Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం
Home Blog Page 88

ఆంధ్రప్రదేశ్ బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పి వి ఎన్ మాధవ్

0

ఆంధ్రప్రదేశ్ బీజీపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు పి వి ఎన్ మాధవ్

చిత్రం న్యూస్, పెద్దాపురం: ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ (బీజెపీ) రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పి వి ఎన్ మాధవ్ పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసింది . ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన గతంలో శాసనమండలిలో భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ గా పనిచేశారు. ఆర్ఎస్ఎస్ , బీజే వైఎం లో పలు బాధ్యతలు నిర్వర్తించారు.  భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత దివంగత చలపతిరావు కుమారుడు, ఆయన తండ్రి రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు. అధ్యక్ష పదవికి మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మాధవ్ నామినేషన్ దాఖలు చేశారు.మాధవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నియమితులైనందుకు పెద్దాపురం భారతీయ జనతా పార్టీ టౌన్ ప్రెసిడెంట్ బోలి శెట్టి రాంకుమార్, పెద్దాపురం టౌన్ వైస్ ప్రెసిడెంట్ కాకి భార్గవి, జనరల్ సెక్రటరీ నాలమటి సురేశ్ కుమార్ , బీజేపీ పార్టీ కార్యకర్తలు అభినందనలు తెలిపారు.

జమ్మికుంట రూరల్ సీఐగా కే.లక్ష్మీనారాయణ

0

జమ్మికుంట రూరల్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన కే.లక్ష్మీనారాయణ

చిత్రం న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట రూరల్ సీఐ గా కే.లక్ష్మీనారాయణ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇల్లంతకుంట, వీణవంక మండల పరిధిలోని ప్రజలు తమ సమస్యలను నేరుగా పోలీస్ స్టేషన్ కి వచ్చి పరిష్కరించుకోవాలని అన్నారు. ఇసుక, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తే ఎంతటి వారినైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాలలో ఎలాంటి మత్తు పదార్థాలు వాడిన, విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. యువత గంజాయికి, డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్లాలని తల్లిదండ్రులకు, మరియు గురువులకు, మంచి పేరు తేవాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలు జరిగితే తమకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని, 100 డయల్ కాల్ చేసి సమాచారం అందించాలన్నారు. వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని సూచించారు. అలాగే పోలీస్ స్టేషన్ కి వచ్చే ఫిర్యాదుదారుల పట్ల గౌరవించి వారి సమస్యలను పరిష్కరించాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. శాంతి భద్రతలను కాపాడే విషయంలో పోలీసులు ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటారని నిర్భయంగా మీ సమస్యలు మాకు తెలపాలని  సీఐ ప్రజలకు సూచించారు.

ఘనంగా పంతంగి శ్రీనివాస్ ఉద్యోగ విరమణ, షష్టిపూర్తి కార్యక్రమం

0

ఘనంగా పంతంగి శ్రీనివాస్ ఉద్యోగ విరమణ, షష్టిపూర్తి కార్యక్రమం

చిత్రం న్యూస్, సైదాపూర్: హెడ్ కానిస్టేబుల్ పంతంగి శ్రీనివాస్ ఉద్యోగ విరమణ, షష్టిపూర్తి కార్యక్రమాన్ని సైదాపూర్ విశాల పరపతి సహకార సంఘం ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి ఉద్యోగ విరమణ అనివార్యమన్నారు. ఎన్నో సవాళ్లతో కూడుకుని ఉన్న పోలీస్‌ ఉద్యోగం సంపూర్ణంగా పూర్తిచేసి ఉద్యోగ విరమణ పొందడం గొప్ప విషయం అన్నారు. గతంలో కోహెడ, జగిత్యాల, ఇల్లంతకుంట, గొల్లపల్లి, మెట్ పల్లి, పెగడపల్లి, ఇబ్రహీంపట్నం, జమ్మికుంట, హుజురాబాద్, వీణవంక ప్రాంతాల్లో అనేక సేవలు అందించినట్లు ఆయన తెలిపారు. వివిధ రాజకీయ నాయకులు, కలెక్టర్ల నుండి ఉత్తమ సేవా పతకాలు పొందడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు దొనికెన శ్రావణి- కిరణ్ కుమార్ (సీఐ), వెంగల శ్రీవాణి-సందీప్ కుమార్, పంజాల శాలిని-రాకేష్ శ్రావణ్ కుమార్, బాంబర్థి బొమ్మగాని మమత-రాజు, మనువలు, మనుమరాండ్లు హన్సుజ, ధన్విక, మన్విత్, సిద్ధిక్ష, అరుహీ, అత్త మామలు బొమ్మగాని-మల్లవ్వ వీరయ్య, చెల్లెళ్లు ముంజ రజిత-సాగర్, దొనికెన సునీత-అనిల్, స్థానిక ప్రముఖులు, సహోద్యోగులు, కుటుంబ సభ్యులు పాల్గొని శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఎమ్మార్పీఎస్ నూతన జెండా కోసం భూమిపూజ

