Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం
Home Blog Page 84

బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కళ్లెం ప్రమోద్ రెడ్డి ఉదారత

0

బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కళ్లెం ప్రమోద్ రెడ్డి ఉదారత

*పాఠశాలకు 60 ప్లేట్లు పంపిణీ

చిత్రం న్యూస్, బేల: బేల మండలం పొన్నాల ప్రాథమికోన్నత  పాఠశాల విద్యార్టులకు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కళ్లెం ప్రమోద్ రెడ్డి 60 ప్లేట్లు పంపిణీ చేసి ఉదారత చాటారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న జన్మదినం సందర్భంగా ఇటీవల పాఠశాలలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఉపాధ్యాయుల కోరిక మేరకు మంగళవారం పొన్నాల ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు బేల మండల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కళ్లెం ప్రమోద్ రెడ్డి 60 ప్లేట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

ఉద్యమంలా వన మహోత్సవాన్ని నిర్వహించండి -జిల్లా కలెక్టర్ రాజర్షి షా

0

ఉద్యమంలా వన మహోత్సవాన్ని నిర్వహించండి -జిల్లా కలెక్టర్ రాజర్షి షా

చిత్రం న్యూస్, బోథ్ :రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ ఉద్యమంలా చేపట్టాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బోథ్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలలో ఏర్పాటుచేసిన మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరయ్యారు. బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, ఫారెస్ట్, రెవెన్యూ, పంచాయితీ, డీఆర్డీఏ, ఐకేపీ అధికారులతో కలిసి కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. పాఠశాలకు కళాశాలకు కావలసిన మొక్కలన్నింటిని సరఫరా చేయవలసిందిగా సంబంధ అధికారులకు ఆదేశించి, కళాశాల ఆవరణలో పెంచుతున్న కిచెన్ గార్డెన్ కు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని, కిచెన్ గార్డెన్ పెంపకం వల్ల విద్యార్థులకు వ్యవసాయ సామర్థ్యాలు మెరుగుపడతాయని భవిష్యత్తులో ఇవి ఉపయోగపడతాయని తెలిపారు. కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసిన ప్రిన్సిపల్, కళాశాల సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి, మండల తహసీల్దార్ సుభాష్ చందర్, మండల అభివృద్ధి అధికారి రమేష్, వ్యవసాయ విస్తరణ అధికారి రవితేజ, ఎఫ్ఆర్వో ప్రణయ్, ఐకేపీ ఏపీఎం మాధవ్, డీఆర్డీఏ అధికారులు, అటవీ శాఖ సిబ్బంది, గ్రామపంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉంది 

0

పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉంది 

*ఒక రోజు ఉద్యమ స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి పీతల సుజాత , ఎమ్మేల్యే  పులపర్తి రామాంజనేయులు 

చిత్రం న్యూస్, భీమవరం: పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మాజీ మంత్రి పీతల సుజాత, ఎమ్మెల్యే శ్రీ పులపర్తి రామాంజనేయులు అన్నారు. వీరవాసరం మండలం పంజా వేమవరం గ్రామంలో  ఎన్ఆర్ఈజీఎస్ పధకంలో భాగంగా ఒక రోజు ఉద్యమ స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని (వన మహోత్సవం) మాజీ మంత్రి పీతల సుజాత , స్థానిక ఎమ్మెల్యే శ్రీ పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పీతల సుజాత  మాట్లాడుతూ.. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందని, అందుకు తమవంతుగా అందరూ మొక్కలు నాటాలని అన్నారు. ఈ పథకంలో భాగంగా రైతులందరికీ ఉచితంగా మొక్కలు అందించి వారిని ఆర్ధికంగా  పైకి తీసుకురావడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీ పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ..  ప్రతిఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటాలని, ఎక్కడైతే మొక్కలను నాటామో వాటిని వదిలి వేయకుండా వాటి సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలన్నారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే కూటమి సభ్యులతో కలిసి మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ మెంటే పార్థసారథి, జడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడు, ఎంపీపీ వీరవల్లి దుర్గాభవాని, కూటమిపక్ష నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

రామకృష్ణ పరమహంస హోమియో హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

0

రామకృష్ణ పరమహంస హోమియో హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

చిత్రం న్యూస్, పాలకోడేరు: భీమవరం జిల్లా పాలకోడేరు మండలంలో రామకృష్ణ పరమహంస హోమియో హాస్పిటల్ ఆధ్వర్యంలో  ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు.  డాక్టర్ కోసూరి ఆనంద రాజు ఆధ్వర్యంలో సాయి వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి వారం రోజులకు సరిపడా ఉచిత మందులను అందజేశారు. కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది కళ్యాణ్ పాల్గొన్నారు.

