Home Blog Page 62

YOGA: యోగ శిక్షకురాలికి మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సన్మానం 

0

YOGA: యోగ శిక్షకురాలికి మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సన్మానం 

చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా భైంసా మండల దేగాం గ్రామానికి చెందిన యోగ శిక్షకురాలు వెంకటోళ్ల స్రవంతిని మాజీ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి సన్మానించారు. మూడు సంవత్సరాల నుండి యోగ శిక్షకురాలు వివిధ యోగ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో,తన యొక్క ప్రతిభను కనబరిచారు.  రాష్ట్ర స్థాయిలో ఆదిలాబాద్ లో జరిగిన 6వ రాష్ట్ర స్థాయి యోగ పోటీలలో నిర్మల్ జిల్లా నుండి పాల్గొని నాలుగో స్థానంలో నిలిచారు. శుక్రవారం నిర్వహించిన నిర్మల్ జిల్లాస్థాయి యోగ పోటీలు తానూర్ మండల కేంద్రంలోని ఎమ్ ఎస్ ఆర్ గార్డెన్ లో నిర్వహించారు. జిల్లా స్థాయి నాలుగో యోగ మహిళల సీనియర్ స్థాయిలో కేటగిరి (డీ) లో ప్రథమ స్థానంలో  నిలిచిన ఆమెను యోగ అసోసియేషన్ఆ ధ్వర్యంలో వెంకటొళ్ళ స్రవంతికి మెమొంటో , షీల్డ్ తో బహుకరించారు.  మాజీ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి నివాసంలో వీడీసి ఆధ్వర్యంలో ఆమెకు సన్మానం చేశారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు. ప్రతి ఒక్కరు తమ వంతు రోజూ వారీ జీవన విధానంలో ఉదయపు నడక, యోగ ఆసనాలు చేయడంతో మనిషి శారీరకంగా, మానసికంగా, దృఢంగా ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీడీసీ చైర్మన్ టేకుల లింగన్న, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ సూర్యం రెడ్డి,  మాజీ మాజీ వార్డ్ మెంబర్ అప్పం గోవర్ధన్ రెడ్డి, నాయకులు అయిండ్ల మోహన్ రెడ్డి, గడ్డిగరి చందూ రెడ్డి, తదితర నాయకులు, కార్యకర్తలు ,అభిమానులు పాల్గొన్నారు.

సబ్ యూనిట్ అధికారిగా రవీందర్ బాధ్యతలు

0

సబ్ యూనిట్ అధికారిగా రవీందర్ బాధ్యతలు

చిత్రం న్యూస్, ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి సబ్ యూనిట్ అధికారిగా పవార్ రవీందర్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. సొనాల, బజార్ హత్నూర్, ఇచ్చోడ, సిరికొండ, బోథ్, నేరడిగొండ మండలాల్లో నిర్వహించే వైద్య శిబిరాలకు పవార్ రవీందర్ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్నారని అదిలాబాద్ జిల్లా వైద్యాధికారి రాథోడ్ నరేందర్ తెలిపారు. ఈ సందర్భంగా రవీందర్ కు వైద్య సిబ్బంది అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది సుభాష్, రాథోడ్ కైలాష్, సుధారాణి, వసంత్ ,ఏఎన్ఎం, ఆశ, కార్యకర్త తదితరులు ఉన్నారు.

BJP: బీజేపీలో పలువురు చేరిక

0

BJP: బీజేపీలో పలువురు చేరిక

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని మసాలా (కే), దుబ్బాగూడ గ్రామాలకు చెందిన పలువురు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు ఎమ్మెల్యే పాయల్ శంకర్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఆదిలాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే శంకర్ కండువాలను కప్పి ఆహ్వానించారు.  ఈ సందర్భంగా పాయల్ శంకర్ మాట్లాడుతూ.. రెండేళ్లుగా పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో  ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ నాయకత్వాన్ని సమర్థించేలా వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీజేపీ లో చేరుతున్నారని పేర్కొన్నారు. గత ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదించిన మాదిరిగానే రానున్న ఎన్నికల్లో సైతం బీజేపీ బలపరుస్తున్న అభ్యర్థులకు మద్దతు పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు.  కాంగ్రెస్ ప్రభుత్వ తీరును చూస్తే గ్రామాల్లో కనీసం బల్బులు పెట్టలేని దుస్థితి నెలకొందన్నారు. అనేక సమస్యలతో ప్రజలు కొట్టుమిట్లాడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు అస్తక్ సుభాష్, సాత్నాల మండల ఇంఛార్జి రమేష్, పలువురు బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

