Home Blog Page 95

ధర్నాలో పాల్గొననున్న సొనాల మండల కాంగ్రెస్ నాయకులు

 ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మహా ధర్నాలో  సొనాల మండల కాంగ్రెస్ నాయకులు

చిత్రం న్యూస్, సొనాల:  బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ఉద్దేశంతో  బుధవారం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మహా ధర్నాలోపాల్గొనేందుకు ఆదిలాబాద్ జిల్లా సొనాల మండల కాంగ్రెస్ నాయకులు  తరలివెళ్లారు.  ఈతామెంతో తమకంతా అన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తే కేంద్ర ప్రభుత్వం బిల్లు పాస్ చేయకుండా బీసీలను మోసం చేస్తున్నందుకుగాను అధిష్టానం పిలుపుమేరకు ఢిల్లీ నడిగడ్డ పైన జంతర్ మంతర్ వద్ద మహా ధర్నాలో పాల్గొననున్నామని తెలిపారు. కార్యక్రమంలో సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ రమేష్ బత్తుల, పట్టణ అధ్యక్షులు అనిల్, సీనియర్ నాయకులు గాజుల పోతన్న, కసిరి పోతన్న, మాజీ సర్పంచ్ వినోద్  పాల్గొన్నారు.

✖ Close హోం

అట్టహాసంగా క్రీడా పోటీలు ప్రారంభం

అట్టహాసంగా క్రీడా పోటీలు ప్రారంభం

చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ కిసాన్ గల్లి పాఠశాలలో స్థాయి క్రీడా పోటీలను ఎమ్మెల్యే పీ.రామారావు పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ..విద్యా రంగములో క్రమశిక్షణ, భారతీయ సంస్కృతిని రక్షించడములో శ్రీ సరస్వతీ విద్యాపీఠం మాత్రమే పనిచేస్తుందని పేర్కొన్నారు.శ్రీ సరస్వతీ విద్యాపీఠం అధ్యక్షులు తక్కళ్ల పల్లి తిరుపతి రావు మాట్లాడుతూ.. శరీర మాద్యమంఖలు, ధర్మ సాధనం మనము ఏమీ సాధించాలన్న మన శరీరము ఆరోగ్యం గా ఉండాలన్నారు.శరీరము ఆరోగ్యంగా ఉంటేనే మనసు ఆరోగ్యముగా ఉంటుందన్నారు .ఆటలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు. ఒత్తిడి అంతా దూరం అవుతుందన్నారు. ఈ పోటీలు పాఠశాల స్థాయి నుండి ప్రారంభమై జిల్లా, రాష్ట్ర, క్షేత్ర, జాతీయ స్థాయిలకు విస్తరిస్తాయాన్నారు. ఈ క్రీడలలో మొదటి స్థానంలో నిలిచిన క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటారన్నారు. కార్యక్రమానికి శ్రీ సరస్వతి విద్యాపీఠం సంఘటన కార్యదర్శి పీ.శ్రీనివాస్ రావు,శైక్షణిక ప్రముఖ్ కృష్ణమాచార్యులు, క్షేత్ర సంగీత ప్రముఖ్ మెట్టొల్ల సాయినాథ్, విభాగ్ శైక్షణిక ప్రముఖులు, మూడు పాఠశాలల ప్రధానాచార్యులు పాల్గొన్నారు.

✖ Close హోం

మహా గర్జన సభను విజయవంతం చేయండి

మహా గర్జన సభను విజయవంతం చేయండి

*పద్మశ్రీ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ

చిత్రం న్యూస్, భైంసా: ఆగస్టు 13న హైదరాబాద్‌లో జరిగే మహాగర్జన సభకు గ్రామంలో ఉన్న  పెన్షన్ దారులు  అధిక సంఖ్యలో తరలివచ్చి పాల్గొనాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా భైంసా, ఆర్మూర్ లో జరిగిన సభలో వికలాంగుల పెన్షన్ రూ.6 వేలు, వృద్దుల, వితంతువుల చేయూత పెన్షన్  రూ.4 వేలు, తీవ్రమైన వైకల్యం కలిగిన వారికి రూ.15 వేలు  పెంచాలని పద్మశ్రీ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. దివ్యాంగులు, వృద్ధుల పింఛన్‌ను పెంచకపోతే 13న హైదరాబాద్‌లో జరిగే మహాగర్జన సభను ఉద్ధృతం చేస్తామన్నారు.  నిర్మల్ జిల్లాలోని భైంసా మండలం వాలేగాం గ్రామ కమిటీ అధ్యక్షులు కత్తి పోచారం, ఉపాధ్యక్షులు కదం పోతన్న, ప్రధాన కార్యదర్శి బీరోల్ల భోజన్న, కార్యదర్శి గంటల్కర్ సాయన్న పాల్గొని మంద కృష్ణ మాదిగని మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానం చేశారు.

