Home Blog Page 90

ఘన వ్యర్ధాల నిర్వహణపై హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఒక్కరోజు శిక్షణా కార్యక్రమము

0

ఘన వ్యర్ధాల నిర్వహణపై హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఒక్కరోజు శిక్షణా కార్యక్రమము

చిత్రం న్యూస్, సామర్లకోట: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం  మేడపాడు గ్రామపంచాయతీ లోని సుప్రీమ్ LTC చెత్త నుండి సంపద తయారీ కేంద్రంలో మంగళవారం జిల్లా స్థాయి ఘన వ్యర్ధాల నిర్వహణపై హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఒక్కరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీవోలు , డిప్యూటీ ఎంపీడీవోలు శిక్షణలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సీఈవో వివిఎస్ లక్ష్మణ్ రావు , జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్ ,కాకినాడ పెద్దాపురం డివిజన్ల డీఎల్ డీవోలు వాసుదేవరావు, శ్యామల, డిఎల్పీవోలు అన్నామణి , బాలమణి, సామర్లకోట మండల పరిషత్ అభివృద్ధి అధికారి, కె.హిమమహేశ్వరి, అడిషనల్ రిసోర్స్ పర్సన్  పాలకుర్తి శ్రీనివాసచార్యులు, సర్పంచ్ పటానిదేవి,డిపిఆర్సి రిసోర్స్ పర్సన్స్ అచ్చిరాజు, రాజ్ కుమార్, దావీదు రాజు, ఫీల్డ్ టెక్నికల్ కోఆర్డినేటర్స్ గణేష్, రామకృష్ణ, లక్ష్మణ్ పంచాయితీ కార్యదర్శి ,భారతి తదితర సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.

✖ Close హోం

ఆదర్శ పాఠశాలలో యోగ శిక్షణ కార్యక్రమాలు

ఆదర్శ పాఠశాలలో యోగ శిక్షణ కార్యక్రమాలు

చిత్రం న్యూస్,బోథ్: ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో భాగంగా యోగా శిక్షణ కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో భాగంగా బోథ్ మండలం కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో సోనాల ఆయుష్ యోగా శిక్షకురాలు మునిగెల యోగిత విద్యార్థులకు యోగా శిక్షణ కార్యక్రమాల పైన అవగాహన కల్పించడంతోపాటు విద్యార్థులచే యోగాసనాలు వేయించారు. ఆమె మాట్లాడుతూ..యోగ చేయడం వల్ల మానసిక ఆరోగ్యమే కాకుండా శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉంటామని, యోగా నిత్యజీవితంలో భాగం అవ్వాలన్నారు. శారీరకంగా ఎన్నో రుగ్మతలను దూరం చేస్తుందని , మానసికంగా విద్యార్థులను దూరంగా చేసి పరీక్షల సమయంలో భయాన్ని పోగొడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ అనురాధ, ఉపాధ్యాయులు దత్తాద్రి, వ్యాయామ ఉపాధ్యాయురాలు శృతి, తదితర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

✖ Close హోం

విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలి 

విద్య సామగ్రి అందజేసిన విద్యార్థులతో బేల, జైనథ్ ఎస్సైలు మహేందర్, గౌతం

చిత్రం న్యూస్, జైనథ్: విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలని బేల, జైనథ్ ఎస్సైలు మహేందర్, గౌతం పవార్ అన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తమవంతుగా ప్రోత్సాహకాలను జైనాథ్, బేల ఎస్ఐ లు అందచేశారు. మంగళవారం జైనథ్ మండలం బెల్లూరి మండల పరిషత్తు ప్రాథమికోన్నత  పాఠశాలలో విద్యార్థులకు  విద్య సామగ్రి (నోటుబుక్కులు, పెన్నులు, అట్టలు), పాఠశాల అవసరానికి మైక్ సెట్ ను ప్రోత్సాహకంగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మేము కూడ ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకొని ఈ రోజూ ఇలా మీ ముందు ఎస్ఐ లుగా ఉన్నామని, కష్టాన్ని ఇష్టంగా మలచుకొని క్రమశిక్షణతో చదువుకుంటే అనుకున్న లక్ష్యాలను సాధిస్తామని అన్నారు. చిన్న వయసులోనే చదువుపై దృష్టి పెట్టాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, పిల్లలకు మంచి చదువు నేర్పించాలని, పాఠశాలకు పంపించడానికి తల్లితండ్రులు తమ వంతు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, యువకులు, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వారిని శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అనిల్, ఉపాధ్యాయులు గౌసుద్దీన్, నరేందర్,  అంగన్వాడి టీచర్ భూమబాయి, గ్రామ కార్యదర్శి చక్రవర్తి, ఆశ వర్కర్ వనజ,  గ్రామస్తులు సోమ రాంరెడ్డి, సింగిరెడ్డి రాంరెడ్డి, కుమ్ర బాజీరావ్, రాజు, పొట్టెన్న, గ్రామస్తులు పొచ్చన్న, మహేందర్ రెడ్డి,శంకర్, ధర్ము, లచ్చు, రాకేష్, దేవిదాస్, యవకులు అభిలాష్ రెడ్డి, వాకేశ్, విజయ్ రెడ్డి, సూరజ్, సిద్దార్థ, ప్రేమ్ కుమార్, పవన్,అఖిల్, రఘువీర్,వంశీ,ఆకాష్, సుజీత్  తదితరులు పాల్గొన్నారు..

