Home Blog Page 103

సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం 

0

సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్న దృశ్యం

చిత్రం న్యూస్, పెద్దాపురం: ఎన్నికల సమయంలో కూటమి నేతలు లారీ డ్రైవర్స్, ఓనర్స్ కు గ్రీన్ టాక్స్ తగ్గిస్తామని చెప్పిన మాట నిలబెట్టుకుని, తక్షణమే దానిని అమలు చేసిన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు పెద్దాపురం మండలం లారీ ఓనర్స్ వెల్పేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్షీరాభీషేకం నిర్వహించారు. పెద్దాపురం పాండవుల మెట్ట వద్ద లారీ యూనియన్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిధి గా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామిబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో పెద్దాపురం మండలం లారీ ఓనర్స్ వెల్పేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సిరికి అప్పారావు, కార్యదర్శి కుంది కొండలరావు, కోశాధికారి యందమూరి రవి కుమార్, అసోసియేషన్ అధ్యక్షులు మట్టే శ్రీనివాస్ రావు, అధ్యక్షులు, రాష్ట్ర సివిల్ సప్లయ్ స్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, బుజ్జి, దిద్ది సత్యనారాయణ, కొప్పిశెట్టి వీరేంద్ర, గెడ్డం పెదకాపు, తూతిక రాజు, వల్లూరి సూర్యప్రకాష్ రావుతో పాటు పెద్ద సంఖ్యలో లారీ ఓనర్స్, డ్రైవర్స్ పాల్గొన్నారు.

✖ Close హోం

బేలలో  సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి

బేలలో  సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి

*మాట్లాడుతున్న ఎమ్మార్పీస్ మండల అధ్యక్షులు కృష్ణ పెళ్లి అంకుష్ మాదిగ 

చిత్రం న్యూస్,బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కృష్ణ పెళ్లి అంకుష్ మాదిగ అన్నారు. కెమెరాలు ఏర్పాటుకై శుక్రవారం ఎంపీడీవో, పోలీస్ అధికారులను కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మండల కేంద్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, ఛత్రపతి  శివాజీ విగ్రహాల దగ్గర, బస్టాండ్, మార్కెట్ తో పాటు ముఖ్యమైన ప్రదేశాలలో సీసీ కెమెరాలు లేకపోవడం వలన అసాంఘిక కార్యకలాపాలు జరగడమే కాకుండా కొంతమంది దొంగతనాలకు పాల్పడడం జరుగుతుందని అన్నారు. వీటిని అరికట్టేందుకు పకడ్బందీగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంకజ్ గణేష్, ఎం.అంకుష్ ఎం. గణేష్ ఆకాష్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

✖ Close హోం

దివిలి గ్రామంలో డోర్ టు డోర్  కార్యక్రమం నిర్వహించిన మార్కెట్ కమిటీ డైరెక్టర్ రేలంగి వెంకట్రావు

0

దివిలి గ్రామంలో డోర్ టు డోర్  కార్యక్రమం నిర్వహించిన మార్కెట్ కమిటీ డైరెక్టర్ రేలంగి వెంకట్రావు

చిత్రం న్యూస్ , పెద్దాపురం:  కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం దివిలి గ్రామంలో బూత్ నంబర్ 32,33,34 డోర్ టు డోర్ కార్యక్రమాన్ని మార్కెట్ కమిటీ డైరెక్టర్ రేలంగి వెంకట్రావు నిర్వహించారు. పెద్దాపురం నియోజవర్గ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. దివిలి గ్రామ కమిటీ ప్రెసిడెంట్ ఊడి శ్రీను, నానేపల్లి రఘు, ఆకుల ఈశ్వరరావు, పోకల రఘు, మాగాపు చందర్రావు, పాలాటి సత్తిబాబు, రెడ్డి శీను, మరికి వెంకటకృష్ణ, బూత్ ఇంచార్జ్ లు కార్యకర్తలు పాల్గొన్నారు.

