Home Blog Page 21

నేడు బేలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

0

చిత్రం న్యూస్,బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని 353బీ జాతీయ రహదారికి ఇరువైపులా ఏర్పాటు చేసిన టవర్లపై విద్యుత్తు తీగలు ఎక్కించే పనులు కొనసాగుతున్నందున సోమవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ సంతోష్ తెలిపారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరాలో అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

Rk హీరోగా మరో సినిమా ప్రారంభం

0

చిత్రం న్యూస్, మణికొండ: వినోదమే ప్రధానంగా ప్రేక్షకులకు కడుపుబ్బ నవ్వించడమే ధ్యేయంగా ఇంద్ర కంపెనీ ప్రొడక్షన్ NO 5, రవి రాథోడ్ సహా నిర్మాతగా వ్యవహరిస్తూ శక్తి ప్రెసెంట్ బ్యానర్ గా , RK హీరోగా 5 వ చిత్రం ప్రారంభం కార్యక్రమం హైదరాబాద్ నగరం మణికొండలోని అభిషేక్ డాన్స్ స్టూడియోలో రాజకీయ ప్రముఖులు, సినీ దర్శకులు, నటీనటులు మధ్యన  జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ డాన్స్ మాస్టర్ నటరాజ్ ముఖ్య అతిథిగా విచ్చేసి హీరో, హీరోయిన్ ల పై మొదటి ముహూర్తపు షాట్ క్లాప్ కొట్టగా నిర్మాత ఇంద్ర కెమెరా ఆన్ చేశారు .మొదటి షాట్ కి హరి తాటిపల్లి దర్శకత్వం వహించారు. జబర్దస్త్ షోలో నటిస్తున్న కే ఏ పాల్ మరో అతిథిగా విచ్చేశారు. ఈ చిత్ర హీరోగా నల్లమల, ఆకాశవాణి, ప్రతిఘటన , ప్రేమికుడు , వంగవీటి , కొండా, చిత్రాలకు నృత్య దర్శకులుగా చేసిన RK హీరో గా మహాబలి, నీరుకుళ్ళ, మాఊరి బావి, ఇప్పుడు 4వ చిత్రం హీరోగా చేస్తున్నారు. హీరోయిన్ శ్రీలియ ద్వితీయ చిత్రం కాగా మరో హీరోయిన్ గా ఖుషీ రెడ్డి హీరోయిన్ గా పరిచయం చేస్తూ..అవంతిక పరదేశి హీరోయిన్ గా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సుష్మా మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇంద్ర కంపెనీ నుండి మొదట డేటింగ్, హార్రర్ డ్రీమ్స్ 24/7, ఘోస్ట్ గార్డ్, వాంటెడ్ బాయ్ ఫ్రెండ్, ఇప్పుడు ఈ నూతన చిత్రం ప్రొడక్షన్ 5 గా తెరకెక్కుతుంది. దర్శకునిగా కుర్రాల సుబ్బారెడ్డికీ వాంటెడ్ బాయ్ ఫ్రెండ్ మొదటి సినిమా కాగా ఇది రెండవ చిత్రం . ఈ చిత్రంలో ప్రధాన హాస్యనటుడు గా చేస్తున్న (ఇమామ్ వలి) వలి కి ఇది 7 చిత్రం కాగా ఆనంద్ కి రెండో చిత్రం. కెమెరా ఫొటోగ్రఫీగా ఫణీంద్ర, మ్యూజిక్ డైరెక్టర్ గా ఉదయ్ కిరణ్. నృత్య దర్శకులుగా హరి తాటిపల్లి, ఫైట్ మాస్టర్ గా పీటర్ చేస్తున్నారు. మొదటి షెడ్యూల్ జనవరి 24 నుండి హైదరాబాద్ పరిసరప్రాంతాల్లోనూ, రెండో షెడ్యూల్ ఫిబ్రవరి నెలలో 3 వారంలో వరంగల్, రాజమండ్రిలలో పూర్తికానున్న ఈ చిత్రంలో ఫణి, విజయ్ బొల్ల , సునీత, అనిత, కే ధనలక్ష్మి, శ్రీహరి, ఆనంద్, జబర్దస్త్ బాబు  నటించనుండగా మిగతా నటీనటుల వివరాలు త్వరలో తెలియజేస్తామని దర్శకులు తెలిపారు.

