Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం
Home Blog Page 103

అనారోగ్యంతో వార్డ్ మెంబర్ మృతి

0

అనారోగ్యంతో వార్డ్ మెంబర్ మృతి

చిత్రం న్యూస్, ఓదెల:  పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని మాజీ వార్డ్ మెంబర్ బోగే కనకమ్మ అనారోగ్యంతో మృతిచెందింది. గత రెండు నెలల నుండి అనారోగ్యంతో బాధపడుతూ గురువారం ఉదయం మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు . బాధిత కుటుంబాన్ని మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, మాజీ వార్డ్ మెంబర్లు పరామర్శించారు.

ఈ శ్రమ్ పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలి

0

ఈ శ్రమ్ పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలి
*సహాయ కార్మిక అధికారి డి.రవీందర్

చిత్రం న్యూస్, ఓదెల:
పెద్దపెల్లి జిల్లా మంథని పరిధిలో కొరియర్ హోమ్ సర్వీసెస్ ,ఫుడ్ డెలివరీ, ఏసి టెక్నీషియన్స్, గ్రాఫిక్ డిజైనర్స్, వీడియో ఎడిటర్స్, వంటి విధులు చేసేవారు ఈ శ్రమ్ పోర్టల్ లో వారి యొక్క పేర్లను నమోదు చేసుకోవాలని సహాయ కార్మిక అధికారి డి. రవీందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శక్తి అమెజాన్, ఫ్లిప్ కార్డ్, జోమాటో, స్విగ్గి వంటి సంస్థలో పనిచేసే వారిని కార్మికులుగా గుర్తిస్తూ ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను వర్తింపజేస్తుందన్నారు. హెల్ప్ లైన్ నెంబర్ 14434 కు ఫోన్ చేసి సందేహాలను పరిష్కరించుకోవాలని సూచించారు.

తరోడ వాగులో గలంతైన దత్తు మృతదేహం లభ్యం

0

తరోడ వాగులో గల్లంతైన దత్తు మృతదేహం లభ్యం

చిత్రం న్యూస్, భోరజ్: జైనథ్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన లాండే దత్తు భోరజ్ మండలం తరోడ వాగులో మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో బైక్ పై వెళ్తుండగా వాగు ఉధృతికి గల్లంతయిన విషయం విధితమే… పోలీసులు జాలర్లతో కలిసి గాలింపు చర్యలు చేపట్టగా గురువారం ఉదయం పూసాయి వాగులో మృతదేహం లభ్యమయ్యింది.  మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.

జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో సురవరం ప్రతాపరెడ్డి జయంతి వేడుకలు.

0

జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో సురవరం ప్రతాపరెడ్డి జయంతి వేడుకలు.

చిత్రం న్యూస్, కేశపట్నం
జర్నలిస్టు రంగానికి వన్నెతెచ్చిన సీనియర్ పాత్రికేయుడు గోల్కొండ పత్రిక సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డి అని శంకరపట్నం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కోరేం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.  సురవరం ప్రతాపరెడ్డి 129వ జయంతి వేడుకలను బుధవారం శంకరపట్నం మండలంలోని కేశవపట్నం అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా సురవరం ప్రతాపరెడ్డి చిత్రపటానికి తహసిల్దార్ సురేఖ,  జడ్పీటీసీ మాజీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్, ఆలయ చైర్మన్ ఉప్పుగల్లు మల్లారెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బసవయ్య గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంట మైపాల్, ఏఎస్ఐ సుధాకర్, మాజీ ప్రజా ప్రతినిధులు రాములు, గట్టు తిరుపతి గౌడ్,గాండ్ల తిరుపతి,మోత్కూరి సమ్మయ్య, జర్నలిస్టులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, కొరిమి వెంకటస్వామి,,దేవునూరి రవీందర్,, బూర్ల వెంకటేష్, నేరెళ్ల సంతోష్, కొరిమి సంతోష్, కత్తెరమళ్ళ కిరణ్,చింతం వెంకటేష్, గొర్ల అనిల్, తాళ్లపల్లి సాగర్, ఎల్కపల్లి సుధీర్, సంపత్ రెడ్డి, రాకేష్, తుమ్మ సుధాకర్, సురేష్, ప్రణదీప్, రంజిత్, తిరుపతి, అనిత్, పెద్ది గట్టయ్య, నరేష్, పోచయ్య తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా “రాణి అహల్యా బాయి హోల్కర్” 300 జయంతి ఉత్సవాలు

