చిత్రం న్యూస్, జైనథ్: జైనథ్ మండలం దీపాయిగూడ గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని, స్థానిక యువత, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు ఘన నివాళులు అర్పించారు.ఈ వేడుకల్లో భాగంగా దీపాయిగూడలోని చిన్నారులు కాషాయ కండువాలు ధరించి, “జై భవాని.. జై శివాజీ” అంటూ నినాదాలు చేస్తూ సందడి చేశారు.శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాజీ మహారాజ్ చూపిన ధైర్యం, దేశభక్తి, ఆయన పరిపాలన దక్షతను చిన్నారులకు వివరించారు. హిందూ ధర్మ రక్షణ కోసం ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా కొనియాడారు.గ్రామంలో కాషాయ జెండాలతో అలంకరించి, పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు. ఈ సందర్బంగా గడ్డం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..చిన్నతనం నుండే పిల్లల్లో దేశభక్తిని, వీరత్వాన్ని పెంపొందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.