✖ Close హోం

భజన మండలికి హార్మోనియం అందజేత

భజన మండలి సభ్యులకు హార్మోనియం అందచేస్తున్న కిరణ్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్ రూరల్: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని యాపల్ గూడ గ్రామంలోని హనుమాన్ భజన మండలి సభ్యులకు స్థానికుడు కొప్పుల కిరణ్ తన సొంత డబ్బులతో కొనిగోలు చేసి హార్మోనియం అందజేశారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ.. గ్రామాలలో ఆధ్యాత్మిక భావన పెరిగితేనే మానసిక ప్రశాంతత సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి ఒక్కరు భక్తి మార్గంలో నడవాలన్నారు. మన సంస్కృతీ, సంప్రదాయాలను మనమందరం కాపాడుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో భజన మండలి సభ్యులు తుడి రాకేష్, సిల్వర్ అశోక్, ఉష్కం గణేష్, దత్తు తదితరులు ఉన్నారు.

✖ Close హోం

సబ్ కలెక్టర్ ను కలిసిన జనసేన పార్టీ నేతలు

0

సబ్ కలెక్టర్ ను సన్మానిస్తున్న జనసేన పార్టీ నాయకులు

చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా భైంసా డివిజన్ లోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సబ్ కలెక్టర్ అజ్మీర సాంకేత్ కుమార్ ని జనసేన పార్టీ నిర్మల్ జిల్లా నాయకుడు సుంకేట మహేష్ బాబు, నేతలు ఆర్.గంగప్రసాద్, పీ.నారాయణ్ సోమవారం శాలువా కప్పి సన్మానించారు. పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్బంగా భైంసా డివిజన్ లోని పలు ప్రజాసమస్యలపై, బాసర  ఆర్జేయూకేటీ విద్యార్థుల స్థితిగతులపై విన్నవించారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి సమస్య ను సామరస్యంగా పరిష్కారం చేస్తామన్నారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు సహకరించాలని కోరారు.

✖ Close హోం

ఘనంగా రాజేష్ బాబు జన్మదిన వేడుకలు

0

ఘనంగా రాజేష్ బాబు జన్మదిన వేడుకలు

చిత్రం న్యూస్, లోకేశ్వరం: నిర్మల్ జిల్లా లోకేశ్వర్ మండలం రాజేష్ బాబు తండాకు చెందిన జాదవ్ రాజేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో బంజారా సమస్యలపై అనేక పోరాటాలు చేసిన ఘనత రాజేష్ బాబుది. పదవులో భాగంగా గతంలో ప్రభుత్వ ఉద్యోగిగా ఎంపీడీవో విధులు నిర్వహించినప్పటికీ రాజకీయ రంగ ప్రవేశం చేసి మార్కెట్ కమిటీ చైర్మన్ తో పాటు అనేక పదవులు సాధించారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో చురుగ్గా పాల్గొంటూ స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ తో కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నేరుగా రాజేష్ బాబుతో కేక్ కట్ చేసి తినిపించి పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించారు. నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అందరూ శాలువా, పూలమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శ్రీ వివేకానంద ఆవాసాన్ని సందర్శించి ఆవాస ఖర్చు కోసం విరాళంగా రూ.15 వేలు విరాళంగా అందజేశారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు,  అభిమానులు అందరూ కలిసి భైంసా గవర్నమెంట్ హాస్పిటల్ లో పేషెంట్స్ కు పండ్లు,  బ్రెడ్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు. నర్సింనగర్ తండాలో జాదవ్ రాజేష్ బాబు (మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, భైంసా) జన్మదినం సందర్భంగా నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో జన్మదిన వేడుకలు మరియు (బండరా) కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

