Home Blog Page 101

మహిళలకు ఇచ్చిన హామీలను పూర్తి చేయాలి- జోగు రామన్న

సమావేశంలో మాట్లాడుతున్న  మాజీ మంత్రి  జోగు రామన్న

చిత్రం న్యూస్, సాత్నాల: సమస్యలు తీర్చమని  ఎమ్మెల్యేను  కలడానికి వెళ్లిన ప్రజలతో ప్రభుత్వం మనది లేదని మాట్లాడి చేతులు దులుపుకోవడం పరిష్కారం కాదని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. సోమవారం సాత్నాల మండలం లో ముందస్తుగా స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రామ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని జోగు రామన్న పిలుపునిచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలపై వివరించాలన్నారు. ఈ కార్యక్రమం లో సాత్నాల మండల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మొదట సీతారామ మందిరంలో జోగు రామన్న ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్యకర్తలతో సమావేశం నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికల ఫై దిశా నిర్దేశం చేశారు. మాజీ మంత్రి జోగు రామన్న  మాట్లాడుతూ.. గత ప్రభుత్వ బీఆర్ఎస్ హయాంలో ప్రతి మరుమూల గ్రామాలకు కోట్ల రూపాయలు వెచ్చించి కమిటీ హాలు, రైతు వేదికలు, గ్రామ రోడ్ల నిర్మాణాలు, తో పాటు స్కూల్లో పునరుద్ధరణ, ఆలయాల నిర్మాణాలు పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు.  మహిళలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ లు యాసం నర్సింగ్ రావు, మెట్టు ప్రహ్లాద్, నాయకులు దేవన్న, బుచ్చన్న, వేణు యాదవ్, ఉగ్గే విఠల్ తదితరులు పాల్గొన్నారు.

✖ Close హోం

అభివృద్ధిని చూసి బీజేపీలో చేరిక 

బీజేపీలో చేరుతున్న వారికి పార్టీ కండువా కప్పుతున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:  ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీజేపీ లో చేరుతున్నారని ఎమ్మెల్యే పాయల్ శంకర్  అన్నారు. సోమవారం ఆదిలాబాద్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జైనథ్ మండలం ఆనంద్ పూర్ లో యువ నాయకుడు విశాల్ ఆధ్వర్యంలో సాత్నాల మండలం సాంగ్వి గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీలో చేరారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. అన్ని రాష్ట్రాలతో సమానంగా తెలంగాణ రాష్ట్రానికి సైతం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. బీజేపీలో పనిచేయడం అంటే దేశ రక్షణ కోసం పనిచేయడం అని పేర్కొన్నారు. యువత బీజేపీలో చేరడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.  బీజేపీ పార్టీ జైనథ్ మండల అధ్యక్షుడు లోక కరుణాకర్ రెడ్డి, బీజేవైఎం జైనథ్ మండల అధ్యక్షుడు తిప్పిరెడ్డి రాకేష్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

✖ Close హోం

సరిహద్దు గ్రామాల ప్రజలు అక్రమ రవాణాను అడ్డుకోవాలి -జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ 

యువతకు వాలీబాల్ కిట్ ను అందజేస్తున్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ 

*విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదవాలి

*యువత గంజాయి, పేకాట, మట్కా లాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి

*కోరట, గిమ్మ, తరోడ గ్రామాల ప్రజలతో పోలీసు మీకోసం కార్యక్రమం

*మూడు గ్రామాల యువతకు స్పోర్ట్స్ కిట్స్ అందజేత

చిత్రం న్యూస్, భోరజ్: సరిహద్దు గ్రామాల ప్రజలు అక్రమ రవాణాను అడ్డుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలంలోని మహారాష్ట్ర సరిహద్దు లోని  చనాక కోరాట ప్రాజెక్టును జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్  సందర్శించి నది ప్రవాహ పరిస్థితులను పరిశీలించారు. అదేవిధంగా పెన్ గంగా బ్రిడ్జి వద్ద నది ప్రవాహాన్ని పరిశీలించి యువత ఈతకు రాకుండా తగు జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు. యువత చెడు వ్యసనాల బారిన పడకుండా సన్మార్గం వైపు పయనించేలా కొరాట, గిమ్మ, తర్నం మూడు గ్రామాల ప్రజలు యువతతో పోలీసు మీకోసం కార్యక్రమంలో భాగంగా చైతన్య పరిచారు. జిల్లాలో భారీ వర్షాలు దృష్ట్యా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని, బ్రిడ్జిల పైనుండి వరదలు ప్రవహిస్తున్నప్పుడు వాటిని దాటకుండా ఉండాలని, అత్యంత వర్షం పడినప్పుడు ఉరుములు వచ్చినప్పుడు చెట్ల కింద ఉండకుండా ఉండాలని సూచించారు.

