Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం
Home Blog Page 21

దండారీ ఉత్సవాల్లో పాల్గొన్న సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదివాసీల ప్రధాన పండగ అయిన దండారి ఉత్సవాలు ఏజెన్సీ ప్రాంతాలలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ రూరల్ మండలం వాన్వట్ గ్రామంలో నిర్వహించిన దండారీ ఉత్సవాల్లో సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం తలమడుగు మండలం నందిగామ గ్రామంలో మాజీ డీసీసీబీ చైర్మన్ దామోదర్ రెడ్డితో కలిసి దండారి ఉత్సవాల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల పటేల్ లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మొక్క జొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

0

మొక్క జొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

చిత్రం న్యూస్, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో మొక్క జొన్న కొనుగోలు కేంద్రాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల మీద ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు. మొక్క జొన్నతో పాటు సోయాబీన్, పత్తి కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని అన్నారు.  కిసాన్ కపాస్ యాప్ ద్వారా రైతులకు చాలా ఇబ్బందులు వస్తున్నాయని, ఆ యాప్ ఇప్పుడే అమలు చేయకుండా క్రమ క్రమంగా యాప్ మొదలు పెట్టాలని అన్నారు. చాలా మంది రైతుల వద్ద ఆండ్రాయిడ్ సెల్ ఫోన్లు లేవు.. ఉన్న నెట్వర్క్ ఉండవు. ఒకటి రెండు సంవత్సరాలు పాత పద్ధతి ద్వారానే పత్తి కొనుగోలు చేయాలని అన్నారు. పత్తి, సోయా,మొక్క జొన్న, శనగ, వేరు శనగ పంటలకు కూడా బోనస్ ఇవ్వాలన్నారు. అదేవిధంగా రైతులు ఎవరుకూడా దళారులకు పంటలు అమి మోసపోవద్దని, అని ప్రభుత్వంతో పోరాడి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించే విధంగా చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల BRS పార్టీ నాయకులు, అధికారులు, రైతులు,  కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా

0

శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా

చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్‌ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వెంకట రమణాచార్యులు కలెక్టర్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ఆలయ ప్రాశస్త్యాన్ని  వివరించారు.  కలెక్టర్ కుటుంబ సభ్యులకు ప్రసాదం అందజేసి ఆశీర్వచనాలు అందించారు. ఆలయ కమిటీ చైర్మన్ అడ్డి రుకేష్ రెడ్డి, మార్కెట్ ఛైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి కలెక్టర్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్ బీసీ సంఘాల బంద్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు 

0

ఆదిలాబాద్ బీసీ సంఘాల బంద్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు 

తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణుల బైక్ ర్యాలీ 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:

తెలంగాణ రాష్ట్ర బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో, 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం శనివారం చేపట్టిన బంద్ విజయవంతం అయ్యింది. ఇందులో భాగంగా ప్రజలు స్వచ్చందంగా బంద్ పాటించి బీసీ బిల్లుకు తమ మద్దతును  తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత  ఆధ్వర్యంలో బంద్ కు మద్దతు తెలుపుతూ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో ధర్నా చేపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ..సీఎం రేవంత్ రెడ్డీ అగ్రకులానికి చెందినప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముందుకు వెళుతున్నారని అన్నారు. బీసీ బిల్లు రిజర్వేషన్ ఆమోదం చెందితే ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వ ఖాతాలో పడుతుందో అని, బీసీల జీవితాలను మార్చడానికి కాంగ్రెస్ చిత్తశుద్ధితో తీసుకుంటున్న నిర్ణయాలకు అడుగడుగునా బీజేపీ, బీఆర్ఎస్ లు అడ్డుపడుతున్నాయని అన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని మునుముందు మరిన్ని ఆందోళనలు చేపట్టి బిల్లు ఆమోదం సాధించి తీరుతామని అన్నారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ బీసీ సంఘాల నాయకులు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చిక్కాల దత్తు, ప్రధాన కార్యదర్శి కలాల శ్రీనివాస్, బండారి సతీష్ , కాంగ్రెస్ మండల నాయకులు, మావల మండల కాంగ్రెస్ అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్ మాజీ ఎంపీపీ ఆట్ల గోవర్ధన్ రెడ్డి, బీసీ నాయకులు సురేష్ కుమార్, రేండ్ల రాజన్న, గౌతమ్, టౌన్ వైస్ ప్రెసిడెంట్ అలీం, శము,రహీమ్, బషీర్, ఫహీం, రాజ్ మొహమద్, రహీమ్ ఖాన్, రావుల ప్రవీణ్, అఫ్సర్, అజీమ్, అఫ్సర్ ఖాన్, హలీమ్, రాజేశ్వర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా దండారి ఉత్సవాలు