0

ఎమ్మార్పీఎస్ నూతన జెండా కోసం భూమిపూజ6

చిత్రం న్యూస్, జమ్మికుంట:మండలంలోని ధర్మారం గ్రామంలో రెండో వార్డులో ఎమ్మార్పీఎస్ నూతన జెండా కోసం నాయకులు భూమిపూజ  చేశారు .పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జెండా ఏర్పాటుకు గద్దె నిర్మాణం చేపడుతున్నామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి మారపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెస్పీ జిల్లా అధ్యక్షులు  తునికి వసంత్, గ్రామ శాఖ అధ్యక్షులు మారపల్లి సంపత్, వార్డు కౌన్సిలర్ మారేపల్లి బిక్షపతి, నాయకులు మారేపల్లి మల్లయ్య, మారేపల్లి అంజయ్య, మంతిని రామస్వామి,మంతిని అశోక్, మారేపల్లి అజయ్, ఇంజపెల్లి రఘు, మారేపల్లి మొగిలి, సముద్రాల విజయ్ కుమార్, సముద్రాల సంపత్. సముద్రాల క్రాంతి కుమార్, మారపల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లిని కలిసిన సామ రూపేష్ రెడ్డి

0

జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ను సన్మానిస్తున్న సామ రూపేష్ రెడ్డి

*స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి

చిత్రం న్యూస్, బేల: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావును హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో  ఆదిలాబాద్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ కోసం కష్టకాలంలోను వెన్నంటే ఉండి జెండా మోసి కష్టపడి పనిచేసిన వారికి టిక్కెట్లు ఇవ్వాలని కోరారు. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ ప్రజలకు తాము అధికారంలో లేకపోయినా తమకు అండగా ఉంటామని భరోసా ఇచ్చి వారి సమస్యల పరిష్కారం కోసం ఎంతగానో కృషి చేయడం జరిగిందని తెలిపారు.అటువంటి వారికి రిజర్వేషన్ల ఆధారంగా అవకాశం కల్పించి వారి గెలుపుకు సహకరించాలని కోరారు. జిల్లా ఇన్చార్జి మంత్రిని కలిసిన వారిలో మాజీ సర్పంచ్ విట్టల్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు విపిన్ టాక్రే, చవాన్ స్వప్నల్ తదితరులు ఉన్నారు.

పద్మశాలి కులస్తుల ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్స్ డే

0

పద్మశాలి కులస్తుల ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్స్ డే

చిత్రం న్యూస్, బోథ్: మండల కేంద్రంలో డాక్టర్స్ డే ని పురస్కరించుకుని బోథ్ మండల పద్మశాలి సంఘం సభ్యులు ఘనంగా డాక్టర్స్ డే సంబరాలు నిర్వహించారు.  ప్రభుత్వ సీ హెచ్ సీ ఆసుపత్రిలో జిల్లా రిమ్స్ ఆస్పత్రి డీ సీ హెచ్ ఎస్ డా.ఉపేందర్ జాధవ్, డా.మితిలేష్ , డా. సుశాంత్, సీ హెచ్ ఎస్ అసిస్టెంట్ సాజిత్ లతో కేక్ కట్ చేయించి శాలివాలతో సత్కరించారు. బోథ్ వట్టణ పద్మశాలి సంఘ అధ్యక్షులు మెరుగు బోజన్న  మాట్లాడుతూ..డాక్టర్ అంటే మరో పునర్జన్మను ప్రసాదించే దేవుడని,ఆపద, అపాయం సమయంలో మన ఆరోగ్య సమస్యలను దూరం చేసి మన జీవితానికి కొత్త మార్గం చూపే జీవిత సృష్టికర్త ఒక్క డాక్టర్ మాత్రమే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బోథ్ పద్మశాలి సంఘం నాయకులు బుస లక్ష్మణ్,  వడ్లకొండ సురేందర్, కొమరి దయాకర్,మాసం అనిల్ కుమార్,తడక పోశెట్టి, వడ్లకొండ శ్రీనివాస్, పోశెట్టి, ఆడెపు నరేష్ కుమార్, ఆడెపు కిరణ్, దికొండ రమేష్, నాయకులు గంగాధర్, మెరుగు భోజన్న తదితరులు పాల్గొన్నారు..