0

ఘనంగా “రాణి అహల్యా బాయి హోల్కర్” 300 జయంతి ఉత్సవాలు

చిత్రం న్యూస్, సామర్లకోట: ఘనంగా "రాణి అహల్యా బాయి హోల్కర్" 300 జయంతి ఉత్సవాలు

కాకినాడ జిల్లా సామర్లకోటలోని శ్రీ కుమార రామ భీమేశ్వర స్వామి వారి ఆలయం లో కేంద్ర, రాష్ట్ర బిజెపి పార్టీ పిలుపు మేరకు ” రాణి అహల్య భాయ్ హోల్కర్” 300 జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.  ఈ  కార్యక్రమం లో బిజెపి సీనియర్ నాయకులు వల్లూరి బుల్లియ్య , కూనం శెట్టి అర్జునుడు, జనీ మోజెస్, తుమ్మల పల్లి శివ, చుక్క వెంకటరమణ, విజయలక్ష్మి, రఘు సాయి,. చిట్టిబాబు,, N. శ్రీను, S.వెంకటేశ్వరరావు పుప్పాల నాగ గోవిందు, సామర్లకోట టౌన్ బిజెపి ప్రెసిడెంట్ తదితరులు పాల్గొన్నారు.

ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలి

0

ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలి

*సైదాపూర్ మండల ఆటో కార్మికుల ఆవేదన

చిత్రం న్యూస్, సైదాపూర్:

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో సైదాపూర్ మండల ఆటో కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం ఆటో కార్మికులకు రూ.12,000 ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినప్పటికీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీని అమలు చేయలేకపోయిందని కార్మికులు ఆరోపించారు. ఈ వైఫల్యం వల్ల ఆటో కార్మికుల జీవనోపాధి దెబ్బతిని, ఆర్థిక ఇబ్బందులతో కొందరు ఆత్మహత్యలకు పాల్పడినట్లు వారు ఆవేదన వెలిబుచ్చారు. స్థానిక ఆటో కార్మికులైన పొడిశెట్టి నరేష్, పిల్లి నరేష్, గడ్డం శ్రీధర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఉచిత బస్సు పథకం వంటి విధానాలతో తమ ఉపాధిని కోల్పోయేలా చేసిందని, హామీ ఇచ్చిన ఆర్థిక సాయం అందకపోవడంతో తమ కుటుంబాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని వాపోయారు. మా బతుకులు గాడినపడాలంటే ప్రభుత్వం వెంటనే స్పందించి, హామీ ఇచ్చిన రూ.12,000 సాయాన్ని అందించాలి. చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలి అని వారు డిమాండ్ చేశారు. ఆటో కార్మికుల హామీలను నెరవేర్చి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలని ఆటో కార్మిక సంఘాలు కోరుతున్నాయి.

ఘనంగా కడప మహానాడు

0

ఘనంగా కడప మహానాడు
*టీడీపీ పార్టీ జెండాను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు నాయుడు
*మహానాడులో పాల్గొన్న పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప


చిత్రం న్యూస్, పెద్దాపురం:
కడపలో మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. మహానాడు మొదటిరోజు సీఎం చంద్రబాబు నాయుడు జ్యోతి ప్రజ్వలన చేశారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ప్రజా ప్రతినిధుల నమోదు, ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. మా తెలుగు తల్లి గీతాలాపన అనంతరం మరణించిన పార్టీ కార్యకర్తలకు, నేతలకు ప్రజాప్రతినిధులతో కలిసి సంతాపం ప్రకటించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించగాపెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్పతో కలిసితిలకించారు.

సామర్లకోటలో యోగా శిక్షణా తరగతులు ప్రారంభం

0

సామర్లకోటలో యోగా శిక్షణా తరగతులు ప్రారంభం

*యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్
*మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో యోగా శిక్షణా తరగతులు ప్రారంభించిన ఎంపీడీఓ హిమ మహేశ్వరి[ez-toc]

చిత్రం న్యూస్, సామర్లకోట: కాకినాడ జిల్లా సామర్లకోట మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో యోగా శిక్షణా తరగతులను ఎంపీడీవో హిమామహేశ్వరి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 21 వ తారీఖున 11వ అంతర్జాతీయ యోగాంధ్ర నిర్వహించనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సామర్లకోట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో యోగా ట్రైనర్స్ చేత వివిధ రకాల యోగాసనాల సాధన చేయించారు. ఎంపీడీఓ హిమ మహేశ్వరిమాట్లాడుతూ.. ఈ నెల 31 వ తారీకు వరకు ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు శిక్షణ తరగతులు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో మండల కార్యాలయ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.