0

ఘనంగా దండారి ఉత్సవాలు

చిత్రం న్యూస్, సొనాల: ఆదిలాబాద్ జిల్లా సొనాల మండలంలోని పార్డీ(కే) గ్రామంలో దండారి ఉత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం సంప్రదాయబద్ధంగా జరుపుకునే ఈ దండారి పండగకు గ్రామంలోని గుస్సాడి బృందo, అతిథులుగా వచ్చిన ఇతర గ్రామాల గుస్సాడీ బృందాలు, గ్రామ పెద్దలు, యువతీ, యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. దండారి ఉత్సవాలు ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని..పూజారులు మాత గంగమ్మ, మహాలక్ష్మీ, దేవతలకు ప్రత్యేక పూజలు చేసి గ్రామ ప్రజలంతా అష్టైశ్వర్యాలు సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు. అనంతరం గ్రామస్తులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దండారి ఉత్సవాలు గ్రామ ఐక్యతను, ఆదివాసీ సంస్కృతిని ప్రతిబింబించే విశిష్ట వేడుకగా నిలిచాయి.

సొనాలలో బీసీ బంద్ విజయవంతం 

0

సొనాలలో బీసీ బంద్ విజయవంతం 

చిత్రం న్యూస్, సొనాల: ఆదిలాబాద్ జిల్లా సొనాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ బంద్ కు మద్దతుగా  కాంగ్రెస్ శ్రేణులు శివాజీ, అంబేద్కర్ చౌరస్తాలో నిరసన తెలిపారు. నాయకులు గాజుల పోతన్న, బత్తుల రమేష్ మాట్లాడుతూ.. ఏదైతే 42% స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లను కల్పించాలన్న దృఢ సంకల్పంతో అసెంబ్లీలో బిల్లు పెట్టి గవర్నర్ దగ్గరికి, అడ్డుకుంటున్నారని దేశవ్యాప్తంగా కేంద్రం జన గణన చేసి స్థానిక సంస్థలోనే కాకుండా విద్య, ఉద్యోగాల్లో కూడా 42 శాతం బీసీ రిజర్వేషన్లు కల్పించాలన్నారు. లేనియెడల దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ ల మద్దతుతో కాంగ్రెస్ శ్రేణులు ఉదృతమైన పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చెట్లపెళ్లి అనిల్, సీనియర్ నాయకులు కసిరే పోతన్న, పీఏసీఎస్ డైరెక్టర్ పోశెట్టి, బీసీ సెల్ అధ్యక్షులు, జుంగాల భోజన్న, రామాయి రాము, సుదర్శన్, అమృత్ రావ్, సోమన్న, సంతోష్ రెడ్డి, రాజేష్, చిలుకూరి నరేందర్, తదితరులు పాల్గొన్నారు.

