చిత్రం న్యూస్, ఆదిలాబాద్: గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్ లో నిర్వహించిన వేడుకలలో ఆయా ప్రభుత్వ రంగాలలో పనిచేస్తున్న ఉత్తమ అధికారులకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో అసిస్టెంట్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సిరాజొద్దీన్ సోమవారం 77 వ ఘనతంత్ర దినోత్సవ సందర్బంగా ప్రశంసా పత్రాన్ని అందుకోగా రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జై సింగ్ రాథోడ్ తోపాటు పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే తన సేవలను గుర్తించి ప్రశంసా పత్రాన్ని అందించినందుకు ఎవరు సందర్బంగా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

