Home Blog Page 97

బోథ్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేస్ నమోదు

                            ఉష్కేల దశరథ్ 

చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ పోలీసు స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు శనివారం  ఎస్సై శ్రీ సాయి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..బోథ్ కు చెందిన ఉష్కేల దశరథ్ (30) తన భార్య శైలజ, కుమార్తెతో కలిసి నిర్మల్ లో నివాసం ఉంటున్నారు. భార్య అనారోగ్యం కారణంగా గత 2 వారాల క్రితం బోథ్ కు రాగా భార్య తన పుట్టింటికి నేరడిగొండ వెళ్ళింది. దశరథ్ జులై 31 న నిర్మల్ వెళ్తానని చెప్పి ఎంతకూ తిరిగి రాలేదు. దీంతో  అతని భార్య శైలజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ,ఆచూకీ తెలిస్తే 87126 59932 ను సంప్రదించాలని ఎస్సై పేర్కొన్నారు.

✖ Close హోం

ఘనంగా ఆటో దినోత్సవ వేడుకలు 

 ఆటో దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న యూనియన్ నాయకులు

చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ పట్టణ కేంద్రంలోనీ బస్టాండ్ లో గల ఆటో స్టాండ్ వద్ద ఆటో దినోత్సవ వేడుకలను  ఘనంగా నిర్వహించారు. బోథ్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ.. పగలు, రాత్రి అని తేడా తెలియక ప్రజల కష్టాల్లో ఆటో డ్రైవర్లు స్పూర్తి ఎనలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్ లు పాల్గొన్నారు.

✖ Close హోం

వివేకానంద పాఠశాలలో వరలక్ష్మి పూజ 

వరలక్ష్మి పూజ నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు

చిత్రం న్యూస్, సొనాల: ఆదిలాబాద్ జిల్లా సొనాల మండల కేంద్రంలో వివేకానంద పాఠశాలలో ముందస్తుగా వరలక్ష్మి పూజ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మహిళా ఉపాధ్యాయులు వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణ చైతన్య, మేనేజ్ మెంట్ ఓరగంటి ఇస్తారి, కోస్మెట్టి శుద్దోదన్, మునిగెల శ్రీధర్ అధ్యాపక బృందం, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

✖ Close హోం

ఉపాధ్యాయ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

ఉపాధ్యాయ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

చిత్రం న్యూస్, జైనథ్ : ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలకేంద్రంలో ని ఆదర్శ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఇంగ్లీష్ టీజీటీ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపల్ రాము ఒక ప్రకటనలో తెలిపారు. ఆంగ్లంలో డిగ్రీ/ పీజీతో పాటు బీఎడ్, టెట్ అర్హత ఉండాలన్నారు. విద్యార్హతల నకలు పత్రాలతో పాటు బయోడేటాను పాఠశాలలో ఈ నెల ఐదో తేదీ లోగా సమర్పించాలని  పేర్కొన్నారు. న్యాయనిర్ణేతల సమక్షంలో డెమో ఆధారంగా ఎంపిక జరుగుతుందని వివరించారు.

✖ Close హోం

స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి

బేలలో మాట్లాడుతున్న మాజీ మంత్రి జోగు రామన్న

చిత్రం న్యూస్, బేల: స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాల్సిన స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ సీఎం రేవంత్ రెడ్డి ని పొగడ్తల్లో ముంచేయడం విడ్డూరంగా ఉందన్నారు. బేల మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన ముఖ్య నాయకుల సమావేశంలో మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొన్నారు . రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.  ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ..  కాంగ్రెస్ ప్రభుత్వం  ఏడాదిన్నర పాలన పూర్తి అయిన ఆరు గ్యారెంటీలలో ఒక్కటి కూడా సంపూర్తిగా అమలు చేయకపోవడం వారి అసమర్థతకు నిదర్శనం అన్నారు. నూతన రేషన్ కార్డులు అంటూ లబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూజ్స్తుందని ఎద్దేవా చేశారు. కనీసం బియ్యం ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. స్థానిక ఎమ్మెల్యే లబ్ధిదారుల పక్షాన నిలవాల్సింది పోయి కాంగ్రెస్ ముఖ్యమంత్రిని మెచ్చుకోవడమే కాక ముఖ్యమంత్రి సైతం శంకర్ మనవాడే అని మాట్లాడటం కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే ఆత్మ అని చెప్పడానికి నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో రౌతు మనోహర్, సతీష్ పవార్, ప్రమోద్ రెడ్డి, యాసం నర్సింగరావు, ప్రహ్లాద్, గంభీర్ ఠాక్రే, విపిన్ ఖోడె తదితరులు పాల్గొన్నారు.