దేశాన్ని కదిలించేలా బీసీ బంద్ సంపూర్ణం

0

దేశాన్ని కదిలించేలా బీసీ బంద్ సంపూర్ణం

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బైంసా బీసీ జేఏసీ తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర బంద్ కు జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది. తెలంగాణ జనసేన పార్టీ నిర్మల్ జిల్లా నాయకులు సుంకేట మహేష్ బాబు  శనివారం బీసీల రాష్ట్ర బంద్ ను విజయవంతం చేసిన అన్ని పార్టీ ప్రజా సంఘాల నాయకులకు, ప్రజలకు, వాణిజ్య, వ్యాపార విద్యా సంస్థలకు ధన్యవాదములు  తెలిపారు. తెలంగాణ బీసీ జేఏసీ తలపెట్టిన రాష్ట్ర బంద్ కు బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సుంకేట పోశెట్టి సంఘం తరపున సంపూర్ణ మద్దతు ప్రకటించారు.  భైంసా పట్టణం లోని అంబేద్కర్ విగ్రహం ముందర నిరసన తెలిపి మాట్లాడారు. బీసీ వాదాన్ని దేశాన్ని కదిలించేలా బంద్ ను విజయవంతం చేశారని వారు కొనియాడారు. బీసీల సత్తా ఏంటో చూపిస్థూ..బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు విడుదల చేసిన జీవో 9పై హైకోర్టులో స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాల నాయకులు, అన్ని రాజకీయ పార్టీ లు భైంసాలో నిరసన వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంతో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ బీసీల ఆత్మగౌరవం, రాజకీయ రిజర్వేషన్స్ లలో వాటా కోసం ఐక్య పోరాటాలు చేయాలన్నారు. బీసీ ఉద్యమానికి ఒక స్వరూపం వచ్చే సమయం ఆసన్నమైందని, స్వార్థ ప్రయోజనాలు వద్దన్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచిన ప్రతిసారీ రిజర్వేషన్ వ్యతిరేకులు కోర్టులను వేదికగా చేసుకుని అడ్డుకుంటున్నారని, కోర్టులు కూడా బీసీలకు న్యాయం చేయడం లేదని విమర్శించారు. నోటిఫికేషన్ ఉన్న నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలున్నా, స్టే విధించి బీసీల హక్కులకు విఘాతం కలిగించారని మండి పడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రెండు వారాల పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను వాయిదా వేయడం అన్యాయం అన్నారు. గత 75 ఏళ్లుగా బీసీల రాజ్యాధికారానికి ఆధిపత్య కులాలు, పాలక వర్గాలు అడ్డు పడటం దుర్మార్గం అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీసీలు ఐక్యమై ఒక శక్తిగా అవతరించడం ఎంతో ముఖ్యం అన్నారు. బీసీ రిజర్వేషన్స్ లపై హైకోర్ట్ స్టే బీసీలకు చీకటి రోజన్నారు. 42 శాతం రిజర్వేషన్స్ కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాలన్నారు. అవసరమైతే ఢిల్లీలో పోరాటాలకు సిద్ధమని అన్నారు. ఈ బీసీ బంద్ కార్యక్రమంలో, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, జనసేన పార్టీ ల నేతలు  పాల్గొన్నారు..

బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న శృంగేరి పీఠాధిపతి

0

బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న శృంగేరి పీఠాధిపతి 

*స్వాగతం పలికిన ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్

*ఆలయ పునర్నిర్మాణాన్ని మ్యాప్ ద్వారా వివరించిన ఎమ్మెల్యే

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతి స్వామి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు స్వామి వారిని పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ స్వామికి స్వాగతం పలికి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఆలయ పునర్నిర్మణాన్ని ఎమ్మెల్యే మ్యాప్ ద్వారా స్వామికి వివరించారు. పవిత్ర పుణ్య క్షేత్రం బాసర ను సందర్శించినందుకు ధన్యవాదాలు తెలిపారు. మీ సూచనలు సలహాలు తమకు ఎంతో అవసరమని స్వామీజీకి తెలియజేశారు. శృంగేరి పీఠాధిపతిగా అమ్మవారి చెంతకు రావడం ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. వ్యాసమహర్షి తపస్సు చేసిన ప్రాంతం సరస్వతి అమ్మవారు ఇక్కడ సాక్షాత్తు దర్శనం ఇవ్వడం ఇది ఎంతో పుణ్య భూమి అని విధుశేఖర భారతి స్వామి అన్నారు.

BC ల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బోథ్ లో బంద్ విజయవంతం

0

BC ల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బోథ్ లో బంద్ విజయవంతం

చిత్రం న్యూస్, బోథ్: జనాభా ప్రాతిపదికన, బీసీ జనాభా ప్రాతిపదికన, వెనుకబాటు ప్రాతిపదికన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోరుతూ శనివారం చేపట్టిన bc సంఘాల బంద్ విజయవంతం అయ్యింది. ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ..బీసీ బిల్లును వెంటనే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలన్నారు. దానికనుగుణంగా తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చేంతవరకు బీసీల ఐక్యవేదికగా నిరంతర  కార్యాచరణ చేపట్టాలని బస్టాండ్ లో రాస్తారోకో చేస్తూ నినాదాలు చేశారు.  ఈ కార్యక్రమంలో బీసీ నాయకులతోపాటు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి.

ఆబ్కారీశాఖ అధికారులకు వినతి పత్రం అందజేత

0

ఆబ్కారీశాఖ అధికారులకు వినతి పత్రం అందజేత

చిత్రం న్యూస్, బోథ్ : బోథ్ గ్రామంలో ఉన్న రెండు మద్యం షాపులతో పరిసరాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు ఆబ్కారీ శాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు .చుట్టూ ఉన్న నివాస గృహాలకు. మహిళలకు, స్కూల్ పిల్లలకు, హాస్పిటల్ రోగులకు, బాలికల హాస్టల్ విద్యార్థులకు, పరిసర ప్రాంతాల ప్రజలకు ఆటంకం కలుగుతుండడంతో కొత్తగా ఏర్పడ బోయే మద్యం షాపులను వీటికి దూరంగా ఏర్పాటు చేయాలని బోథ్ గ్రామస్తులు కోరారు.