DEGREE COLLEGE: ప్రభుత్వ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు

0

DEGREE COLLEGE: ప్రభుత్వ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు5

చిత్రం న్యూస్, ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల  కేంద్రంలోని  ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.ఆచి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఫైనల్, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కలిసి ఈ వేడుకలను నిర్వహించడం అభినందనీయమని, ఇటువంటి కార్యక్రమాలు కొత్త విద్యార్థుల్లో ఆశను, ఉత్సాహాన్ని నింపుతాయని పేర్కొన్నారు. ఈ సంవత్సరం కళాశాలలో 170 మంది విద్యార్థులు కొత్తగా చేరడం సంతోషకరమని, ఈ విజయవంతమైన కార్యక్రమం నిర్వహణలో అధ్యాపకుల తోడ్పాటు, సమన్వయకర్త సరితా రాణి కృషి, వీడీసీ పాత్ర ఎంతో ఉందని ఆయన అభినందించారు. కళాశాల భవంతి నిర్మాణానికి విడీసీ సమిష్టిగా కృషి చేయాలని కోరారు. ట్రైబల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.కిషన్ చౌహాన్ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును మార్చగల మహత్తర శక్తి చదువులోనే ఉందని, అందువల్ల పట్టుదలతో చదవాలని సూచించారు.  వీడీసీ ప్రధాన కార్యదర్శి రేగుంట సురేష్ మాట్లాడుతూ.. కళాశాల అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అతిథులను శాలువాలతో సత్కరించారు. పాటలలో చక్కటి ప్రదర్శన కనబర్చిన ప్రశాంత్, ఉపన్యాసం ,చిత్రలేఖనంలో ప్రతిభ చూపిన కిషన్, సాయి, పావనిలకు బహుమతులు అందజేశారు. సాంస్కృతిక సమన్వయ కర్త టి.నర్సయ్య, సమన్వయం చేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. జాతీయ గీతం ఆలపించి కార్యక్రమాన్ని ముగించారు. కార్యక్రమంలో పిల్లి నరేష్, సామన్పల్లి సుదర్శన్, వీడీసీ సభ్యులు,  వైస్ ప్రిన్సిపాల్, డా.సరస్వతి, డా.మధు,డా. అనిత, డా.మురళి, డా.తిరుపతి, దయాకర్, విజయకుమార్, ప్రభాత్ కుమార్ సుభాష్, బాలకృష్ణ, విజయలక్ష్మి తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.

అసత్య ప్రచారాన్ని ఆపాలి

0

 అసత్య ప్రచారాన్ని ఆపాలి

*బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి

చిత్రం న్యూస్, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో జరిగిన సంక్షేమ పథకాల చెక్కుల కార్యక్రమంలో బోథ్ రెవిన్యూ డివిజన్ గురించి ప్రస్తావిస్తూ ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడిన మాటలను ప్రతిపక్ష పార్టీలు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయడం తగదని, నిజాన్ని ప్రజలకు తెలిపినందుకు ఓర్వలేకనే దుష్ప్రచారానికి తెరలేపారని బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి అన్నారు. బోథ్ పట్టణంలో చట్ల ఉమేష్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి పక్కాగా వెళ్తున్న సందర్భంలో ఓటమి భయంతోనే , రాష్ట్ర మంత్రిపై అసత్య ప్రకటనలను ప్రచారం చేస్తున్నారని వీటిని ప్రజలు నమ్మరని, రాబోయే పది సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని, స్థానిక సంస్థల ఎన్నికలలో మెజార్టీ సీట్లు కైవసం చేసుకుంటున్నారని దీమా వ్యక్తం చేశారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రెవెన్యూ డివిజన్ కోసం మంత్రిపై ఒత్తిడి తీసుకు వస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో బోథ్ రెవెన్యూ డివిజన్ ఉందని ఉద్దేశపూర్వకంగా స్థానిక ఎమ్మెల్యే రెవెన్యూ డివిజన్ ని రాజకీయ లబ్ధి కోసం  వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో  పీఏసీఎస్ డైరెక్టర్ చట్ల ఉమేష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి, ఏఎంసీ డైరెక్టర్ మహమ్మద్ అబ్రార్, ఆత్మా డైరెక్టర్ గడ్డల నారాయణ, అలాపటి అచ్చుతానంద రెడ్డి, జగన్, కౌసర్, కాయిపల్లి శ్రీనివాస్, ఫెరోజ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SCHOOL: పాఠశాలకు శుద్ధ జల యంత్రం విరాళం

0

SCHOOL: పాఠశాలకు శుద్ధ జల యంత్రం విరాళం

చిత్రం న్యూస్,  భైంసా: నిర్మల్‌ జిల్లా తానూరు మండలం ఎల్వి గ్రామంలో ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ.25 వేల విలువచేసే శుద్ధజల యంత్రాన్ని దివ్యాంగ్ శక్తి ఫౌండేషన్ చైర్మన్ పంచగుడి మహేష్ ఆధ్వర్యంలో పాఠశాలకు అందజేశారు. శుద్ధ జల యంత్రాన్ని బిగింపజేసి హెచ్ఎం నరేందర్ తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ..పాఠశాల విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణతో పాటు  విద్యార్థులకు ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా ఉంతుందన్నారు. వంద లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ శుద్ధ జల యంత్రాన్ని సక్రమంగా వినియోగించు కోవాలని దివ్యాంగు శక్తి కమిటీ బృందం సూచించారు. ఈ సందర్భంగా దివ్యాంగ్ శక్తి ఫౌండేషన్ కమిటీ బృందానికి పాఠశాల హెచ్ఎం నరేందర్, ఉపాధ్యాయులు, గ్రామస్థులు, శాలువాతో సత్కరించి అభినందించారు. పాఠశాల అభివృద్ధికి గ్రామంలోని దాతలు ముందుకు వచ్చి విద్యార్థులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు తమవంతు సహాయ సహకారాలు అందించాలని హెచ్ఎం కోరారు.

