Home Blog Page 120

రైతుల ఆత్మహత్యలు బాధాకరం.. జోగు రామన్న.

రైతుల ఆత్మహత్యలు బాధాకరం.. జోగు రామన్న.

చిత్రం న్యూస్,  సాత్నాల;

రైతుల ఆత్మహత్యలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టింపు లేదని కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో అన్నదాతల ఆత్మహత్యలు పెరిగిపోవడం బాధాకరమని, రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోకుండా ఆత్మ స్థైర్యంతో ఉండాలని మాజీ మంత్రి, బీ.ఆర్.ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. సాత్నాల మండలం సుందరిగి గ్రామానికి చెందిన కొప్పుల లచ్చన్న అనే రైతు ఇటివల ఆత్మహత్య చేసుకోగా…. బాధిత కుటుంబాన్ని మాజీ మంత్రి పరామర్శించారు. అప్పుల బాధతో తీవ్ర మనస్తాపానికి గురై రైతు ఆత్మహత్య చేసుకోవడం తీవ్రంగా కలిచివేసిందని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. కుటుంబ సభ్యులను కలిసి అధైర్య పడవద్దు అని ధైర్యాన్ని కల్పించారు.. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బంధు సైతం అందకపోవడం రైతుని తీవ్రంగా కల్చవేసిందన్నారు.దిక్కుతోచని స్థితిలో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.. రైతులు ఆత్మ స్థైర్యంతో ఉండాలని, అన్నం పెట్టె అన్నదాత ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడవడం మంచిది కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు కుటుంబాలలో తీవ్ర సంక్షోభం ఏర్పడే రైతు ఆత్మస్త్రాన్ని దెబ్బతీస్తుంది అన్నారు.. రైతులు ఎవరు అధైర్య పడకుండా ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు. మాజీ ఎంపిటిసి దేవన్న, సర్పంచ్ నర్సింగ్, పోచ్చన్న, కిష్టన్న, సంతోష్, పోతన్న, మునఫ్, కుమ్రా రాజు, ఉగ్గే విట్టల్ తదితరులు ఉన్నారు…

ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ కార్యక్రమం* 

  1. *ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ కార్యక్రమం                                                                                                                      చిత్రం న్యూస్ , ఆదిలాబాద్;  జైనథ్ మండల ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా విద్యాధికారి ఏ. శ్రీనివాస్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ఉమ్మడి జైనథ్ PSHM మరియు SGT ఉపాధ్యాయుల కు 5 రోజుల వరకు వృత్యంతర శిక్షణ కార్యక్రమంలిటిల్ ఫ్లవర్ స్కూల్ శాంతినగర్ లో నిర్వహిస్తున్నారు. శిక్షణ కార్యక్రమం గురించి కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. విద్యా విధానంలో సమూల మార్పులు చేయడానికి రాష్ట్ర విద్యాశాఖ సిద్ధంగా ఉంద ని ,విద్యార్థులు లకు నూతన విధానం లో బోధన జరిగేలా చూడాలని అందుకే పాఠశాల ప్రారంభంకు ముందే ఉపాధ్యాయులకు శిక్షణను ప్రభుత్వం ఇస్తుందన్నారు. ఈ శిక్షణ లో ఉపాధ్యాయులు చురుకుగా పాల్గొనలన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి గంగుల శ్రీనివాస్, జిల్లా సెక్టోరియల్ అధికారులు J నారాయణ, సుజాత్ ఖాన్, DEO CC రాజేశ్వర్, మండల రిసోర్స్ పర్సన్లు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, మండల ప్రధానోపాధ్యాయులు , ఉపాధ్యాయులు, mrc సిబ్బంది పాల్గొన్నారు.
ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్ రాజర్షి షా
[ez-toc]

