చిత్రం న్యూస్, బేల: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బేల పంచాయతీ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన సామూహిక సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మండల కేంద్రంలోని 13 ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఇందులో పాల్గొని నృత్య ప్రదర్శన, స్కిట్లతో అద్భుతంగా ఆకట్టుకున్నారు. దేశభక్తి ఉట్టిపడేలా చిన్నారులు ప్రదర్శించిన ప్రదర్శనలు ఉర్రూతలూగించాయి. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ భాగ్యలక్ష్మి దేవన్న, ఉప సర్పంచ్ ప్రకాష్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి వేణుగోపాల్, వార్డు సభ్యులు, కళాశాల ప్రిన్సిపల్ భగవాండ్లు, వివిధ పార్టీల నేతలు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.