గ్రామాల ప్రజలను ఉద్దేశించి  మాట్లాడుతూ ముఖ్యంగా మహారాష్ట్ర తో సరిహద్దుతో ఉన్నందున అక్రమంగా దేశీదారు తరలించకుండా యువత చెడు వ్యసనాల బారిన పడకుండా ప్రజలు జిల్లా పోలీసు యంత్రాంగానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని సూచించారు. గ్రామాలలో వీడీసీ వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధమని, విడిసి ల ద్వారా ఎలాంటి అక్రమ పరిస్థితులు నెలకొన్న దానికి జిల్లా పోలీస్ యంత్రాంగానికి తెలియజేయాలని సూచించారు. అలాగే యువతకు విద్యార్థులకు చదువు యొక్క ప్రాధాన్యతను తెలియజేసి ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధించే దిశగా కృషి చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామాలలో గంజాయిని పండించకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, గంజాయి వల్ల యువత భవిష్యత్తును కోల్పోతూ ప్రభుత్వ పథకాలు వర్తించకుండా ఉంటాయని గమనించాలన్నారు. వర్షాకాలం దృష్ట్యా యువత విద్యార్థులు జలపాతాలు, నదులు వాగులు వంటి వాటి వద్ద జాగ్రత్తలు వహించాలని, ఈతరానివారు వాటి వద్దకు వెళ్ళకుండా ఉండాలని తెలిపారు. లోతట్టు బ్రిడ్జిల పైనుండి నీటి ప్రవాహం జరిగినప్పుడు వాటిని దాటకుండా ఉండాలని పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. యువత చదువుతోపాటు క్రీడారంగంలో కూడా అభివృద్ధి చెందాలని మూడు గ్రామాల ప్రజలకు యువతకు మూడు వాలీబాల్ స్పోర్ట్స్ కిట్స్ అందజేసి ప్రోత్సహించారు. చెడు వ్యసనాల బారినపడిన యువతకు ప్రత్యేకంగా డౌ సెంటర్ల ద్వారా చికిత్స అందించి నయం చేకూర్చవచ్చని తెలిపారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ ద్విచక్ర వాహనదారులు ముఖ్యంగా హెల్మెట్ ను ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, జైనథ్ సీఐ డి సాయినాథ్, ఎస్సై గౌతమ్, మూడు గ్రామాల ప్రజలు, పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

✖ Close హోం

రాంటెక్ ఆలయాన్ని సందర్శించిన మాజీ మంత్రి జోగురామన్న

రాంటెక్ ఆలయంలో మాజీ మంత్రి జోగురామన్న

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ లో 12వ శతాబ్దానికి చెందిన అతి పురాతన రాంటెక్ ఆలయాన్ని మాజీ మంత్రి జోగురామన్న సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రాముఖ్యతను అడిగి తెలుసుకున్నారు. వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. ప్రత్యేక పూజలను నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు భోజనం వడ్డించారు. అతి పురాతన ఆలయాన్ని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న తెలిపారు. హిందూ ధర్మ ఆలయంగా రాం టెక్ నిర్మాణం ఎంతో ఆకర్షణీయంగా ఉందన్నారు. శ్రీ రాముడి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు. కారింగుల ప్రణయ్ ఉన్నారు.

✖ Close హోం

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి

బోథ్ సీ హెచ్ సీలో ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి, ప్రోహిబిషన్  &ఎక్సైజ్ కమిషనర్ హరి కిరణ్ , జిల్లా కలెక్టర్ రాజర్షి షా

చిత్రం న్యూస్, బోథ్: ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి, ప్రోహిబిషన్ &ఎక్సైజ్ కమిషనర్ హరి కిరణ్ వైద్య సిబ్బందికి సూచించారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ సీ హెచ్ సీ ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తో కలిసి ఆదివారం ఆయన తనిఖీ చేశారు. ఆసుపత్రి సిబ్బంది వివరాలు ఆరా తీశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాలను  పరిశీలించారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున  సిబ్బంది  అప్రమత్తంగా ఉండాలన్నారు. డీఎంహెచ్ఓ రాథోడ్ నరేందర్ ఉన్నారు. అంతకుముందు గుడిహత్నూర్ లో ఆయన పర్యటించారు.

