చిత్రం న్యూస్, గురజాల: గత రెండు రోజుల క్రితం గురజాల మండలం తేలుకుట్ల గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బత్తుల ఏడుకొండలు రౌడీ మూకల దాడిలో గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణదేవరాయలు శుక్రవారం ఆయన్ను పరామర్శించారు. గుంటూరులోని సంజీవని ఆసుపత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు నాగార్జునసాగర్ కుడి కాలువ ప్రాజెక్టు చైర్మన్ పులుకూరి కాంతారావు, కూటమి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

