Home Blog Page 85

రక్తదానం చేసి..ప్రాణ దాతలుగా మిగిలి

0

రక్తదానం చేసి..ప్రాణ దాతలుగా మిగిలి

* మానవత్వం చాటుతున్న  భైంసా కు చెందిన నవీన్, మోహన్

చిత్రం న్యూస్, భైంసా: అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న. ఎందుకంటే రక్తదానం ప్రాణదానంతో సమానం. ప్రమాదాలు జరిగినప్పుడు, శస్త్ర చికిత్సల సమయంలో రక్తం అవసరం ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో రక్తం అందుబాటులో లేకపోవడం వల్ల అనేక మంది మృత్యువాత పడుతుంటారు. అలాంటే వారిని ఆదుకుకునేందుకు తమ వంతుగా రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ తరుణంలో ఓ ఇద్దరు ఆపద్బాంధవులు సాయం చేస్తూ అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు. వారు విధుల్లో ఎంత బిజిగా ఉన్నా తోటి వారికి సాయం చేయడానికి సమయం కేటాయిస్తున్నారు నిర్మల్ జిల్లా భైంసా వాసులు నవీన్ , మోహన్ లు. అత్యవసరంగా భైంసా జీడీఆర్ హాస్పిటల్లో ప్రభు అనే పేషంట్ కు ఎ పాజిటివ్ రక్తం కావాలి అని అనగానే వెంటనే వెళ్లి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.

పొంగిపొర్లిన వాగులు..నిలిచిపోయిన రాకపోకలు

పొంగిపొర్లినవాగులు..నిలిచిపోయిన రాకపోకలు

*తెలంగాణ _మహారాష్ట్ర  ప్రజల కష్టాలు

చిత్రం న్యూస్, జైనథ్:  ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు అదిలాబాద్ నుండి జైనాథ్, బేల మండలాలకు వెళ్లే రహదారులు జలదిగ్బంధం అయ్యాయి. భోరజ్ మండలం తరోడ, జైనథ్ మండలం నిరాల గ్రామం దగ్గరలో ఉన్న లో-లెవల్ వంతెనపై నుండి వరద నీరు రావడంతో. రెండు వైపులా రహదారులు మూసుకుపోయాయి.  దాదాపుగా ఐదు గంటల పైగా రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో తెలంగాణ _మహారాష్ట్ర  ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

ఆకట్టుకున్న బోధనోపకరణ మేళా

ఆకట్టుకున్న బోధనోపకరణ మేళా

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సిర్సన్న ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మండల స్థాయి బోధనాభ్యాసన సామాగ్రి మేళ (TLM) ఎంతగానో ఆకట్టుకుంది. మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు సృజనాత్మకతతో తయారుచేసిన బోధనోపకరణాలను ప్రదర్శించారు. అనంతరం 10 బోధనోపకరణాలు జిల్లా స్థాయికి  ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ముగింపు సమావేశంలో మండల నోడల్ అధికారి కదం మహాలక్ష్మి మాట్లాడుతూ.. ప్రాథమిక స్థాయి విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు టీఎల్ఎంలు ఎంతో దోహద పడతాయన్నారు. వెనుకబడిన విద్యార్థులకు సులువుగా అభ్యసన సామర్ధ్యాలను మెరుగుపరచవచ్చన్నారు.. కార్యక్రమంలో సీఆర్పీ లు ఆర్.వెంకన్న, విజయ్ కుమార్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఉద్యోగాల పేరుతో పలువురుని మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

ఉద్యోగాల పేరుతో పలువురుని మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

చిత్రం న్యూస్, బోథ్ : ఉద్యోగాల పేరుతో పలువురుని మోసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.  ఎస్ఐ శ్రీ సాయి తో కలిసి నిందితుడి  వివరాలు సోమవారం  వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని సంపత్ నాయక్ తండా, టివిటి, పార్ది (బి) గ్రామాల్లోని యువకులను ఉద్యోగాల పేరుతో నమ్మించి రాథోడ్ సంజువ్ దగ్గర నుండి 1,50,000 వేలు, రాథోడ్ బాపురావు నుండి 1,20,000 వేలు, మచ్చేందర్, జంగు, గణేష్, బాలు, అను నలుగురు వ్యక్తుల నుంచి 70 వేలు తీసుకున్నాడు. ఇలా మొత్తం కలిపి 5,50,000 వేలు తీసుకొని వీరిని మోసం చేశాడన్నాడు. వీరంతా కలిసి మావిడాల సతీష్ పైన ఫిర్యాదు చేయడంతో  బోథ్ పోలీస్ స్టేషన్ లో  కేసు నమోదు చేశామన్నారు. మావిడాల సతీష్ ను సోమవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు.