సైదాపూర్‌లో మాజీ సర్పంచ్‌ల ముందస్తు అరెస్ట్

1

సైదాపూర్‌లో మాజీ సర్పంచ్‌ల ముందస్తు అరెస్ట్ 


*పెండింగ్  బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్

చిత్రం న్యూస్, సైదాపూర్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాంచంద్రాపూర్, దుద్దెనపల్లి, చింతలపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌లను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ లు రేగుల సుమలత అశోక్, మేకల శిరీష ముకుంద రెడ్డి, యుగంధర్ రెడ్డి పోలీస్ స్టేషన్‌లో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామపంచాయతీలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను చెల్లించకుండా, మాజీ సర్పంచ్‌లను మానసికంగా, ఆర్థికంగా ఇబ్బంది పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు రోజుల క్రితం గ్రామపంచాయతీలకు సంబంధించి 153 కోట్ల 10 లక్షల రూపాయల విలువైన 9,990 బిల్లులు, అలాగే 85 కోట్ల రూపాయల ఎస్‌డీఎఫ్ గ్రాంట్ చెల్లించినట్లు పత్రికల ద్వారా ప్రకటించింది. అయితే, ఈ బిల్లులు కేవలం పంచాయతీ కార్యదర్శులు, కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన చిన్న చిన్న పనులకు మాత్రమే చెల్లించారు. మాజీ సర్పంచ్‌లు చేసిన పనులకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేము గతంలో గ్రామాల్లో రోడ్లు, హైమాస్ట్ లైట్లు, గ్రామపంచాయతీ భవనాలు, మురుగు కాలువలు వంటి మౌలిక సదుపాయాలను కల్పించాము. ఈ అభివృద్ధి సేవలను ప్రజలు ఇప్పటికీ వినియోగిస్తున్నారు. అయినా మా బిల్లులు ఎందుకు చెల్లించడం లేదు? అసలు బిల్లులు చెల్లిస్తారా? చెల్లించరా? అనే గందరగోళంలో మాజీ సర్పంచ్‌లు మానసిక ఆందోళనకు గురవుతున్నాం,” అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెద్ద కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయలు కమిషన్లతో సహా చెల్లిస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, గ్రామస్థాయిలో ప్రజల కోసం చేసిన పనులకు బిల్లులు చెల్లించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. మాజీ సర్పంచ్‌లు చేసిన పనులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని, మా పనులను గుర్తించి, పెండింగ్ బిల్లులు త్వరగా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ డిమాండ్ చేశారు.

సిరిసిల్ల క్యాంపు కార్యాలయంపై దాడిని ఖండిస్తున్నాం

0

సిరిసిల్ల క్యాంపు కార్యాలయంపై దాడిని ఖండిస్తున్నాం

*కేటీఆర్ సేన పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మ్యాడగోని శ్రీకాంత్ గౌడ్

చిత్రం న్యూస్, ఓదెల:

సిరిసిల్లలో మాజీ మంత్రి కేటీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ దాడి చేయడాన్ని ఖండిస్తున్నామని కేటీఆర్ సేన పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మ్యాడగోని శ్రీకాంత్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని మడక గ్రామంలో శ్రీకాంత్ గౌడ్ మాట్లాడారు. నేషనల్ హెరాల్డ్ కేసు, మిస్ వరల్డ్ అవమాన ఘటన ప్రజల దృష్టిని మళ్లించడానికేనని ఆరోపించారు. సిరిసిల్లలో ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. సిరిసిల్ల క్యాంపు కార్యాలయంపై దాడిని ఖండిస్తున్నాం

కాంగ్రెస్ వాదులు దాడిచేయడానికి యత్నించగా నాయకులు ధైర్యంగా అడ్డుకున్నారని, ఈ ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రజాపాలన అని చెప్పుకుని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న నాయకులపై దాడులకు దిగడం సిగ్గుచేటని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చే దాకా ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని నిరంతరం నిలదీస్తామన్నారు.