 

నేడు బేలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

0

నేడు బేలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేలలో జాతీయ రహదారి విస్తీర్ణంలో భాగంగా జాతీయ రహదారులకు ఇరువైపులా ఏర్పాటుచేసిన టవర్లపై విద్యుత్ తీగలు ఎక్కించే పనులు ఉన్నందున ఆదివారం ఉదయం 10 నుంచి 5 గంటల వరకు విద్యుత్ సరఫరాల అంతరాయం ఉంటుందని ఏఈ సంతోష్ తెలిపారు. బేలలోని వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.

జమ్మికుంటలో ఉత్సాహంగా సీఎం కప్ క్రీడా ర్యాలీ

0

చిత్రం న్యూస్, జమ్మికుంట: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 2వ సీఎం కప్ టోర్నమెంట్ సన్నాహక కార్యక్రమంలో భాగంగా రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న క్రీడా ర్యాలీని జమ్మికుంట పట్టణంలో  నిర్వహించారు. కరీంనగర్ జిల్లా పేట సంఘం అధ్యక్షులు బాబు శ్రీనివాస్, పేట సంఘం సెక్రటరీ ఆడేపు శ్రీనివాస్ టార్చ్ ర్యాలీ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్.జి.ఎఫ్ సెక్రటరీ శ్రీలత మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం, రూరల్ టు గ్లోబల్ అనే నినాదంతో ప్రతి గ్రామం నుంచి క్రీడాకారులను తయారు చేసే విధంగా కార్యక్రమం రూపొందించారని, ఇందులో విద్యార్థులు, యువత భాగస్వాములు కావాలని, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని, మంచి దేహదారుఢ్యాన్ని రూపొందించుకోవాలన్నారు. క్రీడల్లో రాణించి మన గ్రామానికి, మండలానికి, జిల్లాకి, తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ శ్రీనివాస్ గౌడ్, ఎస్.జి.ఎఫ్ సెక్రటరీ శ్రీలత , పీఈటీ భగత్, తదితర వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పదవి ఆమెది – పెత్తనం అతనిది

0

చిత్రం న్యూస్, వెబ్ డెస్క్: మహిళలకు ఉన్న ప్రత్యేక రిజర్వేషన్ల కారణంగా అధికారం కోసం, ఇంట్లో ఉన్న తమ ఆడవారితో ఎన్నికల్లో పోటీ చేయిస్తున్నారు మగవారు. ఆ విధంగా పదవిలో నామమాత్రంగా మహిళలు ఉంటున్నారు. పెత్తనం మాత్రం మగవారు చేస్తున్నారు. వాళ్లు కూడా భర్తకు ఎదురు చెప్పలేని స్థితిలో బాధ్యతలను మగవారికే అప్పగిస్తున్నారు. ఇలా భర్తలే నిర్ణయాలు తీసుకోవడం, సమావేశాలకు హాజరవ్వడం వంటి సంఘటనలు పలుచోట్ల జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల ఉద్దేశం పక్కదారి పడుతోందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల ప్రతినిధి ఆమె :వనితలకు పదవులు, రాజకీయాలు కొత్తే కావొచ్చు. ఇప్పటివరకు ఇంటి పనులకో, వ్యవసాయానికో పరిమితమై ఉండొచ్చు. పాలనానుభవం పెద్దగా లేకపోవచ్చు. అయితేనేం! ప్రజా సమస్యలపై వారికీ అనుభవం ఉండే ఉంటుంది. ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధి ఆమె. అయినా సొంతింటి వారే బయటకు రాకుండా చిన్నబుచ్చుతుంటే ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారు. ‘సర్పంచ్‌ సాబ్‌’ అని నలుగురు పిలుస్తుంటే పులకరిస్తున్నారే తప్ప, మన ఇంటి ఆడపడుచును ‘పతిచాటు సతి’ అని పదుగురిలో పలుచన చేస్తున్నామని గ్రహించడం లేదు.