✖ Close హోం

ఉపాధ్యాయ, ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి

తహసీల్దార్ నారాయణకు మెమొరాండం అందజేస్తున్న టీఎస్ యూటీఎఫ్  నేతలు

చిత్రం న్యూస్, జైనథ్:  ఉపాధ్యాయ, ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని జిల్లా కార్యదర్శి ఈ. శివన్న, మండల అధ్యక్షులు చిన్నయ్య అన్నారు. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (USPC) ఆధ్వర్యంలో జైనథ్ మండల తహసీల్దార్ నారాయణకు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సర్వీస్ సమస్యలను, ఆర్థికమైన సమస్యలను పెండింగ్లో ఉన్నందున వాటన్నిటిని తక్షణమే పరిష్కరించాలని, ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. అన్ని క్యాడర్ల ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల షెడ్యూల్ ను వెంటనే ప్రకటించాలన్నారు. 5571 పీఎస్ హెచ్ఎం పోస్టులను మంజూరు చేయాలని, కొత్తగా ఏర్పడిన జిల్లాలకు డీఈవో పోస్టులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ నివేదికను తెప్పించుకొని వెంటనే ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాలని, రిటైర్డ్ అయిన ఉద్యోగులకు పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. 317 జీవో ద్వారా నష్టపోయిన ఉపాధ్యాయులకు వెంటనే వాళ్ళ సొంత జిల్లాలకు సర్దుబాటు చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ పిలుపునిచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో  టీఎస్ యూటీఎఫ్ మండల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి విఠల్, కార్యదర్శి అరె.శ్రీనివాస్, మైసా విఠల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

✖ Close హోం

బేలలో  ఘనంగా మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు

బేలలో  మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న  బీఆర్ఎస్ నేతలు

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మాజీ జడ్పీటీసి క్యాంప్ కార్యాలయం లో గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఆ పార్టీ శ్రేణుల నడుమ ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. యువ నాయకులు సతీష్ పవార్ మాట్లాడుతూ..మాజీ మంత్రి కేటీఆర్ ఐటీ శాఖకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఠాక్రే  గంభీర్, మండల అధ్యక్షులు కళ్ళెం ప్రమోద్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి విపిన్ ఖోడె, మాజీ సర్పంచుల సంఘం అద్యక్షులు మస్కె తేజరావు, నాయకులు గోడం సునీల్, విఠల్ వరాడె, ఆకాష్ గుండావార్, కృనాల్ పర్తాడె, దత్తా గోడె, రాజు తదితరులు పాల్గొన్నారు.

✖ Close హోం

కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా బాలింతలకు కేసీఆర్ కిట్ పంపిణీ

కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా బాలింతలకు కేసీఆర్ కిట్ పంపిణీ చేస్తున్న తుల శ్రీనివాస్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు తుల శ్రీనివాస్

చిత్రం న్యూస్, సొనాల: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా పరిసర ప్రాంతాల మహిళలకు తుల శ్రీనివాస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో కేసీఆర్ కిట్లు పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా తుల శ్రీనివాస్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు, తుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్  రాష్ట్రంలోని ఐటీ విభాగంలో ఎంతో సేవలందించి నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించిన మహానేత అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి బాలింత మహిళలకు కేసీఆర్ కిట్ల పంపిణీ అందించేవారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పేద మధ్యతరగతి మహిళలకు కేసీఆర్ కిట్టును పంపిణీ చేయాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తుల శ్రీనివాస్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా కేసీఆర్ కిట్ల పంపిణీ నిరంతరం ఉంటుందని, మహిళలు ఎవరైనా డెలివరీ ఆయిన తర్వాత తుల శ్రీనివాస్ వెల్ఫేర్ సొసైటీ కి సమాచారం అందిస్తే కేసీఆర్ కిట్టును అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తుల శ్రీనివాస్ వెల్ఫేర్ సొసైటీ వైస్ చైర్మన్ ఇర్ల అభిలాష్, యువ నాయకులు సుధీర్ రెడ్డి, చిన్నయ్య , హరీష్ , సోషల్ మీడియా కన్వీనర్ భీంరావు పాటిల్ , సోనాల మరియు బోథ్ గ్రామ కమిటీ అధ్యక్షుడు సోమన్న, అల్లకొండ ప్రశాంత్ , మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, మండల సర్పంచులు సురేందర్ యాదవ్, దేవేందర్, బాబు సింగ్, మాజీ ఎంపీటీసీ లంక లలిత రాయల్, నాయకులు ఈశ్వర్, సంతోష్, యువకులు, మహిళలు పాల్గొన్నారు.