✖ Close హోం

ప్రజల అవసరాలను గుర్తించే సంక్షేమ పథకాలు అమలు

కల్యాణలక్ష్మి చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ప్రభుత్వం ఏదైనా ప్రజల అవసరాలను గుర్తించి సంక్షేమ పథకాలను అందించడం జరుగుతోందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ అన్నారు. ఇందులో భాగంగానే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. ఆదిలాబాద్ లోని జడ్పీ సమావేశ మందిరంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ టౌన్ 132, మావల 9 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఆడపిల్లల పెళ్లిళ్లు చేసిన కుటుంబానికి ఆర్థిక భారం నుండి కాస్త ఉపశమనం కలిగించేందుకు ఒక లక్ష నగదు ఎంతో కొంత దోహదపడుతోందని అన్నారు. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి త్వరితగతిన చెక్కులు అందేలా అధికారులు సహకరించాలని కోరారు. పేదవారు ఆడపిల్లల పెళ్లిల్లు చేసేందుకు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే షాదీ ముబారక్ చెక్కులను అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, ఆర్డీవో స్రవంతి, అధికారులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

✖ Close హోం

టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు

0

టీడీపీలో చేరిన వైసీపీ నాయకులతో ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు 

చిత్రం న్యూస్, బాపట్ల: బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కర్లపాలెం మండలం పేరలి గ్రామానికి చెందిన వైసీపీ గ్రామ మాజీ ఎంపీటీసి,మాజీ సర్పంచ్ గొర్రెముచ్చు మీరయ్య థో పాటు మరో 24 మంది వైసీపీ పార్టీ నుండి టీడీపీ పార్టీలో చేరారు. నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గొర్రెముచ్చు మీరయ్య , విజయ్ కుమార్, సదానందరాజు, హరిబాబు, శ్రీను, పోలయ్య, వేదనాయక్, రత్నం, నాగేశ్వరరావు, దానియేలుల కోటయ్య,శోభన్, ఏసోబు, సముద్రాలు, తరుణ్, శంకర్, ప్రసాద్, దాలీషా, బాజీ, ఆశీర్వాదం, సురేష్, చైతన్య బాబు, సుభాని, సునీల్, మల్లీ, పార్టీలో చేరినవారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో కర్లపాలెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏపూరి భూపతి రావు, పిట్ల వసంత రెడ్డి, ప్యారలి గ్రామ పార్టీ అధ్యక్షుడు రాజా, కర్లపాలెం గ్రామ పార్టీ అధ్యక్షుడు బాజీ, తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

✖ Close హోం

ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి

0

అర్జీలను స్వీకరిస్తున్న కలెక్టర్ అభిలాష అభినవ్

చిత్రం న్యూస్, నిర్మల్ :ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ఆమె స్వయంగా అర్జీలు స్వీకరించారు. బాధితులకు సమస్య తెలుసుకొని పరిష్కారానికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు. వనమహోత్సవంలో నాటిన మొక్కల వివరాలు వెంటనే అప్డేట్ చేయాలని, ఇందిరమ్మ ఇండ్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన సర్వే, నులిపురుగుల నివారణ కార్యక్రమాలు వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఫేసియల్ రికగ్నైజింగ్ హాజరు పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.ఈ ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు పైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్న కళ్యాణి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

✖ Close హోం

ఘనంగా శివాంజనేయ,నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపన 

ఘనంగా శివాంజనేయ,నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపన

*పూజలు చేస్తున్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్

చిత్రం న్యూస్,బోథ్: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని బోథ్ ఎక్స్ రోడ్డు వద్ద గల ఆలయంలో సోమవారం ఘనంగా  శివాంజనేయ, నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. వేదపండితులు నమలికొండ సంతోష్ కుమార్ శర్మ ఆధ్వర్యంలోని బృందం గత మూడు రోజుల నుండి హోమ, యజ్ఞాది కార్యక్రమాలు చేపడుతున్నారు. సోమవారం ప్రాణప్రతిష్ట నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ హాజరయ్యారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలతో ప్రజల్లో ఆధ్యాత్మిక భావన పెంపొందుతాయి  అన్నారు. ఆలయంలో అభయాంజనేయ స్వామి, శివపంచాయతనం, సంతాన నాగేశ్వర స్వామితో పాటు నవగ్రహాల విగ్రహ ప్రతిష్ట నిర్వహించారు. వీరి వెంట ఇచ్చోడ మాజీ ఎంపీపీ నిమ్మల ప్రీతంరెడ్డి, ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

✖ Close హోం