✖ Close హోం

వినాయక్ రావ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపకారవేతనాలు

 విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేస్తున్న ట్రస్టు ఛైర్మన్ (విశ్రాంత న్యాయమూర్తి) శ్యామ్ మోహన్ రావు దేశ్ పాండే

చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ లో  వినాయక్ రావ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదివి ప్రతిభ కనబర్చిన  ఆరుగురు విద్యార్థులకు ఉపకారవేతనాలు అందజేశారు. ట్రస్టు చైర్మన్ శ్యామ్ మోహన్ రావు దేశ్ పాండే (విశ్రాంత న్యాయమూర్తి) మనవరాలు శివాని సహకారంతో విద్యార్థులు M.నందిని, K.లక్ష్మి, j.శ్రీనిత, N.రచన, D.విఠల్, R.స్వాతిలకు ఒక్కొక్కరికీ రూ.8 వేల చొప్పున విద్యార్థులకు ఉపకార వేతనాలను ఆయన అందజేశారు. ఆయన మాట్లాడుతూ..గత 22 సంవత్సరాల నుండి  పదోతరగతి లో  ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు  ఈ ఉపకార వేతనాలు అందిస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలను కొనసాగిస్తామని ట్రస్ట్ చైర్మన్ శ్రీ శ్యామ్ మోహన్ రావు దేశ్ పాండే తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వైస్ చైర్మన్ శ్రీ వామన్ రావు దేశ్ పాండే, ,సెక్రటరీ అంబదాస్, ట్రస్ట్ సభ్యులు, న్యాయవాదులు, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు . అనంతరం బోథ్ గ్రామస్తులు  ట్రస్ట్ చైర్మన్ శ్రీ శ్యామ్ మోహన్ రావు దేశ్ పాండే ను సన్మానించారు.

 

✖ Close హోం

వజ్జర్ అంగన్వాడీ భవనాన్ని అద్దె భవనంలోకి మార్చండి

( చిత్రం న్యూస్, ఎఫెక్ట్ )

*త్వరలో నూతన భవనం  ఏర్పాటు చేస్తాం

*అంగన్వాడీ  కేంద్రాన్ని సందర్శించిన జిల్లా సంక్షేమ అధికారిణి మిల్కా

చిత్రం న్యూస్, సొనాల:ఆదిలాబాద్ జిల్లా సొనాల మండలంలోని ఆదివాసీ మారుమూల గ్రామం వజ్జర్  అంగన్వాడీ కేంద్రాన్ని ఐసీడీఎస్ జిల్లా సంక్షేమ అధికారిణి మిల్కా శనివారం సందర్శించారు. వజ్జర్  అంగన్వాడీ కేంద్రం పరిస్థితి గోసగా ఉంది. ఈ కేంద్రం ప్రభుత్వ పాత బిల్డింగ్ లో కొనసాగుతుంది.  వర్షం వస్తే అంతే సంగతి. నీరు కారడంతో  అక్కడ ఉండలేని పరిస్థితి. కూర్చుందామంటే కింద  నీళ్లు ఉంటాయి. భవనం శిధిలావస్థకు చేరడంతో పిల్లలు భయాందోళన నడుమ బిక్కు బిక్కుమంటూ ఉంటున్నారని ఈ నెల 25 న శుక్రవారం వజ్జర్  అంగన్వాడీ కేంద్రంలో  గోస అని ఆర్టికల్  “చిత్రం న్యూస్” లో  పబ్లిష్ అయ్యింది. స్పందించిన ఐసీడీఎస్ జిల్లా సంక్షేమ అధికారిణి మిల్కా 26న  శనివారం సందర్శించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ జంగుబాయిని, అంగన్వాడీ టీచర్  సుశీలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాన్ని వెంటనే అద్దె భవనంలోకి మార్చాలని సూచించారు. నూతన భవనం పనులను త్వరలోనే పూర్తి చేస్తామని గ్రామస్తులకు తెలిపారు. దీంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

✖ Close హోం

నాగభూషణం స్కూల్లో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్

నాగభూషణం స్కూల్లో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్

చిత్రం న్యూస్, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని నాగభూషణం స్కూల్లో కార్గిల్ విజయ్ దివస్ ను శనివారం ఘనంగా నిర్వహించారు.  అమర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. మన మాతృభూమి కోసం పోరాడి, శాంతి భద్రతలను కాపాడిన వీరులను గుర్తుంచుకుందాం అంటూ విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కిషోర్. ఉపాధ్యాయులు. విద్యార్థులు పాల్గొన్నారు.