ఇటువంటి ధోరణే ఇక్కడ: పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరించిన వేళ, మహిళా సర్పంచుల పక్కనే వారి పతులకూ కుర్చీలు వేసి సన్మానాలు చేశారు. అంటే అటు కుటుంబీకులు, ఇటు జనం సైతం ‘అతడిదే పెత్తనం’ అని అంగీకరించినట్లేనా? సమీక్షలు అన్నింటికీ కుటుంబ సభ్యులు, భర్తలే ముందుంటున్నారు. భర్త చాటు భార్యగానే ఆమెకు స్థానం అధికారులే గుర్తుపట్టలేని పరిస్థితి. అధికారిక కార్యక్రమాలకు భర్తలకు అనుమతి లేదని ఆదేశాలు జారీ చేసినా అవి ఆచరణకు నోచుకోవడం లేదు.ఏ ప్రభుత్వ కార్యక్రమాలు జరిగిన భర్త కనుసన్నల్లోనే కార్యక్రమాలు సాగుతుండటం, ఎన్నికలు వచ్చినప్పుడు మహిళలు ప్రచారం కోసం తిరుగుతారని గెలుపొందిన తర్వాత బయటికి రాని పరిస్థితి ఏర్పడుతుంది. మనదేశంలో కొన్ని వందల మంది మహిళలు ఉన్నత శిఖరాల్లో పదవుల ఆచరించి ఉన్నప్పటికీ గ్రామాల్లో మాత్రం ఆచరణకు నోచుకోలేని మహిళలుగానే ఉండిపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను మహిళలకు దక్కే విధంగా ఆచరణ చేయాలని ఆశిద్దాం!

శ్రీ స్వయంభూ సమ్మక్క-సారలమ్మ జాతర నూతన కమిటీ ఎన్నిక

0

అధ్యక్షుడిగా సారబుడ్ల సమ్మిరెడ్డి ఏకగ్రీవం

చిత్రం న్యూస్, శంకరపట్నం: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ స్వయంభూ సమ్మక్క-సారలమ్మ జాతర ఆలయ అభివృద్ధి, నిర్వహణ కోసం నూతన కమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జాతర గుట్ట వద్ద నిర్వహించిన ఈ ప్రత్యేక సమావేశానికి వెన్నంపల్లి, ఎక్లాస్‌పూర్, గర్రెపల్లి, లస్మన్నపల్లి, ఆరెపల్లి, సోమారం గ్రామాల సర్పంచులు, గ్రామ పెద్దలు, భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ అభివృద్ధిని కాంక్షించి, అందరి ఆమోదంతో నూతన అధ్యక్షుడిగా సారబుడ్ల సమ్మిరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆరు గ్రామాల పెద్దలు వెల్లడించారు. భవిష్యత్తులో ఆలయాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఈ నూతన కార్యవర్గం కృషి చేయనుందని తెలిపారు. నూతన అధ్యక్షుడుగా సారబుడ్ల సమ్మిరెడ్డి, ప్రధాన కార్యదర్శులుగా మారుపాక తిరుపతి (వెన్నంపల్లి), కనకం అజయ్ (వెన్నంపల్లి), కోశాధికారిగా సంగాల తిరుపతి (వెన్నంపల్లి), ఉపాధ్యక్షులుగా గుర్రాల మహేందర్ రెడ్డి (లస్మన్నపల్లి), బొద్దుల తిరుపతి (ఆరెపల్లి), ఇల్లందుల సంపత్ (ఎక్లాస్‌పూర్), దోకిడి తిరుపతి (గర్రెపల్లి), పడాల తిరుపతి (సోమారం), బీస నర్సయ్య (వెన్నంపల్లి), సహాయ కార్యదర్శులుగా సంగాల రవికుమార్, మొలుగూరి సంపత్ (వెన్నంపల్లి), తిప్పిరిశెట్టి రమేష్ (గర్రెపల్లి), కస్తూరి రాములు (ఆరెపల్లి), తీగల రఘుపతి గౌడ్, (ఎక్లాస్‌పూర్), మెరుగు నరేష్ (లస్మన్నపల్లి), గుంటి వెంకటేష్ (సోమారం) కార్యవర్గ సభ్యులుగా తిప్పిరిశెట్టి రమేష్, బెల్లి తిరుపతి (గర్రెపల్లి), బైరి రాజు, తలారి యాదగిరి (లస్మన్నపల్లి), బండి రమేష్, రేగుల భిక్షపతి (వెన్నంపల్లి), మేక కుమార్, కచ్చు శ్రీనివాస్ (సోమారం), గొంగళ్ళ రవి, కోలె అశోక్ (ఆరెపల్లి), గంగిళ్ళ రాంరెడ్డి, చల్లూరి రవి (ఎక్లాస్‌పూర్). మహ్మద్ రహీమ్ పాషా (వెన్నంపల్లి), బీస వెంకటేష్ (వెన్నంపల్లి), మొలుగూరి వెంకటయ్య (వెన్నంపల్లి), మొలుగూరి అయిలయ్య (వెన్నంపల్లి), మారుపాక ప్రణయ్ (వెన్నంపల్లి) వెన్నంపల్లి బండ శివానంద రెడ్డి నియామకం అయ్యారు.