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

హనుమంతుడి సింధూర పూజ కథ*

హనుమంతుడి సింధూర కథ

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:
హనుమంతుడి ఆలయాల్లో స్వామికి సింధూరాన్ని అలంకరించడం, భక్తులు దాన్నే బొట్టుగా పెట్టుకోవడం చూస్తుంటాం. మారుతికి సింధూరాన్ని అర్పిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయనే నమ్మకమూ ఉంది. సూటిగా చెప్పాలంటే ఒక్క హనుమాన్ ఆలయాల్లోనే కాషాయ రంగు సింధూరం కనిపిస్తుంది. అసలు, స్వామికి కుంకుమ బదులు సింధూరాన్ని అర్పించడం వెనుక చిన్న కథే ఉంది. హనుమంతుడు సీతాదేవి జాడ తెలుసుకునేందుకు లంకలోని అశోకవనానికి చేరుకున్నప్పుడు… వెంటనే సీతమ్మ దగ్గరకు వెళ్లలేదట. కాసేపు అమ్మవారిని గమనించాడట. ఆ సమయంలో ఆమె పాపిటలోని సింధూరాన్ని చూశాడట. ఆ తర్వాత సీతాదేవి చెంతకు వెళ్లినప్పుడు సింధూర ధారణకు కారణాన్ని అడిగి తెలుసుకున్నాడట. అప్పుడు సీతాదేవి… శ్రీరామచంద్రుడికి సింధూరం అంటే ఇష్టమనీ, స్వామి దీర్ఘాయుష్షు కోసం తాను ధరిస్తున్నాననీ వివరించిందట. కాస్త సింధూ రాన్ని ధరించినందుకే దీర్ఘాయుష్షు వస్తే, తాను కనుక శరీరమంతా లేపనంలా రాసుకుంటే రాముడికి ఎలాంటి సమస్య ఉండదని భావించాడట హనుమంతుడు. అదే సమయంలో స్వామి ప్రేమను ఇంకాస్త ఎక్కువగా పొందవచ్చనే ఉద్దేశంతోనూ తన ఒళ్లంతా సింధూరాన్ని రాసుకోవడం మొదలుపెట్టాడట. ఇదీ, సీతాశోక నివారకుడి సింధూర పూజ కథ.

రెడ్డి హాస్టల్ ప్రారంభోత్సవ కార్యక్రమం

 

 

*చిత్రం న్యూస్, ఆదిలాబాద్,* ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం ఉదయం 3:30 గంటలకు రెడ్డి హాస్టల్ ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం మొదలవుతుందని రెడ్డి సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నల్ల నారాయణ్ రెడ్డి, గోపిడి రాంరెడ్డి తెలిపారు. ఉదయం 9 గంటల నుండి కార్యక్రమాలు ప్రారంభమవుతాయని ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని గ్రామాల నుండి రెడ్డి బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

 

బొమ్మనపల్లిలో అగ్నిప్రమాదం

చిత్రం న్యూస్, చిగురుమామిడి,
కరీంనగర్ జిల్లా చిరుగుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే బొమ్మనపల్లి గ్రామానికి చెందిన ముత్యాల కొమురయ్య తండ్రి బక్కయ్య ( 42) అనే రైతుకు చెందిన వ్యవసాయ బావి వద్ద సోమవారం అర్ధరాత్రి సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రైతు కొమురయ్య పశువుల పాక ముందు వెళ్తున్న 11కే వీ విద్యుత్ వైర్లు ఒకదానికొకటి తాకడంతో మంటలు చెలరేగి పక్కనే ఉన్న పశువులపాక అంటుకొని, 1200 గడ్డి కట్టలు దగ్ధమయ్యాయని తెలిపాడు. ఈ ప్రమాదంలో ఆవు తీవ్రంగా గాయపడింది. డ్రిప్ వైర్లు ,టార్ఫాలిన్ కవర్లు పూర్తిగా కాలిపోయాయి. పశువులపాక కూడా కాలిపోయింది. రైతు కొమరయ్య అగ్నిమాపక  సిబ్బందికి సమాచారం అందించడంతో వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మంటలను అర్పారు. ఈ ప్రమాదంలో 5.0లక్షల వరకు నష్టపోయానని రైతు వాపోయాడు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని వేడుకున్నాడు.

