆలయంలో యోగ ఆంధ్రా-2025 కార్యక్రమం నిర్వహించారు. మాజీ హోం మంత్రి, పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షులు, DCCB చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ,పిఠాపురం డెవలప్మెంట్ అధికారిణి చైత్ర వర్షిణి , సామర్లకోట మున్సిపల్ కమిషనర్ శ్రీ విద్య , ఎంపిడిఓ హిమమహేశ్వరి, సామర్లకోట టౌన్ ప్రెసిడెంట్ దొమ్మేటి సరోజ్ వసు, అడబల కుమార్ స్వామి, మడగల శ్యామ్ కుమార్, కూటమి నాయకులు పాల్గొన్నారు

సామర్లకోట నుండి కాకినాడ వైపుకు వచ్చే కెనాల్ రోడ్డు రహదారికి ట్రాఫిక్ మళ్లింపు

0

సామర్లకోట నుండి కాకినాడ వైపుకు వచ్చే కెనాల్ రోడ్డు రహదారికి ట్రాఫిక్ మళ్లింపు

చిత్రం న్యూస్,కాకినాడ: సామర్లకోట నుండి అచ్చంపేట వెళ్లే భారత్ మాల రోడ్డుకు బ్రిడ్జిలు నిర్మాణంలో భాగంగా గడ్డర్లు లేపుతున్నందున ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ఓవర్ బ్రిడ్జి గడ్డర్ లాంచ్ కోసం సామర్లకోట నుండి కాకినాడ కలెక్టరేట్ వైపుకు వచ్చే కెనాల్ రోడ్డు రహదారికి ట్రాఫిక్ మళ్లింపు ఈనెల 7 నుండి 10 వరకు (పూర్తి 4 రోజులు) నిలుపుదల చేయడం జరిగిందని కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగిలి తెలిపారు. అదేవిధంగా అచ్చంపేట జంక్షన్ లో రోడ్డు పై గడ్డర్లు లేపుతున్నందున జూన్ 11 నుండి 13 తేదీ వరకు మూడు రోజుల పాటు ట్రాఫిక్ మళ్లించడం జరుగుతుందని ఇట్టి విషయాన్ని ప్రజలు గమనించి పోలీసు వారు సూచించిన మార్గాలలో తమ వాహనాలను మళ్లించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగిలి సూచించారు.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన కూటమి నాయకులు.

0

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన కూటమి నాయకులు.

చిత్రం న్యూస్,అమరావతి: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమంలో అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,ఉపముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్, మంత్రి పొంగూరు నారాయణ ఇతర మంత్రులు, పెద్దాపురం శాసనసభ్యులు శ్రీ నిమ్మకాయల చినరాజప్ప , ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు.

సీఎం సహాయ నిధి చెక్కు అందజేత

0

Njసీఎం సహాయ నిధి చెక్కు అందజేత

చిత్రం న్యూస్, పెద్దాపురం : పారాలసిస్ వ్యాధికి చికిత్స పొందుతున్న నవర గ్రామ నివాసి కొండపల్లి వీరాజుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.25,500 విలువైన చెక్కును పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కుమారుడు రంగనాగ్ అందజేశారు. ఈ సందర్భంగా చినరాజప్ప రంగనాగ్ కు తోట నాగ భూషణం (నాగబాబు) కృతజ్ఞతలు తెలిపారు.

పిచ్చికుక్క దాడిలో 6 గురికి తీవ్ర గాయాలు

0

పిచ్చికుక్క దాడిలో 6 గురికి తీవ్రగాయాలు

*సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

చిత్రం న్యూస్, సామర్లకోట: పిచ్చికుక్క దాడిలో 6 గురికి తీవ్ర గాయాలు
పిచ్చికుక్క దాడి చేసిన ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సామర్లకోట వీర రాఘవపురం డైలీ మార్కెట్ వద్ద గురువారం రాత్రి పిచ్చికుక్క దాడి చేసింది. దాడి చేసిన వారిని సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సామర్లకోట లో ప్రతి రోజు కుక్కలు ఎవరో ఒకరి ఇద్దరి మీద దాడి చేస్తూనే ఉన్నాయి .అధికారులు స్పందించి కుక్కల నుండి కాపాడాలి అని స్థానికులు కోరుతున్నారు.

ఘనంగా శ్రీ మాడలేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట

1

ఘనంగా శ్రీ మాడలేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట

చిత్రం న్యూస్, శంకరపట్నం: శంకరపట్నం మండలంలోని కన్నాపూర్ గ్రామంలో రజకుల కులదైవం శ్రీ మాడలేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. పూజారులు శ్రీమాన్ కలకుంట్ల మధుసూదనాచార్యులు, యజ్ఞచార్యులు శ్రీ కలకుంట్ల మురళికృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్టాపన వైభవోపేతంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలోని రజక సంఘం నాయకులు,వివిధ కుల సంఘాల పెద్దలు,మండల రజక సంఘం నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

రెండు లారీలు ఢీ, ఒకరి మృతి

0

రెండు లారీలు ఢీ, ఒకరి మృతి

చిత్రం న్యూస్, హుజూరాబాద్: హుజురాబాద్ మండలం తుమ్మనపల్లి స్టేజి వద్ద రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఒకరు మృతిచెందారు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. వరంగల్ నుంచి కరీంనగర్ వెళ్తున్న లారీ కరీంనగర్ నుండి వరంగల్ కు వెళ్తున్న లారీ ఎదురెదురుగా రెండు ఢీకొనడంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. దాదాపు రెండు గంటల సేపు ట్రాఫిక్ జామ్ అయింది. సింగపూర్ మీదుగా ట్రాఫిక్ ను మళ్ళించారు. లారీ డ్రైవర్ ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని వివరాలు తెలియాల్సిఉంది. జెసిబి సాయంతో లారీలను పక్కకు తప్పించి ట్రాఫిక్ క్లియర్ చేసారు.