Home Blog Page 85

సాంగిడిలో శివాలయ నిర్మాణానికి భారీ విరాళం

0

చిత్రం న్యూస్, జైనథ్: కాప్రి గ్రామానికి చెందిన యెల్టి వెంకట్ రెడ్డి సాంగిడి గ్రామ శివాలయ నిర్మాణానికి తమ భక్తి భావంతో రూ.30వేలు విరాళంగా అందజేశారు. వెంకట్ రెడ్డి గారి దాతృత్వం, భక్తి భావం దేవాలయ నిర్మాణానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. దేవుని ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు

అభ్యుదయ పాఠశాలలో ఘనంగా ‘ఆత్మీయ ఆశీర్వచన’ వేడుక

0

చిత్రం న్యూస్,భోరజ్: పిప్పర్వాడ గ్రామంలోని అభ్యుదయ హైస్కూల్‌లో 10వ తరగతి విద్యార్థుల కోసం “తల్లిదండ్రుల ఆత్మీయ ఆశీర్వచన కార్యక్రమం” అత్యంత వేడుకగా జరిగింది. విద్యార్థులు తమ జీవితంలో కీలకమైన పదో తరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న తరుణంలో, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు పాఠశాల యాజమాన్యం ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా విద్యార్థులు తమ తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ‘మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ’ అని అంటూ  సాగిన ఈ వేడుక అందరినీ భావోద్వేగానికి గురిచేసింది.

రైతాంగ సమస్యలపై గాంధీ భవన్ సమావేశంలో పాల్గొన్న బోరంచు 

0

తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్  అన్వేష్ రెడ్డి అధ్యక్షతన భారత్–అమెరికా ఒప్పందం, తెలంగాణ వ్యవసాయ రంగానికి జరుగుతున్న నష్టం అంశాలపై బుధవారం గాంధీ భవన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా TPCC అధ్యక్షులు, MLC మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క పాల్గొన్నారు.

కార్యక్రమంలో తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి పాల్గొని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న రైతు వ్యతిరేక విధానాలతో రైతాంగము పడుతున్న సమస్యలను వివరించారు. పీడీపీఎస్(ప్రైజ్ డెఫిసిటీ పేమెంట్ సిస్టం) అమలుకు పైలెట్ ప్రాజెక్టుగా ఆదిలాబాద్ మార్కెట్ ను ఎంచుకున్నారని, పత్తిని ఎక్కడైనా అమ్ముకోవచ్చని ధరలో వ్యత్యాసాన్ని ప్రభుత్వమే భర్తీ చేస్తుందని చెప్పారు. బియ్యం అమెరికాతో పాటు అరబ్ దేశాలకు ఎగుమతి చేస్తామని, మిగతా ఉత్పత్తులు ఎక్కువ భాగం అమెరికాకే ఎగుమతి చేయడంతో తాజాగా పన్నుల పెంపుతో తీవ్ర నష్టం వాటిల్లుతోందని అన్నారు. దేశవ్యాప్తంగా విత్తన వ్యాపార రంగంలో భారతీయ బీజ్ సహకారి సమితి లిమిటెడ్ పేరుతో కొత్తగా ప్రవేశిస్తున్న నేపథ్యంలో, దాని వల్ల కలిగే లాభ–నష్టాలపై , కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్, ఇటీవల జరిగిన భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం ప్రభావం, అలాగే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

కనుల పండువగా అంజన్న మహా పడిపూజ 

0

చిత్రం న్యూస్, ముథోల్: నిర్మల్ జిల్లా ముథోల్ మండలం ఆష్ట గ్రామంలో అంజన్న మహా పడిపూజ కనుల పండువగా సాగింది. ఫకీరాబాద్ నాగేష్ గురు స్వామి ఆధ్వర్యంలో మహాపడి పూజ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. నాగేష్. గురుస్వామి నేతృత్వంలో జరిగిన పూజా కార్యక్రమంలో సుమారు 200 మంది అంజన్న స్వాములు పాల్గొని అంజన్న నామస్మరణ చేస్తూ పాటలు పాడారు. భక్తి గీతాలను ఆలపించారు. స్వామియే శరణం అంజన్న..స్వామియే శరణం అంజన్న అంటూ అంజన్న స్వామి నామస్మరణతో అష్ట గ్రామంలో మార్మోగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, అంజన్న భక్తులు పాల్గొన్నారు

ముథోల్ ఎమ్మెల్యేకు అంగన్వాడీ టీచర్ల వినతిపత్రం అందజేత 

0

చిత్రం న్యూస్, భైంసా:నిర్మల్ జిల్లా భైంసాలో తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్ వాడీ టీచర్లు బుధవారం ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ కు వినతి పత్రాన్ని అందజేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్ వాడీ టీచర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చేలా చూడాలని కోరారు. తమకు బీఎల్ వో. డ్యూటీ లు వేయకుండా చూడాలన్నారు. బీఎల్ వో డ్యూటీ లు వేయడం మూలంగా వృత్తి పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. అదే విధంగా పలు సమస్యలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ మాట్లాడుతూ..అంగన్వాడీ టీచర్ల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానన్నారు. కార్యక్రమంలో టీచర్లు డి.అనసూయ, ఎ.సంధ్యారాణి, ఎన్.సంతోషి, జి.సంధ్య తదితరులు పాల్గొన్నారు

బాసరలో బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్: ఆరుగురికి తీవ్రగాయాలు 

0
ROAD ACCIDENT
ROAD ACCIDENT

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర రైల్వే స్టేషన్ సమీపంలోని ఫ్లెఓవర్ వద్ద బుధవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్లో వస్తున్న ఇసుక టిప్పర్, ఆర్టీసీ బస్సును ఢీకొంది. బస్సు డ్రైవర్ తో పాటు మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం..ఆర్టీసీ బస్సు ప్రయాణికులను ఎక్కించుకొని నిజామాబాద్ నుంచి భైంసాకు వెళుతోంది. ఈ క్రమంలో బాసర రైల్వే సమీపంలోని ఫ్లైఓవర్ వద్దకు చేరుకోగానే ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది.సమాచారం అందుకున్న ఎస్సై నవనీత్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను అంబులెన్స్ లో భైంసా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. టిప్పర్ డ్రైవర్ పరారయ్యాడన్నారు. కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

పది పరీక్షలు భయం లేకుండా ఇష్టంతో రాయాలి: ఎస్సై నవనీత్ రెడ్డి 

0

చిత్రం న్యూస్, బాసర: పదో తరగతి పరీక్షలను భయం లేకుండా ఇష్టంతో, ఆత్మవిశ్వాసంతో రాయడంతోనే ఉత్తమ ఫలితాలను సాధించవచ్చని బాసర ఎస్సై నవనీత్ రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా బాసరలోని నాగభూషణం విద్యాలయంలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రశాంతమైన వాతావరణంలో చదువుకుంటూ సరైన ప్రణాళికతో సన్నద్ధమవ్వాలని, ముఖ్యమైన అంశాలను, పాత ప్రశ్నపత్రాలను సాధన చేయడం వల్ల మంచి గ్రేడ్లు సాధించవచ్చన్నారు. మంచి ఉత్తీర్ణత ఫలితాలు సాధించి బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సంపాదించాలన్నారు. అనంతరం పాఠశాల యాజమాన్యం ఎస్సైను శాలువాతో ఘనంగా సన్మానించారు.

సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్ మడ్డి శ్రీనివాస్ గౌడ్

0

చిత్రం న్యూస్, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం మోతే గ్రామంలో NREGS నిధులు రూ.10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను ఎస్సీ కమిటీ హాల్ నుండి హనుమాన్ టెంపుల్ వరకు జరిగే పనులను సర్పంచ్ మడ్డి శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ మాసాపురం ప్రశాంత్ తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బైండ్ల అశోక్, ఎల్లేష్, నగేష్, కోరంపల్లి రాజమణి, గుంటి స్వప్న, రాణి, బాలమణి, బాలవికాస చైర్మన్ సిద్రమైన స్వామి, వైస్ చైర్మన్ మురళి, మాజీ ఉప సర్పంచ్, చల్మెడ నరసింహులు, వడ్ల శ్రీనివాస్, మంగలి శ్రీనివాస్, తలారి భాస్కర్, గుంటి అఖిల్, వినోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..

నిజాయతీని చాటుకున్న ఆలయ హోంగార్డ్స్  

0

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చిన ఓ భక్తురాలుపోగొట్టుకున్న తన పర్సును ఆలయ హోంగార్డులు అందజేసి తమ నిజాయతీ చాటుకున్నారు. హైదరాబాద్ కు చెందిన సుజాత అనే భక్తురాలు ఆలయ ప్రాంగణంలో రూ.5 వేల నగదు ఉన్న చేతి పర్సును మర్చిపోయింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న హోంగార్డులు వెంకటేష్,రాందాస్ కు దొరకడంతో ఆలయ ఇన్స్పెక్టర్, జూనియర్ అసిస్టెంట్ సాయిలుకు అందజేసి తిరిగి భక్తురాలికి అందజేశారు. దీంతో తోటి భక్తులు హోంగార్డులను అభినందించారు.

పిప్రి లిఫ్ట్ కు మహర్దశ 

0

*నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్

* రూ.77 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వ జీ.వో.విడుదల 

చిత్రం న్యూస్, లోకేశ్వరం: నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ రైతాంగానికి సాగునీరు అందించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. ముథోల్ నియోజకవర్గం సస్యశ్యామలం కావాలన్నది ఆయన కల. అందులో భాగంగా లిఫ్ట్ ఇరిగేషన్ లకు నిధులు, చెరువుల మరమ్మత్తులకు నిధులు ఇవ్వాలని పలు మార్లు అసెంబ్లీ లో ప్రస్థావించడం తో పాటు హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర మంత్రులను కలవడం, ముఖ్య మంత్రికి విన్నవించడంతో ఇక నియోజకవర్గానికి ఇరిగేషన్ లో నిధుల వరద ప్రారంభమైంది.. చెరువులు, లిఫ్ట్ ల పనులు ప్రారంభం కాగా పిప్రి లిఫ్ట్ కు రూ.77 కోట్ల నిధులు విడుదల చేస్తూ సర్కార్ జి. వో. విడుదల చేసింది.. పనులు పూర్తయితే లోకేశ్వరం మండలంలోని పలు గ్రామాల్లో వేలాది ఎకరాల్లో సాగునీరు అందనుంది. జీ.వో. విడుదల పట్ల రైతుల్లో హర్షం వ్యక్తం అవుతుంది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి, ఇంచార్జి మంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.