Home Blog Page 129

ప్రభుత్వ బడుల్లోనే విద్యార్థులను చేర్పించాలి

ప్రభుత్వ బడుల్లోనే విద్యార్థులను చేర్పించాలి

*బొమ్మనపల్లి ప్రధానోపాధ్యాయులు పి. లక్ష్మణరావు


చిత్రం న్యూస్, చిగురుమామిడి:
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి జిల్లా పరిషత్తు ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.లక్ష్మణరావు కోరారు. సోమవారం పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు, అంగన్ వాడి టీచర్స్,ఉపాధ్యాయులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందన్నారు. ఈ విద్యా సంవత్సరం విద్యార్థుల నమోదు సంఖ్య పెంచడం గురించి కార్యాచరణ రూపొందించి చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విక్రమ్ కిరణ్ కుమార్, హై స్కూల్ ఉపాధ్యాయులు బాల్ రెడ్డి, సత్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
*బిపి షుగర్ వ్యాధులకు ఉచితంగా మందుల పంపిణీ.

*బొమ్మనపల్లి మెడికల్ ఆఫీసర్ గిరిజశ్రీ

చిత్రం న్యూస్, చిగురుమామిడి:
వర్షాకాలం ప్రారంభమవుతున్నందున సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని, అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి పీ హెచ్ సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గిరిజశ్రీ అన్నారు. సోమవారం బొమ్మనపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వారు మాట్లాడారు. నిల్వ ఉన్న నీటిలో దోమలు పెరిగి డెంగ్యూ వంటి విష జ్వరాలు వచ్చే ప్రమాదం ఉందని,పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. బీపీ, షుగర్ వ్యాధులకు ప్రభుత్వం మందులు ఉచితంగానే అందిస్తుందని, ప్రైవేటు లో మందులు కొనుక్కోని నష్టపోవద్దన్నారు. కరోనా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామంలో అభా కార్డ్స్ ల రిజిస్ట్రేషన్ ప్రతి ఒక్కర చేయించుకోవాలని, మహిళలకు ప్రత్యేకంగా ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో ఎవరికైనా జ్వరాలు వస్తే తమకు వెంటనే సమాచారం అందించాలన్నారు.

భక్తులతో కిటకిటలాడిన ఓదెల మల్లన్న ఆలయం

భక్తులతో కిటకిటలాడిన ఓదెల మల్లన్న ఆలయం.

*భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ ఈవో సదయ్య

చిత్రం న్యూస్, ఓదెల:
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చలువ పందిర్లు, మంచినీటి సౌకర్యం ఇతరత్ర పూర్తి ఏర్పాట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి బి. సదయ్య ఏర్పాట్లు చేశారు. భక్తులు మల్లికార్జున స్వామిని దర్శించుకుని గుడి ముందర పట్నం వేసి బోనం చెల్లించారు. కోరిన కోరికలు తీర్చే ఆ మల్లికార్జునుడు స్వామిని వేడుకున్నారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.

నకిలీ పత్తి విత్తనాలు అమ్మిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలి*

నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలి 
*రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న
చిత్రం న్యూస్, ఇచ్చోడ: మారుమూల గ్రామాల్లో అమాయక రైతులను నమ్మంచి నకిలీ పత్తి విత్తనాలు అంటగట్టిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షులు సంగెపు బొర్రన్న అన్నారు. సంక్షోభంతో కూడుకున్న వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించకుండా, మండల కేంద్రాలల్లోని మార్కెటింగ్ చేస్తున్న గ్రామీణ ప్రాంతంలో ఉన్న సబ్ డీలర్లు కలిసి రైతులకి అప్పురూపేణా కొంత వరకు ఆర్థిక సహాయం చేస్తూ చాటు మాటున మారుమూల గ్రామీణ అమాయక రైతులను ఆసరాగా చేసుకొని నకిలీ పత్తి విత్తనాలు అంటగడుతున్న దృశ్యాలు జిల్లాలో కోకొల్లలుగా ఉన్నాయ ని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని సబ్ డీలర్లపైనా నిఘా పెట్టవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు.
ప్రదానంగా వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం మూలంగానే నకిలీ పత్తి విత్తనాలు మార్కెట్లో విచ్చలవిడిగా అమ్ముడు పో తున్నాయన్నారు.
నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న వారిపై నిఘా పెట్టి విజిలెన్స్ అధికారులు నిఘా పెట్టాలన్నారు. నకిలీ పత్తి విత్తనాలు అమ్మిన వారిపై పీడీ యాక్ట్ ని నమోదు చేసి, ఎవరు నకిలీ విత్తనాలు అమ్మకుండా చూడవలసిన అవసరం ఉందన్నారు. రైతులు అనిల్, మోహన్, మాణిక్ రావ్ sk సలీమ్, తదితరులు ఉన్నారు.