✖ Close హోం

క్షేత్ర పర్యటనకు విద్యార్థులు

విద్యార్థులకు వివరిస్తున్న ఉపాధ్యాయులు

చిత్రం న్యూస్, జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని సెయింట్ థామస్ పాఠశాల విద్యార్థులు శుక్రవారం క్షేత్ర పర్యటనకు వావిలాల గ్రామానికి వెళ్ళారు. వావిలాల ఖాదీ గ్రామోద్యోగ ప్రతిష్టానము సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పట్టు పురుగు కాటన్ నుండి దారం ఎలా తయారవుతుందో తెలుసుకున్నారు . తర్వాత లావు దారం నుండి సన్నధారం ఎలా వస్తుందో చూపించారు. దారాలకు రంగులు ఎలా వేస్తారో సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ & ప్రిన్సిపల్ ఫాదర్ శరన్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు అవగాహన కల్పించడానికి క్షేత్ర పర్యటన చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

✖ Close హోం

ఘనంగా  జడ్పీ మాజీ చైర్మన్ కోనేరు కృష్ణకుమార్ జన్మదిన వేడుకలు

కాగజ్ నగర్ జడ్పీ మాజీ చైర్మన్ కోనేరు కృష్ణకుమార్ కు కేకు తినిపిస్తున్న నాయకులు 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: కాగజ్ నగర్ జడ్పీ మాజీ చైర్మన్ కోనేరు కృష్ణకుమార్  జన్మదిన వేడుకలను ఆదిలాబాద్ పట్టణంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లోక ప్రవీణ్ రెడ్డి , మిగతా నేతల నడుమ ఆయన కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు నాయకులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శభాకాంక్షలు తెలిపారు.  కార్యక్రమంలో నాయకులు భూపేందర్, ప్రసాద్, సోమ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

✖ Close హోం

అన్న బాహు సాటే జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

0

అన్న బాహు సాటే విగ్రహానికి పూలమాల వేస్తున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: తన రచనలతో సమాజాభివృద్ధికి కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి, సాహితీవేత్త అన్న బాహు సాటే అని, ఆయన జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు శుక్రవారం అన్న బాహు సాటే జయంతి సందర్భంగా ఆదిలాబాద్ లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అన్న బాహు సాటే జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే కోరారు. అదేవిధంగా ఆయనకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానన్నారు.. అనంతరం మాంగ్ సమాజ్ సభ్యులు తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించగా.. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ సంఘం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు

✖ Close హోం

‘ గుండె” నిండా అభిమానం

*నాగుల నరేష్ ఛాతీపై  పాయల్ శంకరన్న ఎమ్మెల్యే అని పచ్చబొట్టు

*అభిమాన నాయకుడు ఎమ్మెల్యే పాయల్ శంకర్ జన్మదినం సందర్భంగా రూ.1.50 లక్షలు సొంత ఖర్చుతో  2 కిలో మీటర్ల మేర ఫ్లెక్సీలు ఏర్పాటు

*పెండల్వాడకు చెందిన నాగుల నరేష్ పెల్లుబికిన అభిమానం

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం పెండల్వాడ గ్రామానికి చెందిన నాగుల నరేష్ కు ఎమ్మెల్యే పాయల్ శంకర్ అంటే గుండె నిండా అభిమానం. ఎలాగంటారా.. ప్రస్తుత ఎమ్మెల్యే పాయల్ శంకర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నాగుల నరేష్ బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ లో చేరారు. అప్పుడు పాయల్ శంకర్  అన్న ఎమ్మెల్యే అని ఎమ్మెల్యే కాక మునుపు తన ఛాతీపై పచ్చబొట్టు పొడిపించుకొని తన గుండె నిండా అభిమానాన్ని చాటాడు.

ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నాగుల నరేష్ తన అభిమాన నాయకుడు ఎమ్మెల్యే పాయల్ శంకర్ జన్మదినం సందర్భంగా ఆదిలాబాద్ రూరల్ మండలం బాలాజీ గార్డెన్ నుంచి ఠాకూర్ హోటల్ వరకు జన్మదిన ఫ్లెక్సీలను రూ.1.50 లక్షల వరకు సొంత ఖర్చులతో ఏర్పాటుచేసి తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. దారిపొడవునా వచ్చే వారంతా బీజేపీ యువ నాయకుడు నాగుల నరేష్ ది గుండె నిండా అభిమానం అంటూ ప్రజలు చర్చించుకుంటన్నారు.

✖ Close హోం

ఆరోగ్య ఉపకేంద్ర భవన నిర్మాణానికి భూమి పూజ

ఆరోగ్య ఉపకేంద్ర భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న ముధోల్ ఎమ్మెల్యే పీ.రామారావు పటేల్

చిత్రం న్యూస్,బాసర: నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో రూ.16 లక్షలతో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్ర భవన నిర్మాణానికి ముధోల్ ఎమ్మెల్యే పీ.రామారావు పటేల్ భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడానికి ఉప కేంద్రాలను నిర్మిస్తున్నామన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా వైద్య రంగాన్ని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటానని, ఈ క్రమంలో స్థానిక ప్రజలకు మరింత వేగవంతమైన మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. అధికారులు నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతకుముందు బాసర మండల కేంద్రంలోని రైతు వేదిక నందు 584 మంది లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు.

 

✖ Close హోం