*28న తెలంగాణ ఉద్యమకారులకు ఘన*28న తెలంగాణ ఉద్యమకారులకు ఘన సన్మానం*

**తెలంగాణ ఉద్యమకారులు భారీగా తరలి రావాలని పిలుపు*

 *చిత్రం న్యూస్ , ఓదెల;* 
ఈనెల 28న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారులకు ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య అన్నారు.  జిల్లాలో ఉన్న ప్రతి తెలంగాణ ఉద్యమ నాయకులు , నాయకురాలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఓదెల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
 ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు , పెద్దపెల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణరావు, రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ,ధర్మపురి శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ , చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి ,పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ  , తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ తదితర ప్రముఖులు హాజరవుతారన్నారు. కావున జిల్లాలో ఉన్న ఉద్యమకారులు భారీగా తరలి వచ్చి తమ ఐక్యతను తెలియజేయాలని కోరారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీపి కబురు చెప్పాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉద్యమ నాయకులు ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి , చర్లపల్లి సురేష్ గౌడ్ , పలకల నరసింహా రెడ్డి , నూతి శంకర్ ,కందుల అశోక్ ,వేల్పుల కుమార్ , బూరుగుపల్లి పుల్లారెడ్డి , లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. సన్మానం*

**తెలంగాణ ఉద్యమకారులు భారీగా తరలి రావాలని పిలుపు*

*చిత్రం న్యూస్ , ఓదెల;*
ఈనెల 28న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారులకు ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య అన్నారు. జిల్లాలో ఉన్న ప్రతి తెలంగాణ ఉద్యమ నాయకులు , నాయకురాలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఓదెల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు , పెద్దపెల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణరావు, రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ,ధర్మపురి శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ , చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి ,పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ , తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ తదితర ప్రముఖులు హాజరవుతారన్నారు. కావున జిల్లాలో ఉన్న ఉద్యమకారులు భారీగా తరలి వచ్చి తమ ఐక్యతను తెలియజేయాలని కోరారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీపి కబురు చెప్పాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉద్యమ నాయకులు ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి , చర్లపల్లి సురేష్ గౌడ్ , పలకల నరసింహా రెడ్డి , నూతి శంకర్ ,కందుల అశోక్ ,వేల్పుల కుమార్ , బూరుగుపల్లి పుల్లారెడ్డి , లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

ఓదెలలో పెళ్లికి హాజరైన మాజీ జెడ్పిటిసి గంట రాముల యాదవ్*

చిత్రం న్యూస్, ఓదెల; పెద్దపెల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో మారుతి ఫంక్షన్ హాల్లో శ్రీరామోజు లావణ్య శ్రీనివాసుల ప్రథమ పుత్రిక స్నేహ హరీష్ చారిల పెళ్లి వేడుకకు ఓదెల తాజా మాజీ జెడ్పిటిసి గంట రాములు యాదవ్ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. వీరి వెంట పోలోజు రమేష్, నరేష్, తదితరులు ఉన్నారు.
చిత్రం న్యూస్, ఓదెల:   

పెద్దపెల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో మారుతి ఫంక్షన్ హాల్లో శ్రీరామోజు లావణ్య శ్రీనివాసుల ప్రథమ పుత్రిక స్నేహ హరీష్ చారిల పెళ్లి వేడుకకు ఓదెల తాజా మాజీ జెడ్పిటిసి గంట రాములు యాదవ్ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. వీరి వెంట పోలోజు రమేష్, నరేష్, తదితరులు ఉన్నారు.

*ఓదెలలో పెళ్లికి హాజరైన మాజీ జడ్పీటీసీ గంట రాములు యాదవ్*

పెద్దపెల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో మారుతి ఫంక్షన్ హాల్లో శ్రీరామోజు లావణ్య శ్రీనివాసుల ప్రథమ పుత్రిక స్నేహ హరీష్ చారిల పెళ్లి వేడుకకు ఓదెల తాజా మాజీ జెడ్పిటిసి గంట రాములు యాదవ్ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. వీరి వెంట పోలోజు రమేష్, నరేష్, తదితరులు ఉన్నారు.