✖ Close హోం

యువశక్తి యూత్ ఆధ్వర్యంలో పెన్నులు,  నోట్ బుక్స్ పంపిణీ

యువశక్తి యూత్ ఆధ్వర్యంలో పెన్నులు,  నోట్ బుక్స్ పంపిణీ చేస్తున్న తుల హరీష్

చిత్రం న్యూస్,  సొనాల: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా సొనాల మండల కేంద్రంలో సూర్యనగర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో యువ శక్తి యూత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిల్లను యూత్ అధ్యక్షులు తుల హరీష్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ ఉపాధ్యక్షులు గాజుల సుగుణకర్, సభ్యులు గొల్లపెల్లి సందీప్, గొల్లపెల్లి శ్రీనివాస్, కోస్మెట్టి శరత్, తుల గణేష్, లక్కకుల కన్నా, కేంద్రే మహేష్ పాల్గొన్నారు

✖ Close హోం

ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

భోరజ్: కేటీఆర్ జన్మదినం సందర్భంగా కేకు కట్ చేస్తున్న బీఆర్ఎస్  తాజా మాజీ వైస్ ఎంపీపీ విజయకుమార్, సర్పంచుల సంఘం మాజీ మండల అధ్యక్షుడు మద్దుల ఊశన్న 

చిత్రం న్యూస్, భోరజ్:  బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను భోరజ్ మండల కేంద్రంలో గురువారం ఘనంగా నిర్వహించారు. తాజా మాజీ వైస్ ఎంపీపీ సావాపురే విజయకుమార్, సర్పంచుల సంఘం మాజీ మండల అధ్యక్షుడు మద్దుల  ఊశన్న కేకు కట్ చేశారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు.  అనంతరం చిన్నారులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో  ఏఎంసీ మాజీ చైర్మన్ ముక్కెర ప్రభాకర్, మాజీ ఎంపీటీసీలు కోల భోజన్న, కట్కర్ల మహేందర్, మాజీ సర్పంచ్ నోముల సంతోష్ రెడ్డి, నాయకులు పురుషోత్తం యాదవ్, బట్టు సతీష్, రమేష్, గుంజాల అశోక్ రెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

✖ Close హోం

జైనథ్ లో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు 

జైనథ్: కేటీఆర్ జన్మదినం సందర్భంగా కేకు కట్ చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు

చిత్రం న్యూస్, జైనథ్: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పుట్టిన రోజు వేడుకలను జైనథ్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జైనథ్ మండల కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేశారు. మిఠాయిలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో Brs పార్టీ జనరల్ సెక్రటరీ  గణేష్ యాదవ్, విలేజ్ పార్టీ ప్రెసిడెంట్ పూండ్రువెంకట్ రెడ్డి, తాజా మాజీ సర్పంచ్ దేవన్న, దుమాల స్వామి , ఈర్గల సతీష్,తిపరెడ్డి రమేష్ రెడ్డి, లచ్చరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

✖ Close హోం

ఎన్నికలెప్పుడొచ్చిన సిద్ధంగా ఉండాలి

 నిరాలలో మాట్లాడుతున్న  ఎమ్మెల్యే శంకర్ తనయుడు పాయల్ శరత్

చిత్రం న్యూస్, జైనథ్: ఎన్నికలెప్పుడొచ్చిన  పార్టీ శ్రేణులు సిద్దంగా ఉండాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్, యువ నాయకుడు, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తనయుడు పాయల్ శరత్ అన్నారు. జైనథ్ మండలంలోని నిరాలలో ఓ ఫంక్షన్ హాల్ లో మండల స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో  పోటీచేసే అభ్యర్థులను గెలిపించే బాధ్యత మన అందరిపై ఉందని ,నిత్యం ప్రజలతో మమేకమై వాళ్ళకి ఏ కష్టం వచ్చిన  కార్యకర్తలు ముందుండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు గురించి ప్రజలకి తెలయజేయాలని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎండ్రాల నగేష్, పార్లమెంట్ కన్వీనర్ మయూర్ చంద్ర, బీజేపీ ఆదిలాబాద్ అసెంబ్లీ కన్వీనర్ భోయర్ విజయ్, జడ్పీటీసీల ఇంచార్జ్ దత్త థాక్రె, ఎంపీటీసీల ఇంచార్జ్ కుర్సంగి సీతారామ్, మాజీ మండల అధ్యక్షుడు కట్కం రాందాస్, జైనథ్, భోరజ్ మండలాల అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, సన్నీ, బీజేపి సీనియర్ నాయకులు టి.రాకేష్ రెడ్డి, సామ రమేష్ రెడ్డి, ప్రతాప్ యాదవ్, ఏనుగు రాకేష్ రెడ్డి, గొడుగుల సత్యనారాయణ, వెంకన్న, సిడాం రాకేష్ , వెంకట్ రెడ్డి, సంతోష్, విశాల్, సూర్య రెడ్డి, శక్తి కమిటీ, బూత్ కమిటీల అధ్యక్షులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

✖ Close హోం