కాంతయ్య ఇంట్లో వికసించిన బ్రహ్మ కమలం పూలు

కాంతయ్య ఇంట్లో వికసించిన బ్రహ్మ కమలం పూలు

చిత్రం న్యూస్, ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం బోరిగామ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు నాంపల్లి కాంతయ్య ఇంట్లో పెంచుకొంటున్న బ్రహ్మ కమలం పువ్వులు ఆదివారం రాత్రి వికసించాయి. దీంతో ఉపాధ్యాయుడు కాంతయ్య దంపతులు బ్రహ్మ కమలం మొక్కకు పూజలు నిర్వహించారు. ఆ పుష్పాలను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడి సతీమణి లక్ష్మి మాట్లాడుతూ.. తమ ఇంటిలో బ్రహ్మకమలం పూయడం చాలా ఆనందంగా ఉందన్నారు. సరిగ్గా మూడేళ్ల కిందట తమ ఇంటి పెరట్లో ఈ మొక్క నాటామన్నారు. తాజాగా ఆదివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో బ్రహ్మకమలం విరబూసింద‌ని ఆమె చెప్పారు. ఆ పుష్పాలను స్థానిక ఆలయానికి అందజేశామని చెప్పారు. అరుదైన, ప్రత్యేకత కలిగిన పుష్పం త‌మ‌ వీధిలో విక‌సించ‌డంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.

గుడుంబా విక్రయిస్తే చర్యలు_ఎక్సైజ్ ఎస్సై జుల్ఫికర్ అహ్మద్

గుడుంబా విక్రయిస్తే చర్యలు_ఎక్సైజ్ ఎస్సై జుల్ఫికర్ అహ్మద్

చిత్రం న్యూస్, ఇచ్చోడ:  నిషేధిత గుడుంబా విక్రయిస్తే చర్యలు తప్పవని ఎక్సైజ్ ఎస్సై జుల్ఫికర్ అహ్మద్ అన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని బాబ్జిపేట్ లో కొందరు వ్యక్తులు గుడుంబా తయారుచేసి విక్రయిస్తున్నారన్న ముందస్తు సమాచారం మేరకు దాడులు నిర్వహించామన్నారు. బాబ్జిపేట్ కు చెందిన జాదవ్ లక్ష్మీ వద్ద 5 లీటర్ల గుడుంబా దొరికిందన్నారు. జాదవ్ లక్ష్మిని విచారించగా సిరిచెల్మలోని మహమ్మద్ షౌకత్ కిరాణ దుకాణంలో ఆమె కొన్నట్లు పేర్కొందన్నారు. అనంతరం కిరాణా దుకాణంలో దాడులు నిర్వహించగా 300 కిలోల నల్ల బెల్లం, 9 కిలోల పటికను స్వాధీనం చేసుకొని సీజ్ చేశామన్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిషేధిత గుడుంబా తయారు చేసినా విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్ఐ విజయలక్ష్మి, సిబ్బంది బాపురావు, మౌనిక, అరుణ, సంధ్యారాణి, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

కోలూర్‌లో కూలిన పెంకుటిల్లు_తప్పిన పెను ప్రమాదం

0

కోలూర్‌లో కూలిన పెంకుటిల్లు_తప్పిన పెను ప్రమాదం

చిత్రం న్యూస్, తానూరు: నిర్మల్ జిల్లా తానూరు మండలం కోలూర్ గ్రామంలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఒక పెంకుటిల్లు కూలిపోయింది. గ్రామానికి చెందిన షేక్ ఉమర్‌కు చెందిన ఈ ఇల్లు పూర్తిగా నేలమట్టమైంది. అదృష్టవశాత్తు ఆ ఘటన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. బాధితుడు ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు.  ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరారు.

బెల్లూరి గ్రామంలో పర్యటించిన మండల అధికారులు

బెల్లూరి గ్రామంలో పర్యటించిన మండల అధికారులు

*గ్రామంలో హెల్త్ క్యాంప్ నిర్వహించిన ప్రభుత్వ వైద్యులు

చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లాలో శనివారం కురిసిన భారీ వర్షానికి జైనథ్ మండలం బెల్లూరి గ్రామంలో వరదనీరుతో గ్రామం అతలాకుతలం గా మారింది. ఆదివారం రోజున హెల్త్ క్యాంప్ ను తహసీల్దార్, ఎంపీడీవో ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యురాలు నైనత నిర్వహించారు. ఎంపీడీవో మహేష్ కుమార్, తహసీల్దార్ నారాయణ గ్రామంలో పర్యటించి వరద నీటిలో మునిగిన ఇండ్ల బాధితుల వివరాలు తెలుసుకున్నారు. భారీ వర్షంతో రైతులు ప్రధానంగా పంట చెన్లకు వెళ్ళే లో-లెవల్ వంతెన పక్కన దెబ్బతిన్న దారిని పరిశీలించారు. వర్ష కాలం దృష్ట్యా ప్రజలందరు జాగ్రత్తగా ఉండాలన్నారు. అవసరమైతే తప్ప ఇంట్లోంచి బయటకు రావద్దని సూచించారు. వారి వెంట పంచాయతీ కార్యదర్శులు చక్రవర్తి, ముజీబ్, గ్రామస్థులు రఘువీర్ రెడ్డి, ఉషన్న, రాకేష్ రెడ్డి, సంజీవ్ ,అభిజిత్ రెడ్డి, ఆనంద్ రావ్, నరేష్ రెడ్డి,అశన్న, చిన్నారెడ్డి, ఎల్లన్న, నర్శింగ్ రెడ్డి,గండన్న,కిస్టు తదితరులు ఉన్నారు.

పెన్ గంగా నదిని సందర్శించిన తహసీల్దార్ రఘునాథరావు

 పెన్ గంగా నదిని సందర్శించిన తహసీల్దార్ రఘునాథరావు

చిత్రం న్యూస్, బేల:  ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి గ్రామ శివారులోని పెన్ గంగా నదిని రఘునాథరావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెన్ గంగలో నీటి ప్రవాహం పెరగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారని, ఎగువలో ఉన్న మహారాష్ట్రలోని ప్రాజెక్ట్ లో నీటిని విడుదల చేయడంతో ప్రవాహం పెరిగిందన్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో పంట పొలాల్లో చాలా నష్టం వాటిల్లిందని తెలిపారు. భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో  ప్రజలు ఆత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పారు. అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారని, ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. ప్రజలకు ఏ అవసరమొచ్చిన సహాయక చర్యలు చేపట్టేందుకు అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు. చుట్టుపక్కల గ్రామాలైన బెదోడ, కాప్సి గ్రామాలను నాయకులు, అధికారులతో కలిసి సందర్శించారు. డిప్యూటీ తహసీల్దార్ వామన్, ఆర్ఐ సాజిద్ ఖాన్, గ్రామ కార్యదర్శి వేణుగోపాలరావు, వీడీసీ అధ్యక్షుడు, భూపతి రెడ్డి, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు కదరపు ప్రవీణ్, సతీష్ గేడాం తదితరులున్నారు.

బోథ్ పీఏసీఎస్ గోదాములో నీట మునిగిన యూరియా బస్తాలు

బోథ్ పీఏసీఎస్ గోదాములో నీట మునిగిన యూరియా బస్తాలు

చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పీఏసీఎస్ గోదాములో యూరియా బస్తాలు తడిసిపోయాయి. శుక్రవారం రాత్రి నుండి భారీ వర్షం కురుస్తుండడంతో ఎగువ నుండి వచ్చిన నీరు గోదాంలోకి అధికంగా వరద నీరు రావడంతో యూరియా బస్తాలు తడిసిపోయాయి. తడిసిన యూరియా బస్తాలని  కార్మికులు తీసే ప్రయత్నం చేశారు.