కార్గిల్ విజయ్ దివస్ ను ఎందుకు జరుపుకుంటారు..?

కార్గిల్ విజయ్ దివస్ ప్రతి సంవత్సరం జూలై 26న జరుపుకునే ఒక జాతీయ పండగ. 1999లో కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం పాకిస్తాన్ సైన్యంపై విజయం సాధించింది. ఈ యుద్ధంలో అమరవీరులైన సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి ధైర్యం, పరాక్రమాన్ని గౌరవిస్తూ ఈ రోజును కార్గిల్ విజయ్ దివస్ గా జరుపుకుంటారు. 1999 ఫిబ్రవరిలో భారత్ పాకిస్తాన్ దేశాలమధ్య ఒప్పందం కుదిరింది. కానీ, కాశ్మీర్ ను ఆక్రమించుకోవాలన్ని కుట్రతో పాకిస్తాన్ సైన్యం ఆపరేషన్ బదర్ పేరిట ఉగ్రవాదులను భారత సరిహద్దుల్లోకి పంపించింది. 1999, మే 3న కార్గిల్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి భారత్, పాకిస్థాన్ మధ్య కార్గిల్ యుద్ధం ప్రారంభమయింది. దీనిని భారత సైన్యం ఆపరేషన్ విజయ్ అనే కోడ్ నేమ్ ను పెట్టుకుంది. అంతటి చలిలో, మంచు పర్వతాల్లో దాదాపు 60 రోజుల పాటూ జరిగిన యుద్ధంలో ఇరుదేశాల సైనికులు చాలామంది చనిపోయారు. 527 మంది భారత సైనికులు అమరులయ్యారు. చివరికి జూలై 26న భారత భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ సైన్యాన్ని తిప్పికొట్టి, భారతదేశ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం ద్వారా భారత్ విజయం సాధించింది. అందువల్ల ప్రతి ఏటా జూలై 26ను కార్గిల్ విజయ దినోత్సవంగా  జరుపుకుంటాం.

 

✖ Close హోం

మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

0

అవగాహన సదస్సులో మాట్లాడుతున్న 7 వ అదనపు జిల్లా జడ్జి చంద్రమౌళీశ్వరి

చిత్రం న్యూస్, పెద్దాపురం: మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని  7వ అదనపు జిల్లా జడ్జి చంద్రమౌళీశ్వరి అన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మున్సిపల్ ఆఫీస్ లో శనివారం ఉదయం 11 గంటలకు మెప్మా మహిళా గ్రూప్ సభ్యులకు  నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 7 వ అదనపు జిల్లా జడ్జి చంద్రమౌళీశ్వరి మాట్లాడారు. మహిళలకు  ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి, మహిళల అక్రమ రవాణా, బాల్యవివాహాలు, ఇతర చట్టాలపై అవగాహన కల్పించారు. అనంతరం  మండల న్యాయ సేవాధికార సంఘం సర్వీసెస్ కు సంబంధించి మెప్మా మహిళా గ్రూపు  నిర్వహిస్తున్న  వస్తువు విక్రయాల  స్టాల్స్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సెక్రటరీ ఎస్కే వల్లి బాబు, ఇతర బార్ సభ్యులు, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి ,పెద్దాపురం సీఐ విజయ శంకర్ ,ఎస్ఐ మౌనిక, మండల న్యాయ సేవాధికారి సంఘం పానెల్ లాయర్లు, పారా లీగల్ వాలంటీర్లు, మెప్మా గ్రూప్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

✖ Close హోం

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి

విద్యార్థికి బ్యాగును అందజేస్తున్న ముడుపు మౌనిష్ రెడ్డి

చిత్రం న్యూస్, బేల: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. విద్యార్థులకు చేయూత కార్యక్రమంలో భాగంగా తన వంతుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నోట్ బుక్కులు, బ్యాగులు, అందిస్తున్నానని తెలిపారు. శనివారం బేల మండలం కొబ్బాయి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు బుక్స్, పెన్నులను, బ్యాగులను అందజేశారు. అంతకు ముందు గ్రామస్తులు మౌనిష్ రెడ్డిని శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం మౌనిష్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు మంచిగా చదివి గ్రామానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నగేష్, ఉపాధ్యాయులు సుభాష్, లీనా, దీప, గ్రామస్తులు నానాజీ పటేల్, దేవరావు గేడం,దుర్యోదన్, జయేంద్ర, త్రియాంబక్, సీతారాం, మనోజ్, సందీప్ టాక్రె, సచిన్ తదితరులు ఉన్నారు.

✖ Close హోం