పెద్దాపురం పట్టణంలో  అభివృద్ధి పనులను పరిశీలించిన మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్కంటి సాయిప్రసాద్

0

పెద్దాపురం పట్టణంలో  అభివృద్ధి పనులను పరిశీలించిన మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్కంటి సాయిప్రసాద్

చిత్రం న్యూస్, పెద్దాపురం:  పెద్దాపురం పట్టణంలో మంగళవారం వివిధ వార్డుల్లో అభివృద్ది పనులను మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్కంటి సాయిప్రసాద్ పరిశీలించారు. గత వారం రోజుల గా కురుస్తున్న వర్షాలకు డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఉంది,..రోడ్లు, వార్డు లో పరిసరాల పరిశుభ్రత గురించి వివరించారు. వర్షాకాలం లో తరచూ అనారోగ్యానికి గురవుతూ, ఆసుపత్రి కి వెళ్లే పరిస్థితులు వస్తాయని , ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకూడదని, డ్రైనేజీ లో చెత్త వేయరాదని , చిన్న పిల్లలు, వృద్ధులను వర్ష కాలం జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అని వార్డుల్లో ప్రజలకు మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్కంటి సాయిప్రసాద్ వివరించారు.

క్యాన్సర్ బాధితుడికి బీఆర్ఎస్ నేతల ఆర్థిక సాయం

0

క్యాన్సర్ బాధితుడికి బీఆర్ఎస్ నేతల ఆర్థిక సాయం

చిత్రం న్యూస్, బేల: మండలంలోని మొహబ్బత్ పూర్ గ్రామానికి చెందిన క్యాన్సర్ బాధితుడు సందీప్ ఠాక్రే కు బీఆర్ఎస్ నాయకులు ఆర్థిక సాయం అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం గ్రూపు ద్వారా జమ అయిన రూ.20,220 నగదును నాయకులు ఆయనకు అందజేశారు. సహకరించిన దాతలు ప్రతి ఒక్కరికీ బీఆర్ఎస్ పార్టీ తరపున ఆయన ధన్యావాదాలు తెలిపారు.

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

0

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

చిత్రం న్యూస్, లోకేశ్వరం:  సీజనల్ వ్యాధులు ప్రబలకుండా  తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గడ్ చందా పంచాయతీ సెక్రెటరీ రాజన్న అన్నారు. మంగళవారం పంచాయతీలో డ్రై డే నిర్వహించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటి పరిసరాలను ఎప్పడికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ ప్రతి మంగళ, శుక్రవారం నాడు డ్రై డే గా పాటించాలన్నారు. ఇంటి పరిసరాలలో కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ డబ్బాలు, పాత కుండలు, పనికి రాని వస్తువులను ఉంచుకోరాదని, దానిలో వర్షపు నీరు పడి దోమల లార్వా వృద్ధి చెంది డెంగ్యూ, , చికున్ గున్యా, మలేరియా, పైలేరియా వంటి వ్యాధులు ప్రబలుతాయన్నారు. దోమల పుట్టుక గురించి, దోమల వల్ల వచ్చే వ్యాధుల గురించి దోమల నివారణ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ , ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

విద్యార్థికి ఉచితంగా విద్యను అందించడానికి ముందుకొచ్చిన నాగభూషన్ పాఠశాల యాజమాన్యం

0

విద్యార్థికి ఉచితంగా విద్యను అందించడానికి ముందుకొచ్చిన నాగభూషన్ పాఠశాల యాజమాన్యం 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: బోథ్ మండల కేంద్రానికి చెందిన ఎన్నాం నవీన్ ఫొటోగ్రాఫర్ మృతి చెందడంతో ఆయన కుమారుడు రియాన్స్ , విద్యాబ్యాసం కోసం నాగభూషషన్ మెమోరియల్ హైస్కూల్ యాజమాన్యం కరెస్పాండెంట్ కిషోర్ గొప్ప మనసుతో విద్యని ఉచితంగా అందించడానికి ముందుకొచ్చారు. నవీన్ కుమారుడికి ఎల్ కె జి నుండి పదవ తరగతి వరకు ఉచితంగా విద్యని అందించడానికి బాధ్యత వహించారు. నాగభూషన్ మెమోరియల్ హైస్కూల్ కిషోర్ దంపతులను ఘనంగా సన్మానించి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మరకంటి మహేష్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాపాక విజయ్, ఆదిలాబాద్ జిల్లా ఫొటోగ్రపీ అధ్యక్షులు దొడ అశోక్, ఉపాధ్యక్షులు ఎం ప్రవీణ్, కోశాధికారి ఎన్. సంతోష్, బోథ్ మండల గౌరవ అధ్యక్షులు జూకంటి సదాశివ్ బోథ్, సొనాల అధ్యక్షులు బుస లక్ష్మణ్ , ప్రధాన కార్యదర్శి ముప్కల రాజేశ్వర్ ,కోశాధికారి కే.గణేష్, ఉపాధ్యక్షులు రంజిత్,  కమిటీ సభ్యులు పాల్గొన్నారు.