కుల సంఘాల భవన నిర్మాణం కోసం నిధులు కేటాయించిన కాంగ్రెస్

0

కుల సంఘాల భవన నిర్మాణం కోసం నిధులు కేటాయించిన కాంగ్రెస్ ప్రభుత్వం

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: 

కుల సంఘాల భవన నిర్మాణం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిధులను కేటాయించింది. కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి పది కుల సంఘ భవనాలకు రూ.50 లక్షల నిధులు కేటాయించారు. ప్రజాసేవ భవన్ లో ప్రొసీడింగ్ పత్రాలను సోమవారం వివిధ కుల సంఘాలకు అందజేశారు ‌.కంది శ్రీనివాస్ రెడ్డి  మాట్లాడుతూ..గత ప్రభుత్వం కుల సంఘాలను ,చేతి వృత్తులను విస్మరించిందని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే చేతి వృత్తులు, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి జరుగుతుందన్నారు.

ఇసుక ట్రాక్టర్ పట్టివేత

0

ఇసుక ట్రాక్టర్ పట్టివేత

చిత్రం న్యూస్, చిగురుమామిడి: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామ పరిధిలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ ను సోమవారం పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సాయి కృష్ణ తెలిపారు. వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో  ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ని పట్టుకున్నామన్నారు.  సరైన ధ్రువీకరణ పత్రాలు  లేకపోవడంతో ట్రాక్టర్ ను పోలీస్ స్టేషన్ కి తరలించి కేసు నమోదు చేశామని తెలిపారు. అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

దేశానికే తలమానికంగా సుపరిపాలన ఏకైక లక్ష్యం – ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు

0

దేశానికే తలమానికంగా సుపరిపాలన ఏకైక లక్ష్యం – ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు

చిత్రం న్యూస్, బాపట్ల: కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “సుపరిపాలనలో తొలి అడుగు – ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమం దేశానికే తలమానికంగా సుపరిపాలన ఏకైక లక్ష్యమని బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు అన్నారు. బాపట్ల పట్టణంలోని 29,28,26 వార్డుల్లో ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేస్తూ  సంవత్సరకాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. కూటమి ప్రభుత్వ ఏడాది పరిపాలన సూపర్ సిక్స్ పథకాల పై ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు దృష్టికి తీసుకువచ్చారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని  ఆయన హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు మాట్లాడుతూ..ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రతి ఇంట్లో వెలుగులు నింపేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చెప్పారు.గత వైసీపీ ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిందని దాని నుంచి బయట పడేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి ఎనలేనిదన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న కూడా తల్లికి వందనం అమలు చేశామని, దేశంలో ఎక్కడా లేనివిధంగా పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నామని, అన్న క్యాంటీన్ ప్రారంభించాం. ఆర్థిక వనరులు సమకూర్చుకొని అహర్నిశలు కష్టపడి కూటమి ప్రభుత్వం అద్భుతమైన కార్యక్రమాలు చేస్తుందని తెలియజేశారు. బాపట్ల నియోజకవర్గాన్ని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తామని,నిరుపేద లేని సమాజ స్థాపనే ముఖ్యమంత్రి లక్ష్యమని ఉద్ఘాటించారు. పి4 విధానాన్ని రాష్ట్రలో ప్రవేశ పెట్టి పేదలను ఆదుకునే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా చూస్తూ రాష్ట్ర రాజధాని,పోలవరం ప్రాజెక్ట్ కు నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో  ఎన్డీయే సర్కారు పనిచేస్తోందని ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు  తెలిపారు. ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ పరిశీలకులు బొంతు శివ సాంబి రెడ్డి, బాపట్ల పట్టణ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు, క్లస్టర్ ఇన్ ఛార్జ్ మందపాటి ఆంద్రెయ, యూనిట్ ఇన్చా ఛార్జ్ సోమయ్య, పట్టణ వైస్ ప్రెసిడెంట్ బూర్లె రామ సుబ్బారావు, 29వ వార్డు ప్రెసిడెంట్ పులి శ్రీనివాసరావు,28వ వార్డు ప్రెసిడెంట్ కొట్రా జానకిరామయ్య,27వ వార్డు ప్రెసిడెంట్ చాపా ప్రశాంత్ , క్లస్టర్ యూనిట్ , బూత్ ఇన్ఛార్జ్ లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా  ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం, పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ జన్మదిన

0

ఘనంగా  ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం, పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు

చిత్రం న్యూస్, జమ్మికుంట:మండలంలోని కోరపల్లి మాజీ సర్పంచ్ బోయిని సమ్మయ్య ఆధ్వర్యంలో కోరపెల్లి వెంకటేశ్వర్ల పల్లి గ్రామాల్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 31 ఆవిర్భావం దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం, వేల గొంతులు లక్ష డప్పులు మహా కళా ప్రదర్శన నిర్వహణ కమిటీ  తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ రామంచ భరత్ హాజరయ్యారు. అనంతరం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు కొబ్బరికాయలు కొట్టి జెండాలను ఆవిష్కరించారు. అనంతరం పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి ఘనంగా సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కోరపల్లి మాజీ సర్పంచ్ బోయిని సమ్మయ్య మాట్లాడుతూ.. మాదిగ జాతికి జరుగుతున్న విద్య, ఉద్యోగ ,రాజకీయ రిజర్వేషన్ల అన్యాయాలపై మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ 31 సంవత్సరాల క్రితం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించి ప్రకాశం జిల్లా ఈదుమూడి నుండి ప్రారంభమైన ఉద్యమం ఈరోజు దేశవ్యాప్తంగా విస్తరించిందని కృష్ణ మాదిగ మాదిగ జాతికే కాకుండా అట్టడుగు వర్గాల ప్రజలే కాకుండా అగ్రవర్ణ ప్రజలకు ఏ సమస్య వచ్చినా తను ముందుండి పోరాడి వారి హక్కులను సాధిస్తారని గత కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో చిన్న పిల్లలకు గుండె జబ్బులతో బాధపడుతున్న వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం తీసుకురావడం తోపాటు వితంతువులకు వికలాంగులకు పెన్షన్స్ పెంచే విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పెన్షన్లు సాధించడంలో కీలక పాత్ర పోషించారన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో అనేక అవమానాలు ఎదుర్కొన్న వెనకాడకుండా సుదీర్ఘంగా 30 సంవత్సరాలు పోరాటం చేసి సుప్రీంకోర్టు నుండి ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలను ఒప్పించి షెడ్యూల్ కులాల ఎస్సీ వర్గీకరణ సాధించిన ఘనత మందకృష్ణ మాదిగకే దక్కిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయన చేసిన పోరాటాన్ని గుర్తించి పద్మశ్రీ అవార్డును ప్రధానం చేయడం యావత్తు భారతదేశ ప్రజలకే గర్వకారణం అన్నారు.   ఈ కార్యక్రమంలో జమ్మికుంట మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబాల రాజు, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ కోరపల్లి గిరవేన ఓదెలు,  వెంకటేశ్వర్ల పల్లి ఉపసర్పంచ్ పోల్సాని శ్రీనివాసరావు, వార్డ్ మెంబర్ బండారి రాజకుమార్ ,బుడగ జంగం జిల్లా నాయకులు రేపెల్లి వెంకటేష్, నేతకాని సంఘం నాయకులు కొండు బిక్షపతి, హమాలీ సంఘం నాయకులు బండారి శ్రీధర్ , బీజేపీ నాయకులు రెంటాల మహేందర్, నాయి బ్రాహ్మణ సంఘం కొత్తగట్టు సంపత్ , మైనాటి నాయకుడు ఎండీ రహీం, యాదవ సంఘం అధ్యక్షులు గిరవైన సతీష్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బోయిని అంకుస్ మాట్ల సంజీవ్ కుమార్, నాగిళ్ల ఓంకార్, గాజుల అర్జున్ పుల్లూరి రాజు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం రాష్ట్ర సహాయ ప్రచార కార్యదర్శి పిల్లి నరేష్

0

తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం రాష్ట్ర సహాయ ప్రచార కార్యదర్శి గా పిల్లి నరేష్

చిత్రం న్యూస్, ఇచ్చోడ:తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం రాష్ట్ర సహాయ ప్రచార కార్యదర్శిగా అదిలాబాద్ జిల్లా ఇచ్చోడకు చెందిన పిల్లి నరేష్ ను  ఎన్నుకున్నారు. ఈ మేరకు వరంగల్ లో జరిగిన సమావేశంలో రాష్ట్ర మేదరి మహేంద్ర సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పిల్లి నరేష్ మాట్లాడుతూ. తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం రాష్ట్ర సహాయ ప్రచార కార్యదర్శిగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందన్నారు. మేదరి సంఘం సమస్యల పరిష్కారానికి, న్యాయమైన హక్కుల సాధనకు కృషి చేస్తూ సంఘం బలోపేతానికి పనిచేస్తానన్నారు. తనను తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం రాష్ట్ర సహాయ ప్రచార కార్యదర్శిగా నియమించినందుకు రాష్ట్ర మేదరి మహేంద్ర సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, సంఘం ప్రతి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

చంద్రమాంపల్లి లో సుపరిపాలన లో ‘తొలి అడుగు’ కార్యక్రమం

0

చంద్రమాంపల్లి లో సుపరిపాలన లో ‘తొలి అడుగు’ కార్యక్రమం

చిత్రం న్యూస్, పెద్దాపురం: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తమ పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సుపరిపాలనలో ‘తొలి అడుగు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పెద్దాపురం మండలం చంద్రమాంపల్లి  గ్రామంలో  మండల మార్కెట్ కమిటీ డైరెక్టర్ రేలంగి వెంకట్రావు సుపరిపాలనలో ‘తొలి అడుగు’ కార్యక్రమంలో  పాల్గొన్నారు. ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలను పంచారు. ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించారు.. పెద్దాపురం శాసనసభ్యులు  నిమ్మకాయల చినరాజప్ప ఆదేశాల మేరకు సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.