HEALTH  CAMP: గుబ్బ తండాలో  వైద్య శిబిరం

0

HEALTH  CAMP: గుబ్బ తండాలో  వైద్య శిబిరం

చిత్రం న్యూస్, ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని గుబ్బ గ్రామంలో శనివారం మెడికల్ హెల్త్ క్యాంపు నిర్వహించారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు జలుబు, దగ్గు, జ్వరమును గుర్తించి మందులు పంపిణీ చేశారు.  రక్తపోటు, మధుమేహం వ్యాధులను గుర్తించి మందులు  అందజేశారు. ఇంటి చుట్టూ నీళ్లు, ట్యాంకులు, కొబ్బరి చిప్పలు పూల కుండీలలో నిల్వ ఉన్న నీటిలలో దోమల లార్వాలను గుర్తించి పారబోశారు.  దోమల ద్వారా వచ్చే వ్యాధులు డెంగ్యూ, మలేరియా,చికెన్ గున్యా లాంటి సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు మన ఇంటి చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు .ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పవార్ రవీందర్, రాథోడ్ కైలాష్, రాజ్ కిరణ్, సుభాష్, వసంత్ సుభాష్, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

AADE GAJENDER: బాధిత కుటుంబానికి బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ఆడే గజేందర్ పరామర్శ

0

AADE GAJENDER: బాధిత కుటుంబానికి బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ఆడే గజేందర్ పరామర్శ

చిత్రం న్యూస్: ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన ఏనుగు కృష్ణారెడ్డి కుమారుడు నరసింహా రెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ఆడే గజేందర్ శనివారం వారి ఇంటికెళ్ళి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రగాఢ సానుభూతి తెలిపారు. నరసింహా రెడ్డి  పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని కల్పించారు. ఆయన వెంట ఇచ్చోడ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ సత్యవతి కోటేశ్వర్, సీనియర్ నాయకులు ఇచ్చోడ పాక్స్ వైస్ చైర్మన్ బద్దం పురుషోత్తం రెడ్డి, నియోజకవర్గ మైనారిటీ చైర్మన్ ముస్తఫా, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొత్తూరి లక్ష్మణ్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఆసిఫ్ ఖాన్, మాజీ ఎంపీటీసీ జాహిద్ మొహియుద్దీన్, కుర్మే మహేందర్, సీనియర్ నాయకులు మహబూబ్, హుస్సేన్, సాదిక్, బొజ్జా సాయన్న, విఠల్, దేవన్న, రమేష్, గణేష్, యండీ సద్దాం, సయ్యద్ సల్మాన్ తదితరులు ఉన్నారు.

Adilabad: టైలర్స్ కాలనీ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేత 

0

Adilabad: టైలర్స్ కాలనీ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేత 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని టైలర్స్ కాలనీలో నెలకొన్న సమస్యలపై కాలనీ వాసులు MLA పాయల్ శంకర్ ను శనివారం కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా కాలనీలో డ్రైనేజి వ్యవస్థ సరిగాలేక తీవ్ర ఇబ్బందికి గురవుతున్నామని తెలిపారు. చిన్నపాటి వర్షానికే  రోడ్డు మొత్తం వరద నీరుతో  నిండిపోతుందని, రోడ్డుపై రాకపోకలు సాగించాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్బంగా MLA పాయల్ శంకర్  మున్సిపల్ కమిషనర్ కు ఫోన్ ద్వారా సమస్య ను వివరించి పరిష్కారం కొరకు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు గేడం మాధవ్, అక్షయ్, దశరథ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

BOATH MLA: మూవీ పోస్టర్ ను విడుదల చేసిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

0

BOATH MLA: మూవీ పోస్టర్ ను విడుదల చేసిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

*టీజర్ లాంచ్ కి ముఖ్యఅతిథిగా రావాలని ఆహ్వానం అందజేసిన నటుడు రౌడీ సింగర్

చిత్రం న్యూస్, నేరడిగొండ: నిర్మల్  జిల్లాకు చెందిన నటుడు రౌడీ సింగర్ నటిస్తున్న రంజిత్ కేర్ ఆఫ్ వెంకటాపురం సినిమా పోస్టర్ ను  శనివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నేరడిగొండ మండల కేంద్రంలో విడుదల చేశారు. ఈ నెల 15వ తేదీన నిర్మల్ జిల్లా కేంద్రంలోని RK ఫంక్షన్ హాలులో జరగబోయే టీజర్ లాంచ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరు కావాలని ఎమ్మెల్యే అనిల్ జాదవవ్ ని  నటుడు రౌడీ సింగర్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అనిల్ యాదవ్, రాథోడ్ సురేందర్ ఉన్నారు.