అన్సారీ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయం_డీఆర్డీఏ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ బిట్ల గంగన్న

0

  * ఘనంగా ప్యూర్ డెయిరీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎండీ అన్సారీ జన్మదిన వేడుకలు

* అన్సారీ ఫౌండేషన్ ప్రారంభించిన ప్రముఖులు 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని సంజయ్ నగర్ కాలనీకి చెందిన ప్యూర్ డెయిరీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎండీ అన్సారీ తన జన్మదినం సందర్భంగా  అన్సారీ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని నిర్మల్  డీఆర్డీఏ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ బిట్ల గంగన్న, తలమడుగు మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, జైనథ్ సర్పంచ్ గడ్డం మమత జగదీష్ రెడ్డి అన్నారు. అన్సారీ జన్మదిన వేడుకలను బంధు మిత్రులు, నాయకులు, శ్రేయోభిలాషుల నడుమ శనివారం జరుపుకున్నారు. అందరి నడుమ కేకు కట్ చేశారు. పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శాలువా కప్పి సన్మానించారు. ఫౌండేషన్ కరపత్రాలను అందరికీ అందజేశారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ..ప్యూర్ డెయిరీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎండీ అన్సారీ ఇప్పటికే పాల ఉత్పత్తుల రంగంలో రాణిస్తున్నారన్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాల్లో అడుగుపెట్టడం గర్వించదగ్గ విషయమన్నారు. అట్టడుగు వర్గాలకు సహాయం చేయడం. విద్యా, వైద్యం, ఆరోగ్యం సామాజిక ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడం ద్వారా సానుకూల, స్థిరమైన మార్పును తీసుకు రావడమే ప్రధాన ఉద్దేశ్యంగా ఈ ఫౌండేషన్ పనిచేస్తుందని అన్సారీ ఫౌండేషన్ ఛైర్మన్  ఎండీ అన్సార్ పేర్కొన్నారు. కార్యక్రమంలో డా.సంజయ్ గుజరాతి, ఎల్టి వెంకట్ రెడ్డి, లోక ప్రవీణ్ రెడ్డి, మహ్మద్ రోహిత్, మాజీ కౌన్సిలర్ మహ్మద్ షానవాజ్, షేక్ కిజర్ పాషా, షేక్ పర్వేజ్, గాజుల సాంబశివ, తలమడుగు సర్పంచ్ ఎలుగు చంటి (రాజన్న),  ఫౌండేషన్ సభ్యులు పి.సునీల్, ఎం.రాకేష్, శ్రీకాంత్, సుశీల్, టి.నారాయణరెడ్డి, సామ ఆశిష్ రెడ్డి, ఇర్ఫాన్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