మహిమాన్విత పుణ్యక్షేత్రం జైనథ్ దేవాలయం

0
  1. జై జై శ్రీమన్నారాయణ

చిత్రం న్యూస్, ఆదిలాబాద్;

శ్రీలక్ష్మీనారాయణ !
లీలాయుత భక్తలోల ! ప్రియ పరిపాలా !
త్రైలోక్యధామ ! రక్షక !
పాలించగ దయను జూపు పావన చరితా !

jaind temple image
తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా పేరు వినగానే మొదట గుర్తుకొచ్చేది అతి ప్రాచీన మహిమాన్విత పుణ్యక్షేత్రం జైనథ్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయం. 12వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని అష్ట కోణాకృతిలో జైనులు నిర్మించారు. నల్ల రాయితో నిర్మించిన ఈ ఆలయంలో లక్ష్మీనారాయణ స్వామి మూలవిరాట్టు ఏకశిలతో తయారు చేశారు. ఆలయ నిర్మాణశైలి, అద్భుత కళా సంపద చూపరులను ఆకట్టుకుంటుంది.

ఆలయ ప్రత్యేకత

శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ఏడాదికి రెండుసార్లు స్వామివారి పాదాలను సూర్య భగవానుని కిరణాలు తాకుతుండడం ఈ ఆలయ ప్రత్యేకత. సూర్యకిరణాలు స్వామి పాదాలను తాకినప్పుడు స్వామి విగ్రహం బంగారు వర్ణంలో కాంతులీనుతూ దర్శనమిస్తాడు. ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారు. నల్ల రాతితో కట్టిన అద్భుత కట్టడాలను చూడడానికి రెండు కళ్ళు సరిపోవు.

Jainad temple laxmi narayana

ఘనంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు

శ్రీమన్నారాయణుని బ్రహ్మోత్సవాలు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మొదలవుతాయి. ద్వాదశి రోజున కల్యాణోత్సవం జరుగుతుంది. కార్తీక బహుళ పంచమి రోజున స్వామి వారి రథోత్సవం అశేష జన వాహిని నడుమ కనుల పండువగా సాగుతుంది. ఈ రథోత్సవం తిలకించేందుకు తెలంగాణ, మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తారు.

ఆకట్టుకుంటున్న విగ్రహాలు

ఆలయంలో ఆది దేవుడు గణపతితో పాటు చెన్నకేశవ స్వామి, పద్మనాభ స్వామి, గరుత్మంతుడు, హయగ్రీవ స్వామి విగ్రహాలు విశేషంగా ఆకట్టుకుంటాయి. పక్కన శివాలయం ఉంది. ఆలయ గోడలపై చెక్కిన శిల్పాలు జైనుల నాటి కళా నైపుణ్యానికి తార్కాణంగా నిలుస్తున్నాయి. ప్రతిరోజూ భక్తులతో ఆలయం కిటకిటలాడుతోంది. సుదూర ప్రాంతాలనుంచి భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు.

jainad laxminarayana swamy

జైనథ్ ఇలవేల్పు శ్రీమన్నారాయణుడు

కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారం శ్రీ లక్ష్మీనారాయణ స్వామిగాను, సకల శుభాలను కలుగజేసే శ్రీమన్నారాయణుడి గాను, సంతాన భాగ్యం కలుగజేసే
సత్యనారాయణ స్వామిగాను ఆ దేవ దేవుని భక్తులు కొలుస్తారు. అయిదు పున్నములు వచ్చేలా ఇక్కడ సత్యనారాయణ వ్రతాలు ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. కళ్యాణోత్సవం రోజు సాయంత్రం అర్చకులు గరుడ ముద్ద అందజేస్తారు. ఈ ప్రసాదం తింటే సంతానం కలగని వారికి సంతానం కలుగుతుందని ఇక్కడి భక్తులు విశ్వసిస్తారు.

jainad temple

ఇలా వెళ్ళవచ్చు

ఆదిలాబాద్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది జైనథ్ ఆలయం. ఈ ఆలయం చేరుకోవడానికి అరగంటకో బస్సు ఉంటుంది. జైనథ్ బేల, గడ్ చందూర్, చంద్రపూర్ బస్సులు వెళుతుంటాయి. బ్రహ్మోత్సవాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుంది.