Scientist చిత్రం న్యూస్, బేల :ఆదిలాబాద్ జిల్లా సీతగొంది మండలం మల్కాపూర్ గ్రామంలో వ్యవసాయ పరిశోధన స్థానం ఆదిలాబాద్ ఆధ్వర్యంలో కంది పంట పై క్షేత్ర దినోత్సవం నిర్వహించారు. శాస్త్రవేత్తలు డా.కె. రాజశేఖర్, డా.డి మోహన్ దాస్లు మాట్లాడుతూ..కంది రకం ‘WRGE-97’ ను రాబోయే కాలంలో ఎక్కువ మంది రైతులు ఈ విత్తనాలను వాడుకోవాలని సూచించారు. ఈ కంది రకం తక్కువ కాల పరిమితి కలిగి, ఎండు తెగుళ్లను తట్టుకొని అధిక దిగుబడి ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమనేది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విద్యాలయం చేపడుతున్న ” నాణ్యమైన విత్తనం- రైతన్నలు నేస్తం”(Quality seed at every village) కార్యక్రమంలో భాగమన్నారు. Aeo శ్రీధర్, రైతులు పాల్గొన్నారు.
బైరందేవ్, మహాదేవ్ ఆలయంలో ప్రారంభమైన జాతర
చిత్రం న్యూస్,బేల:ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సదల్ పూర్ గ్రామంలో అతిపురాతనమైన బైరందేవ్,మహాదేవ్ ఆలయంలో మంగళవారం నుండి జంగి జాతర ప్రారంభమైంది.కోరంగే వంశస్థులు, గ్రామ సర్పంచ్ దంపతులు గిరిజన సంప్రదాయం ప్రకారం డప్పుచప్పులు,భజనల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు.మహాదేవ్,భైరందేవ్ విగ్రహాలకు ప్రత్యేక పూలతో అభిషేకం చేశారు.ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కోరంగే సోనేరావ్ మాట్లాడుతూ బేల మండలంలోని సదల్ పూర్ బైరందేవ్,మహాదేవ్ ఆలయానికి ఎంతో విశిష్టత ఉందని, మహాదేవ్ ఆలయంలో కొలువైఉన్న శివలింగానికి భక్తులు తాము కోరిన కోరికలు నెరవేరతాయని ప్రఘాడ విశ్వాసంగా నమ్ముతారని పేర్కొన్నారు.జాతర వచ్చే భక్తుల కొరకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు.ఈ ఆలయానికి చుట్టు పక్కల గ్రామాల నుండే కాకుండా మహారాష్ట్ర, ఛత్తిస్ ఘడ్, మధ్యప్రదేశ్ నుండి భక్తులు భారీగా తరలివస్తారని పేర్కొన్నారు. శ్రీ మహాదేవుని ఆశీర్వాదాలు ఎల్లవేళలా భక్త జనులపై ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కొరంగే వంశస్థుల కోరుకున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బైరందేవ్,మహాదేవ్ ఆలయ కమిటీ చైర్మన్ శ్యామ్ రావ్,సర్పంచ్ మర్సకోలా మంగేష్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
భైరందేవ్, మహాదేవ్ ఆలయంలో శ్రీ సదలేశ్వర్ పుస్తక ఆవిష్కరణ
శ్రీ భైరందేవ్, మహాదేవ్ ఆలయంలో శ్రీ సదలేశ్వర్ పుస్తక ఆవిష్కరణ
చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సదల్ పూర్ గ్రామంలో శ్రీ భైరందేవ్,మహాదేవ్ ఆలయంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు చిందం ఆశన్న రచించిన శ్రీ సదలేశ్వర పుస్తక ఆవిష్కరణను ఆలయ కమిటీ చైర్మన్ కోరంగే శ్యామ్ రావ్ కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరణ చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆశన్న శ్రీ భైరందేవ్,మహాదేవ్ ఆలయ చరిత్ర విశిష్ట గురించి తన సువర్ణ అక్షరాలతో చాలా చక్కగా రాశారని ప్రముఖులు, ఆలయ కమిటీ సభ్యులు కొనియాడారు.ఈ సందర్బంగా చిందం ఆశన్న మాట్లాడుతూ. వెయ్యేళ్ళ చరిత్ర కలిగిన శ్రీ భైరందేవ్,మహాదేవ్ ఆలయ చరిత్ర తన ఒక్కరి వల్ల సాధ్యం కాలేదని దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపపారు. శాతవాహనుల కాలంలో నిర్మించిన పురాతన ఆలయంలో శ్రీ భైరందేవ్, మహాదేవ్ ఆలయం ఒకటి అని అన్నారు.శ్రీ సదలేశ్వర పుస్తకం తన మనవడికి అకింతం చేస్తున్నానని పేర్కొన్నారు.ఈ పుస్తకంలో ముఖ్యంగా గొండ్వాన చరిత్ర, స్వయంబుగా వెలసిన ఆ పరమేశ్వరని విశిష్ట, కాలభైరవుని విగ్రహం గురించి రచించడం జరిగిందన్నారు.
క్రీడా పోటీలకు ఎల్లప్పుడూ తమ వంతు సహకారం అందిస్తాం_అడనేశ్వర్ చైర్మన్ సతీష్ పవార్
చిత్రం న్యూస్,బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం హస్నాపూర్ గ్రామంలో గత మూడు రోజులుగా జై సేవాలాల్, జై కుమురంభీం యూత్ క్రీడామండల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ ముగింపు పోటీలు ముగింపుకు చేరాయి. ఈ బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ యువ నాయకుడు, అడానేశ్వర్ ఫౌండేషన్ ఛైర్మన్ సతీష్ పవార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సతీష్ పవార్ మాట్లాడుతూ..మండలంలో కబడ్డి, క్రికెట్ పోటీలు నిర్వహించినా తనవంతు సహకారం అందించామన్నారు. రానున్న రోజుల్లో మా సహాయ సహకారాలు ఎప్పుడైనా అందిస్తామన్నారు.గెలుపొందిన జట్టును అభినందించారు. మొదటి బహుమతి 21 వేలు మంగేష్ సర్పంచ్, నాయక్ లింబాజీ ఆధ్వర్యంలో, రెండో బహుమతి 15 వేలు అడానేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్ సతీష్ పవార్, 10 వేలు, అరుణ్ కొడప మాజీ ఎంపీటీసీ రూ.5వేలు , మూడో బహుమతి 7 వేలు, నాలుగో బహుమతి రూ.5,555 అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మంగేష్ మరస్కోలే, మాజీ ఎంపీటీసీ అరుణ్ కొడప,పోహార్ సర్పంచ్ జంగు, గ్రామ నాయక్ లింబాజీ,మాజీ ఉప సర్పంచ్లు మహదవ్ ,సంజయ్ గ్రామస్తులు యువకులు తదితరులు పాల్గొన్నారు.
చికాగో సర్వమత సమ్మేళనం – భారత ఆధ్యాత్మిక విజయం
1893లో అమెరికాలోని చికాగో నగరంలో సర్వమత సమ్మేళనం (World’s Parliament of Religions) నిర్వహించబడింది. ఈ సమ్మేళనం ప్రపంచంలోని వివిధ మతాల ప్రతినిధులు ఒక వేదికపైకి వచ్చి తమ మత సిద్ధాంతాలను వివరించిన చారిత్రక ఘట్టం.
ఈ సమ్మేళనంలో భారత్ తరఫున పాల్గొన్న స్వామి వివేకానంద గారి ప్రసంగం ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. ఆయన “సోదరులు మరియు సోదరీమణులారా” అనే మాటలతో ప్రసంగాన్ని ప్రారంభించగానే సభ మొత్తం చప్పట్లతో మార్మోగింది.
స్వామి వివేకానంద తన ప్రసంగంలో వేదాంతం, సర్వమత సమానత్వం, మానవత్వం, సహనం వంటి భారతీయ ఆధ్యాత్మిక విలువలను ప్రపంచానికి తెలియజేశారు. అన్ని మతాల సారాంశం ఒకటేనని, మతాల మధ్య ద్వేషం కాక ఐక్యత అవసరమని ఆయన బలంగా పేర్కొన్నారు.
ఈ సమ్మేళనం ద్వారా భారతదేశ ఆధ్యాత్మిక గొప్పతనం ప్రపంచానికి తెలిసింది. అప్పటి వరకు వెనుకబడిన దేశంగా భావించబడిన భారత్, ఒక ఆధ్యాత్మిక గురువుగా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
చికాగో సర్వమత సమ్మేళనం స్వామి వివేకానంద జీవితంలోనే కాదు, భారతదేశ చరిత్రలో కూడా ఒక మైలురాయి. ఇది నేటికీ సహనం, శాంతి, మానవ ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోంది.
స్వామి వివేకానంద క్విజ్ (MCQs)
1. స్వామి వివేకానంద గారి అసలు పేరు ఏమిటి?
A) రవీంద్రనాథ్ దత్తా
B) నరేంద్రనాథ్ దత్తా
C) సుభాష్ చంద్ర దత్తా
D) అరవింద్ దత్తా
✅ సరైన జవాబు: B
2. స్వామి వివేకానంద జన్మించిన సంవత్సరం ఏది?
A) 1856
B) 1861
C) 1863
D) 1870
✅ సరైన జవాబు: C
3. స్వామి వివేకానంద గారి జన్మస్థలం ఎక్కడ?
A) ముంబై
B) చెన్నై
C) కోల్కతా
D) వారణాసి
✅ సరైన జవాబు: C
4. స్వామి వివేకానంద గురువు ఎవరు?
A) దయానంద సరస్వతి
B) రామానుజాచార్యులు
C) రామకృష్ణ పరమహంస
D) శంకరాచార్యులు
✅ సరైన జవాబు: C
5. స్వామి వివేకానంద ప్రసిద్ధ చికాగో ఉపన్యాసం ఏ సంవత్సరంలో జరిగింది?
A) 1890
B) 1891
C) 1893
D) 1895
✅ సరైన జవాబు: C
6. చికాగో ఉపన్యాసం ప్రారంభంలో స్వామి వివేకానంద పలికిన మాటలు ఏమిటి?
A) నా దేశ ప్రజలారా
B) సోదరులు మరియు సోదరీమణులారా
C) గౌరవనీయులైన అతిథులారా
D) నా మిత్రులారా
✅ సరైన జవాబు: B
7. స్వామి వివేకానంద స్థాపించిన సంస్థ ఏది?
A) ఆర్య సమాజం
B) బ్రహ్మ సమాజం
C) రామకృష్ణ మిషన్
D) భారత సేవా సంఘం
✅ సరైన జవాబు: C
8. రామకృష్ణ మిషన్ స్థాపించిన సంవత్సరం ఏది?
A) 1893
B) 1895
C) 1897
D) 1901
✅ సరైన జవాబు: C
9. స్వామి వివేకానంద జయంతిని ఏ రోజున జాతీయ యువజన దినోత్సవంగా జరుపుతారు?
A) జనవరి 10
B) జనవరి 11
C) జనవరి 12
D) జనవరి 15
✅ సరైన జవాబు: C
10. “లేచి నిలబడి లక్ష్యాన్ని చేరేవరకు ఆగకండి” అనే సూక్తి ఎవరిది?
A) మహాత్మా గాంధీ
B) స్వామి వివేకానంద
C) రవీంద్రనాథ్ టాగూర్
D) సుభాష్ చంద్రబోస్
✅ సరైన జవాబు: B
స్వామి వివేకానంద – భారత యువతకు ప్రేరణ
స్వామి వివేకానంద భారతదేశపు గొప్ప ఆధ్యాత్మిక గురువులలో ఒకరు. ఆయన భారత సంస్కృతి, ఆధ్యాత్మిక విలువలను ప్రపంచానికి పరిచయం చేసిన మహానుభావుడు. యువతకు ఆత్మవిశ్వాసం, కర్తవ్య నిబద్ధత, దేశభక్తి వంటి గుణాలను నేర్పిన గొప్ప నాయకుడు.
జననం మరియు బాల్యం
స్వామి వివేకానంద 1863 జనవరి 12న కోల్కతాలో జన్మించారు. ఆయన అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. చిన్నప్పటి నుంచే నరేంద్రుడు తెలివైనవాడు, ధైర్యవంతుడు మరియు సత్యాన్వేషణలో ఆసక్తి కలిగినవాడు.
రామకృష్ణ పరమహంస శిష్యుడు
నరేంద్రనాథ్ దత్తా రామకృష్ణ పరమహంసను తన గురువుగా స్వీకరించారు. గురువు మార్గదర్శకత్వంతో ఆయన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందారు. తరువాత ఆయనకు “స్వామి వివేకానంద” అనే పేరు ప్రసిద్ధి చెందింది.
చికాగో ఉపన్యాసం
1893లో అమెరికాలో జరిగిన ప్రపంచ మత పార్లమెంట్లో స్వామి వివేకానంద ప్రసంగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. “సోదరులు మరియు సోదరీమణులారా” అనే మాటలతో ప్రారంభమైన ఆయన ఉపన్యాసం ప్రపంచాన్ని ఆకట్టుకుంది. భారతదేశ ఆధ్యాత్మిక గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేశారు.
యువతకు సందేశం
స్వామి వివేకానంద యువతను ఉద్దేశించి ఎన్నో ప్రేరణాత్మక మాటలు చెప్పారు.
“లేచి నిలబడి లక్ష్యాన్ని చేరేవరకు ఆగకండి” అనే ఆయన మాటలు నేటికీ యువతకు మార్గదర్శకంగా ఉన్నాయి. ఆయన శరీర బలం, మానసిక బలం, ఆత్మబలం అవసరమని చెప్పారు.
రామకృష్ణ మిషన్
1897లో స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ను స్థాపించారు. ఈ మిషన్ సేవా భావంతో విద్య, వైద్యం, సమాజ సేవలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది.
ముగింపు
స్వామి వివేకానంద జీవితం ప్రతి భారతీయుడికి ఒక ఆదర్శం. ఆయన ఆలోచనలు యువతను శక్తివంతంగా మారుస్తాయి. దేశాభివృద్ధికి కృషి చేయాలంటే ఆయన బోధనలు అనుసరించాల్సిందే. స్వామి వివేకానంద భారతదేశానికి గర్వకారణం.
సాంగిడి ఉప సర్పంచ్ జిమ్మ శేఖర్ ఉదారత
చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం కొత్త సాంగిడి గ్రామానికి చెందిన యువ ఉప సర్పంచ్ జిమ్మ శేఖర్ జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకొని సోమవారం జై హనుమాన్ యూత్ కు క్రికెట్ కిట్ అందజేసి ఉదారత చాటారు. జిమ్మ శేఖర్ అతి చిన్న వయసులోనే ఉప సర్పంచ్గా ఎన్నికయ్యారు. గ్రామ అభివృద్ధితో పాటు యువతను క్రీడలలో ప్రోత్సహిస్తూ తన ప్రత్యేకతను చాటుతున్నారు. క్రీడల పట్ల ఆసక్తి కలిగిన ఈ యువ నాయకుడు, యువతలో ఆత్మవిశ్వాసం, ఆరోగ్యశీలతను పెంపొందించేందుకు క్రీడలను ప్రోత్సహిస్తూ ఇటీవల గ్రామ యువకులకు క్రీడా సామగ్రి (బాల్స్, కిట్లు, జెర్సీలు) అందజేశారు. యువతే గ్రామ భవిష్యత్తు. వాళ్లను శారీరకంగా, మానసికంగా బలంగా తీర్చిదిద్దడం నా బాధ్యత అని జిమ్మ శేఖర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు సామ శ్రీపాల్ రెడ్డి, గోహార్ కార్ సూరజ్, గోహర్ కర్ సచిన్, రాహుల్, ప్రశాంత్ రెడ్డి, వెంకటేష్, అభి గన్నే, గుమ్మడి రాహుల్, సుంకరి గజానన్, పు రుషోత్తం, జైమని,వేదాంత్ రెడ్డి, గణేష్, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా రాజమాత జిజియాబాయి,స్వామి వివేకానంద జయంతి వేడుకలు
చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని శివాజీ చౌక్ వద్ద ఘనంగా రాజమాత జిజియాబాయి, స్వామి వివేకానంద జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు, విశ్వహిందూ పరిషత్ సభ్యులు రాజమాత జిజియాబాయి, స్వామి వివేకానంద చిత్రపటాలకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బేల మండల మరాఠా సంఘం అధ్యక్షుడు విఠల్ రావుత్ మాట్లాడుతూ..ప్రతి సంవత్సరం జనవరి 12న రాజమాత జిజౌ జయంతిని సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. భారతదేశం వీరమాతలకు పేరుగొన్నది అని అటువంటి వారిలో ఛత్రపతి శివాజీ మాతృమూర్తి వీరమాత జిజియాబాయి అని అన్నారు. మరాఠా యోధుల కుటుంబంలో పుట్టిన ఆమె హిందు ధర్మ పరిరక్షణకు కృషి చేశారని అన్నారు. అదేవిధంగా స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా పాటిస్తారు అని అన్నారు.వివేకానంద బోధనలు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ ఉత్తేజ పరుస్తునే ఉన్నాయని పేర్కొన్నారు. నేటి యువత వారి అడుగు జాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీ లకు చెందిన ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగాలి
చిత్రం న్యూస్, బేల: స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగాలని ఏబీవీపీ నేత మాడవార్ హరీష్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని ఏబీవీపీ ఆధ్వర్యంలో వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు. యువతీ,యువకులు అన్ని రంగాల్లో రాణిస్తూ వివేకానందుని స్పూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.నిరంతరం విద్యార్థుల సమస్యలపై పోరాటం చేసే ఏకైక సంఘం ఏబీవీపీ అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఇంద్ర శేఖర్, నాయకులు దత్తా నిక్కం,సందీప్ ఠాక్రే, రాము బర్కడే, నవీన్ పోత్ రాజ్, ఏబీవీపీ నాయకులు శివానీత్ వార్ ఓం ప్రకాష్, రేసు మనోజ్ రెడ్డి, తరుణ్, కట్కార్ల సాయి రెడ్డి, బాలాజీ, రేసు శివ రెడ్డి, ఉప్పల్ వార్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.
స్వామ