✖ Close హోం

రిమ్స్ లో  బాధితులకు పరామర్శ

రిమ్స్ ఆస్పత్రిలో బాధితులను పరామర్శిస్తున్న ఆత్రం సుగుణక్క, బోరంచు శ్రీకాంత్ రెడ్డి

చిత్రం న్యూస్, రిమ్స్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పిప్పల్ ధరి గ్రామానికి చెందిన తొడసం సోనేరావు ఇంట్లో ఆదివారం సాయంత్రం సిలిండర్ నుంచి గ్యాస్ లీకై ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి ఆరుగురికి గాయాలయ్యాయి .సోనేరావు తో సహా మరో అయిదుగురు తొడసం లక్ష్మణ్, బాపురావు, షేర్రావు, గంగాప్రసాద్, మహేష్ లను రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి సోమవారం ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వారికి అందుతున్న వైద్య సేవలను రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ ను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు.వారి వెంట కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర కన్వీనర్ సునిల్ జాదవ్, మావల మండల అధ్యక్షుడు ధర్మపురి చంద్ర శేఖర్, సీనియర్ నాయకులు నలిమేల నవీన్ రెడ్డి, పరంకుశం వెంకటేష్ తదితరులు ఉన్నారు.

 

✖ Close హోం

ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఏర్పాటుకు  విరాళం 

ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ నిర్మాణానికి  విరాళం  అందజేస్తున్న బీజేపీ ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విరాళం

చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా భైంసా డివిజన్ లో ప్రజలు, యువకులు  ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ నిర్మాణం చేస్తున్నందున నిర్మాణం కొరకు తమ వంతు విరాళంగా రూ.31వేల ను బీజేపీ ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అదిలాబాద్ ఇంచార్జ్ బోస్లే బాజీరావు కార్య నిర్వాహకులకు మంగళవారం నగదును అందజేశారు. ఈ సందర్భంగా బోస్లే బాజీరావు మాట్లాడుతూ…భైంసా డివిజన్లోని ప్రజలు, యువకులు, నాయకులు  ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర గురించి తెలుసుకోవాలని ఆయన విగ్రహాలు పెట్టడం వారిలో చైతన్యానికి స్ఫూర్తినిస్తుందని అన్నారు. కలగళ్ల యువకులను ఆదర్శంగా తీసుకొని. ప్రతి గ్రామంలోనూ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాలను ఏర్పాటు చేయడం కోసం  అందరూ ముందుకు రావాలని  సూచించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.

✖ Close హోం

గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ నీటి విడుదల చేసిన ఎమ్మెల్యే రామారావ్ పటేల్

గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ నీటిని విడుదల చేస్తున్న ఎమ్మెల్యే రామారావ్ పటేల్

చిత్రం న్యూస్,భైంసా: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ ప్రధాన కాలువ ద్వారా సాగు నీటిని మంగళవారం ఎమ్మెల్యే పీ.రామారావ్ పటేల్ విడుదల చేసారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి లో నిండక పోయినప్పటికీ ప్రస్తుతం వరి నాట్ల సమయం కావడం తో రైతుల సమస్య ను దృష్టిలో ఉంచుకోని నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. వాలేగాం, కుంసర్, కామోల్, పుస్పూర్ తో పాటు పలు గ్రామాల రైతులకు నీటి విడుదల వల్ల ఉపయోగకరంగా ఉంటుందన్నారు. వర్షాలు పుష్కలంగా కురిసి ప్రాజెక్ట్ లు చెరువు లు నిండి పంటలు పండాలని అయన ఆకాంక్షించారు. కార్యక్రమం లో ప్రాజెక్ట్ ఈఈ అనిల్,మాజీ ఎంపీపీ రజాక్, సీనియర్ నాయకులు సొలంకి భీమ్ రావ్ పటేల్ , పీఏసీఎస్  డైరెక్టర్ వడ్నపు శ్రీనివాస్, బీజేపీ పట్టణ అధ్యక్షులు రావుల రాము, నాయకులు రావుల పోశెట్టి, పండిత్ రావ్ పటేల్, తుమొల్ల దత్తాత్రి, అనిల్ తో పాటు ముధోల్, లోకేశ్వరం మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

✖ Close హోం

స్కూటీ డిక్కీ నుంచి రూ.5 లక్షల అపహరణ

స్కూటీ డిక్కీ నుంచి రూ.5 లక్షల అపహరణ

*అమెరికా నుంచి తండ్రికి డబ్బులు పంపిన కూతురు

*బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేసుకున్న తండ్రి

*స్కూటీ డిక్కీలో పెట్టుకొని ఇంటికి పయనం

*మధ్యలో భోజనం కోసం స్కూటీ నిలిపివేత

*హోటల్ వెళ్లి వచ్చే లోప డబ్బులు చోరీ

*బాధితుడు  ముథోల్ మండలం ఎడ్ బిడ్ నివాసి

చిత్రం న్యూస్, భైంసా:  నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో సోమవారం పట్టపగలు చోరీ జరిగిన ఘటన చోటు చేసుకుంది. ముథోల్ మండలంలోని ఎడ్ బిడ్ గ్రామానికి చెందిన బొంబోతుల ఆనంద్ అమెరికాలో ఉంటున్న తన కూతురు పంపిన డబ్బులను బ్యాంక్ నుంచి డ్రా చేసుకొని వెళ్తుండగా ఘటన జరిగింది. ఉదయం వేళలో ఎడ్ బిడ్ నుంచి స్కూటీపై బైంసాకు వచ్చిన ఆనంద్ స్థానిక యూనియన్ బ్యాంక్ నుంచి రూ.5 లక్షలు డ్రా చేసుకున్నాడు. అనంతరం వాటిని స్కూటీ డిక్కిలో పెట్టుకొని ఇంటికి బయలు దేరారు. ఇదే సమయంలో ఆకలి వేయడంతో పట్టణ సరిహద్దులోనున్న ఓ బార్ వద్ద తన స్కూటీని నిలిపి భోజనం కోసం లోనికి వెళ్ళాడు. ఇదే సమయంలో ఇద్దరు ఆగంతకులు ద్విచక్ర వాహనంపై బార్ వద్దకు చేరుకున్నారు. ఇందులో నుంచి ఒకరు స్కూటీ వద్దకు చేరుకొని డిక్కి తెరిచి అందులో నుంచి డబ్బులు ఆపహరించుకపోయాడు. భోజనం ముగించుకొని తిరిగి తన వాహనం వద్దకు రాగా స్కూటీ డిక్కీ తెరిచిఉండగా చూసి కంగారు చెందిన ఆనంద్ పూర్తిగా డిక్కీని తెరిచి చూడగా అందులో బ్యాంక్ నుంచి డ్రా చేసి పెట్టిన డబ్బులు కనిపించకుండా పోయాయి. డబ్బులు చోరికి గురయినట్లుగా గుర్తించిన బాధితుడు వెంటనే బార్ నిర్వాహకులకు సంబంధిత చోరి విషయాన్ని వివరించారు. అనంతరం పోలీసు స్టేషన్ కు వెళ్లి సంబంధిత విషయాన్ని వివరించారు. టౌన్ సీఐ గోపినాథ్ ఆధ్వర్యంలో పోలీసులు చోరి ఘటన చేదించేందుకు గాను సీసీ పుటేజీ పరిశీలించారు.అయితే దుండగులు బాసర మార్గం వైపు వెళ్లినట్లు సీసీ కెమెరాలో  దృశ్యాలు రికార్డ్ అయ్యింది.

✖ Close హోం

మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య

మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య

చిత్రం న్యూస్, బోథ్ : నిర్మల్ జిల్లా బాసర ట్రిబుల్ఐటీ లో సీటు రాలేదన్న మనస్తాపంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం బాధిత కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బోథ్ మండలం ధన్నూర్ గ్రామానికి చెందిన మునిమల వెంకటమ్మ కూతురు శైలజ (15) పదో తరగతిలో 563 మార్కులు సాధించి ట్రిబుల్ ఐటీలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్నారు. గత నెల జరిగిన కౌన్సిలింగ్ లో సీటు లభించకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయింది. ఇదే క్రమంలో పట్టణంలోని అటెండర్స్ కాలనీలో గల తన బాబాయ్ ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

✖ Close హోం

ఎమ్మెల్యే  పాయల్ శంకర్ జన్మదినం సందర్భంగా రక్తదానం చేసిన ఆలయ అర్చకుడు

రక్తదానం చేస్తున్న ఆలయ అర్చకుడు గుడిపాటి రామాంజనేయులు

చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్  జన్మదినం సందర్బంగా జైనథ్ మండలం లోని కూర గ్రామంలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకులు గుడిపాటి రామాంజనేయులు స్వచ్చందంగా  రక్తదానం చేశారు. కూర గ్రామానికి చెందిన నాయకులు, కార్యకర్తలు అర్చకునికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  బీజేపీ మండల అధ్యక్షుడు లోక కరుణాకర్ రెడ్డి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు ఏనుగు రాకేష్ రెడ్డి,  గిరిజన మోర్చా మండల అధ్యక్షుడు సిడం రాకేష్ , యువ నాయకులు సాయిప్రసాద్, సూర్య రెడ్డి, సాయి కుమార్, బిట్టులు పాల్గొన్నారు. 

✖ Close హోం

శ్రీ వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్

తిరుపతిలో కుటుంబ సభ్యులతో  ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్  తన జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర స్వామిని కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం  దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.  ఆదిలాబాద్ ప్రజలు పాడిపంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని  ఆ ఏడుకొండలవాడిని మొక్కుకున్నట్లు ఆయన తెలిపారు.

✖ Close హోం