ఓదెల లో లేబర్ కార్డు ఉన్నవారికి ఉచిత వైద్య పరీక్షలు*

*ఓదెల లో లేబర్ కార్డు ఉన్నవారికి ఉచిత వైద్య పరీక్షలు*

*ఓదెల గ్రామం మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ ఆధ్వర్యంలో పరీక్షలు

చిత్రం న్యూస్, ఓదెల:
పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామపంచాయతీ ఆవరణలో లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సి ఎస్ సి సెంటర్ ద్వారా టెక్నీషియన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో లేబర్ కార్డు ఉన్న వారందరికీ బీపీ, షుగర్, థైరాయిడ్ , కొలెస్ట్రాల్, క్యాన్సర్, హెచ్ఐవి, కిడ్నీ, ఇతరత్రా 50 పైగా వైద్య పరీక్షలు శనివారం నిర్వహించారు. 115 మందికి వైద్య పరీక్షలు చేశారు. లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని గ్రామ మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ తెలిపారు.

బంగర్ సిమెంట్ పై మేస్త్రీలకు అవగాహన సదస్సు*.

*బంగర్ సిమెంట్ పై మేస్త్రీలకు అవగాహన సదస్సు*.

నాణ్యతలో, దృఢత్త్వంలో, పెట్టింది పేరు బంగర్ సిమెంట్

బంగర్ సిమెంట్ పై మేస్త్రీలకు అవగాహన సదస్సు*.

చిత్రం న్యూస్, ఓదెల:

పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో గురువారం సాయంత్రం బంగర్ సిమెంట్ కంపెనీ ఆధ్వర్యంలో మేస్త్రీలకు అవగాహన సదస్సు నిర్వహించినారు అనంతరం బంగర్ సిమెంట్ కంపెనీ టెక్నికల్ ఆఫీసర్ శ్రీనివాసు మాట్లాడుతూ పేరు లో నాణ్యతలో, దృఢత్వంలో, ఎత్తయిన కట్టడాలకు పెట్టింది పేరు బంగర్ సిమెంట్ ను వాడండి అని మేస్తిర్లకు సిమెంటుపై అవగాహన సదస్సులో తెలిపారు . సదస్సులో పాల్గొన్న మేస్త్రీలకు గిఫ్ట్ బాక్స్ లు అందజేశారు ఈ కార్యక్రమంలో కనక లక్ష్మీ ట్రేడర్స్ డీలర్ గడిగొప్పుల సంతోష్ , మేస్త్రీలు చెట్ల అల్లోజి, బోడకుంట అంజి, గడ్డం చంద్రయ్య, కోటి, గట్టు రాకేష్, పోతుగంటి శ్రీనివాస్, పెండం మల్లేష్.
తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి వెళ్లే రైలు ఓదెలలో ఆపాలని కేంద్ర సహాయ మంత్రికి వినతిపత్రం అందజేత

తిరుపతి వెళ్లే రైలు ఓదెలలో ఆపాలని కేంద్ర సహాయ మంత్రికి వినతిపత్రం అందజేత

*సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి బండి సంజయ్

చిత్రం న్యూస్, ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల రైల్వే స్టేషన్ లో తిరుపతి ఎక్స్ప్రెస్ రైలు ఆపాలని నార్త్ తెలంగాణ రైల్వే ఫోరం ప్రధాన కార్యదర్శి కలవేని శ్రీనివాస్ కేంద్ర మంత్రి బండి సంజయ్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. కరీంనగర్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ని కలిసి పెద్దపల్లి లో పలు రైల్ల తో పాటు పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద దేవాలయమైన శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం వచ్చే భక్తుల సౌకర్యార్థం ఓదెల లో తిరుపతి రైలు హాల్టింగ్ ఇవ్వాలని వినతి పత్రం సమర్పించారు. దీనికి ఆయన సంబంధిత అధికారుల తో మాట్లాడతానని సానుకూలంగా స్పందించారని తెలిపారు. అదే విదంగా హుజురాబాద్ డిపో కు చెందిన జమ్మికుంట నుండి సుల్తానాబాద్ మధ్య నడిచే బస్ లను వయా ఓదెల కనగర్తి మీదుగా నడిపే విధంగా చూడాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా బిజెపి అధ్యక్షులు కర్రే సంజీవరెడ్డి తదితరులు ఉన్నారు

13 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్ 

13 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్

*నేరడిగొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు

*పేకాట ముక్కలు, రూ 14,080/- నగదు, ఆరు బైకులు, 13 మొబైల్ ఫోన్స్ స్వాధీనం

*నేరడిగొండ నీలిమా దాబా వెనకాల స్థలంలో పట్టుబడ్డ 13 మంది

చిత్రం న్యూస్, నేరడిగొండ: జిల్లావ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు విశ్వసనీయ సమాచారంతో నేరడిగొండ మండలం నీలిమ ధాబా వెనకాల పేకాట ఆడుతున్నారనే సమాచారంతో ఇచ్చోడ సిఐ బండారి రాజు, నేరడిగొండ ఎస్సై దాడి చేయగా సంఘటన స్థలంలో 13 మంది నేరస్తులు పట్టుబడ్డారని ఇచ్చోడా సీఐ బండారి రాజు తెలిపారు. వీరి వద్దనుండి పేకాట ముక్కలు రూ 14,080 నగదు, ఆరు బైక్లు, 13 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. పట్టుబడిన  వారిలో సయ్యద్ జహీర్, గడ్డం రవిచందర్ రెడ్డి, గూడూరు లవ కుమార్, రాథోడ్ రవీందర్, అల్లూరి శివారెడ్డి, ఉప్పు పోశెట్టి, సోలంకి శ్రీనివాస్, నల్ల అడెల్లు, సోలంకి కరన్ సింగ్, గోతి గులాబ్ సింగ్, మాడ గంగాధర్, అల్లూరి శ్రీనివాస్ రెడ్డి, పవర్ సంతోష్ లు ఉన్నట్లు వీరందరూ నేరడిగొండ దగ్గరలో ఉన్న గ్రామాలకు చెందిన వారని తెలిపారు. ఈ ఆపరేషన్ నందు ఇచ్చోడ సిఐ బండారి రాజు, నేరడిగొండ ఎస్ ఐ శ్రీకాంత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Odelah: 32 రైల్వే గేట్ నుండి రోడ్డు పనులు ప్రారంభం

*తారక రామ  కాలనీ వాసుల ఆకాంక్ష  ఈ రోడ్డు 

చిత్రం న్యూస్, ఓదెలః
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో 32 రైల్వే గేట్ నుండి డీ 86 కెనాల్ బ్రిడ్జి వరకు రూ. 7 లక్షల వ్యయంతో కాంగ్రెస్ నాయకులు రోడ్డు పనులను బుధ‌వారం జేసీబీ సాయంతో ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రం నుండి ఓదెల మండల ఆఫీస్ వరకు రెండు వరుసల రోడ్డు మంజూరు కాగా అనివార్య కారణాల వలన తారకరామ కాలనీ నుండి రోడ్డు పనులు నిలిచిపోగా ఎమ్మెల్యే చింతకుంట విజయ రామారావు చొరవతో 32 రైల్వే గేట్ తారకరామ కాలనీ నుండి డీ 86 కెనాల్ బ్రిడ్జి వరకు రోడ్డు పనులు పూర్తి చేయనున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తాజా మాజీ ఎంపిటిసి బోడకుంట లక్ష్మీ చిన్నస్వామి, చీకట్ల మొండయ్య, మీనుగు సంతోష్, గొర్ల శ్రీనివాస్, రాపల్లి రాజయ్య, అల్లం సతీష్, డాక్టర్ వెంకటేశ్వర్లు, క్యాతం తదితరులు ఉన్నారు

జగదాంబ దేవి ఆలయాన్ని దర్శించుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్

జగదాంబ దేవి ఆలయాన్ని దర్శించుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్

చిత్రం న్యూస్, బోథ్;

ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని బుగ్గారం గ్రామంలో గల శ్రీ జగదాంబ దేవి అలాయాన్ని బుధవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ దర్శించుకొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ను ఘనంగా సన్మానించారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, నాయకులు రాథోడ్ సురేందర్, నాని (నక్లు), పాండు, ప్రతాప్ తదితరులు ఉన్నారు.