చైనా మాంజా తగిలి ఒకరికి తీవ్రగాయాలు

0

చిత్రం న్యూస్, నేరడిగొండ: సంక్రాంతి పండగ వేళ సరదా కోసం గాలిపటాలు ఎగరేస్తాం.అయితే,గాలిపటాలను ఎగరేసేందుకు వాడే చైనా మాంజా ప్రాణాలు తీస్తోంది.చైనా మాంజా.మనుషుల పాలిట యమపాశంగా మారింది.చైనా మాంజా కారణంగా అనేకమంది ప్రాణాలు పోతున్నాయి.చైనా మాంజా మహా డేంజర్ అని మరోసారి ప్రూవ్ అయ్యింది.చైనా మాంజా కారణంగా నేరడిగొండ మండల కేంద్రంలో ఎన్ హెచ్ 44 రహదారి పై బైక్ మీద నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బక్పత్ కి చెందిన మొహమ్మద్ అనిస్ (42)కి పతంగి మాంజా అతడి మొహంపై చుట్టుకుంది. ఇది గమనించే లోపే తీవ్ర రక్తస్రావం అయ్యింది.వెంటనే బాధితుడిని మండల కేంద్రం లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఈ దుస్థితి నెలకొనడానికి కారణం అధికారుల నిర్లక్ష్యం, వ్యాపారుల అత్యాశ. పతంగులు ఎగురవేసే వారి బాధ్యతారాహిత్యం అని చెప్పాలి. జనాల గొంతులు కోస్తున్న ఈ చైనా మాంజాను ప్రభుత్వం నిషేధించి ఏళ్లు గడుస్తున్నా ఇంకా ఈ చైనా మాంజా మార్కెట్ లో లభ్యమవుతోంది.ఈ మాంజాతో పతంగులు ఎగురవేసే వారికి కూడా అనేక గాయాలవుతున్నాయి. పోలీసులు చైనా మాంజా వాడొద్దని పదే పదే చెబుతున్నా వ్యాపారులు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. అయినా చైనా మాంజా వాడకాన్ని మాత్రం ఆపడం లేదు.

రామాలయ కమిటీ నూతన అధ్యక్షుడిగా దేవరాజ్

0

చిత్రం న్యూస్, కడెం: నిర్మల్ జిల్లా కడెంలోని రామాయలం నూతన కమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా దేవరాజ్, ప్రధాన కార్యదర్శిగా గంగేశ్వర్, చిన్నయ్య, కోశాధికారులుగా రాజు,  గణేష్, కిట్టు, రాజశేఖర్, ఉపాధ్యక్షులుగా ప్రసాద్, శ్రీరామ్, నల్లగొండ మోహన్ నాయక్, బ్రహ్మచారి బాధ్యతలు చేపట్టారు. నూతన కార్యవర్గానికి గ్రామస్తులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఆలయ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహణకు నూతన కమిటీ కృషి చేయాలని భక్తులు, గ్రామస్తులు నూతన కమిటీ సభ్యులను కోరారు. అలాగే కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర ఆలయంలో అన్నదానం

0

చిత్రం న్యూస్, జైనథ్: మండలంలోని కూర గ్రామంలో శ్రీదేవి, భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం రోజున అన్నదానం పెద్ద ఎత్తున గ్రామస్తులు, దాతల సహకారంతో జరుగుతుందని ఆలయ కమిటీ, ప్రధాన అర్చకులు గుండేటి రామాంజనేయ శర్మ తెలిపారు. శనివారం కరంజి గ్రామానికి చెందిన నూతుల మహేందర్ రెడ్డి  కుటుంబం, కరంజి, దీపాయిగూడ సుందర సత్సంగ్ భజనలతో ఆలయంలో శోభ సంతరించుకుంది. ప్రధాన అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందించారు.