చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ పద్దతిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లోక ప్రవీణ్ రెడ్డిని శాలువాతో సత్కరించారు. డాక్టర్లను రెన్యూవల్ చేయడంలో లోక ప్రవీణ్ రెడ్డి మంగళవారం కీలక పాత్ర పోషించి సమస్యను పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన్ను రిమ్స్ కాంట్రాక్ట్ డాక్టర్లు శాలువాతో సత్కరించారు. ధన్యావాదాలుతెలిపారు. కార్యక్రమంలో వినోద్ భల్ల, రవీందర్, రవీందర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, లర్ఫానుద్దీన్, సచిన్ రెడ్డి, మనోహర్ స్వామి తదితరులు ఉన్నారు.

